logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి: ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ ఎమ్మిగనూరు ప్రతినిధి జులై 31 న్యూస్.. జర్నలిస్టుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా శుక్రవారం ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం లో అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏపీడబాల్యూ జే ఎఫ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గిబ్సన్, తాలూకా అధ్యక్షులు ఎస్ కే షబ్బీర్ మాట్లాడుతూ,రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని,వృద్ధాప్య జర్నలిస్టులకు పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై ఎక్కడైనా దాడులు జరిగిన వెంటనే స్పందించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మార్చి నెలలో జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ మహాసభలో ప్రభుత్వం, సమాచార శాఖ మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ గౌరవ అధ్యక్షులు, గిబ్సన్,దేవేంద్ర మూర్తి, తాలూకా అధ్యక్షులు ఎస్ కే.షబ్బీర్ ఉపాఅధ్యక్షులు ఎరుకల వెంకటేష్,సెక్రటరీ నాగరాజునాయుడు శంకర్,ఖలిల్,రాజు విజయ,సోహెల్,సునీల్, రహీమాన్,మోష,సురేంద్ర లక్ష్మన్న,తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

9 hrs ago
user_బి.శ్రీనివాసులు
బి.శ్రీనివాసులు
ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago
e88f34bf-28c8-43ad-b850-51d149b4d460

జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి: ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ ఎమ్మిగనూరు ప్రతినిధి జులై 31 న్యూస్.. జర్నలిస్టుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా శుక్రవారం ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం లో అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏపీడబాల్యూ జే ఎఫ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గిబ్సన్, తాలూకా అధ్యక్షులు ఎస్ కే షబ్బీర్ మాట్లాడుతూ,రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని

815b4269-9035-47e3-ac3d-971672bee876

డిమాండ్ చేశారు.జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని,వృద్ధాప్య జర్నలిస్టులకు పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై ఎక్కడైనా దాడులు జరిగిన వెంటనే స్పందించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మార్చి నెలలో జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ మహాసభలో ప్రభుత్వం, సమాచార శాఖ మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ గౌరవ అధ్యక్షులు, గిబ్సన్,దేవేంద్ర మూర్తి, తాలూకా అధ్యక్షులు ఎస్ కే.షబ్బీర్ ఉపాఅధ్యక్షులు ఎరుకల వెంకటేష్,సెక్రటరీ నాగరాజునాయుడు శంకర్,ఖలిల్,రాజు విజయ,సోహెల్,సునీల్, రహీమాన్,మోష,సురేంద్ర లక్ష్మన్న,తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

More news from Jogulamba Gadwal and nearby areas
  • జూరాలకు భారీ వరద.. 17 గేట్లు ఎత్తివేత దిగినన్న శ్రీశైలం ప్రాజెక్టు విడుదల గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 1,04,375 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 17 గేట్లను ఎత్తి 67,235 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 317.59 మీటర్లు (1,041.962 అడుగులు) గా నమోదైంది. ప్రాజెక్టు స్థూల సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.817 టీఎంసీల నీటి నిల్వ ఉంది. లైవ్ స్టోరేజ్ 4.11 టీఎంసీలుగా నమోదైంది. జూరాల జలవిద్యుత్ కేంద్రం ద్వారా 37,906 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్–1కు 1,300, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315 క్యూసెక్కులు, ఎల్‌ఎంసీకి 870, ఆర్‌ఎంసీకి 500, ప్యారలల్ కెనాల్‌కు 600, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 1,09,519 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
    1
    జూరాలకు భారీ వరద.. 17 గేట్లు ఎత్తివేత దిగినన్న శ్రీశైలం ప్రాజెక్టు విడుదల
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 1,04,375 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 17 గేట్లను ఎత్తి 67,235 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు నీటిమట్టం 317.59 మీటర్లు (1,041.962 అడుగులు) గా నమోదైంది. ప్రాజెక్టు స్థూల సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.817 టీఎంసీల నీటి నిల్వ ఉంది. లైవ్ స్టోరేజ్ 4.11 టీఎంసీలుగా నమోదైంది.
జూరాల జలవిద్యుత్ కేంద్రం ద్వారా 37,906 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్–1కు 1,300, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315 క్యూసెక్కులు, ఎల్‌ఎంసీకి 870, ఆర్‌ఎంసీకి 500, ప్యారలల్ కెనాల్‌కు 600, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మొత్తంగా ప్రాజెక్టు నుంచి 1,09,519 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    15 hrs ago
  • రణ్బీర్ కపూర్ సాయి పల్లవి నటించిన రామాయణం ట్రైలర్ పై మిశ్రమస్తు స్పందన మొన్న విడుదల చేసిన రామాయణం పార్ట్ వన్ ట్రైలర్ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు రణబీర్ కపూర్ కన్నా యాష్ యాక్టింగ్ డామినేషన్ చేశాడని రావణాసురుడి పాత్రలలో పలువురు కామెంట్ చేశారు సీత పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోయిందని కొందరు సరిగ్గా సెట్ కాలేదని కొందరుకామెంట్ చేస్తున్నారు టైలర్లో హనుమంతుడు కనిపించకపోవడంతో ట్రైలర్ ఇన్ కంప్లీట్ గా ఉందని విస్మయం చెందుతున్నారు బిఎఫ్ ఎక్స్ మ్యూజిక్ బాగుంది అని అంటున్నారు
    1
    రణ్బీర్ కపూర్ సాయి పల్లవి నటించిన రామాయణం ట్రైలర్ పై మిశ్రమస్తు స్పందన
మొన్న విడుదల చేసిన రామాయణం పార్ట్ వన్ ట్రైలర్ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు రణబీర్ కపూర్ కన్నా యాష్ యాక్టింగ్ డామినేషన్ చేశాడని  రావణాసురుడి పాత్రలలో పలువురు కామెంట్ చేశారు సీత పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోయిందని కొందరు సరిగ్గా సెట్ కాలేదని కొందరుకామెంట్ చేస్తున్నారు  టైలర్లో హనుమంతుడు కనిపించకపోవడంతో ట్రైలర్ ఇన్ కంప్లీట్ గా ఉందని  విస్మయం చెందుతున్నారు బిఎఫ్ ఎక్స్ మ్యూజిక్ బాగుంది అని అంటున్నారు
    user_Palla  karunakar
    Palla karunakar
    Astrologer వనపర్తి, వనపర్తి, తెలంగాణ•
    16 hrs ago
  • నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా
    2
    నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం
నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు.
జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు.
రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా
    user_Shaik abdul mazeed
    Shaik abdul mazeed
    Local News Reporter Nandyal, Andhra Pradesh•
    7 hrs ago
  • నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న స్తంభాలు తొలగించాలి నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వార్డులలో పర్యటించి శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించాలన్నారు. వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
    1
    నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న  స్తంభాలు తొలగించాలి
నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వార్డులలో పర్యటించి శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించాలన్నారు. వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ టీయూ లోగో ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.
    1
    తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ టీయూ లోగో  ను  తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    8 hrs ago
  • నాగర్ కర్నూల్ జిల్లా వి బి జి రాంజీ ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం నాగర్ కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జి - సాంకేతిక సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాంకేతిక సహాయకులు ఏపీవోలు,ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఆ సంఘం జేఏసీ చెర్మన్, వాయిస్ చెర్మన్, నాయకులు మాట్లాడుతూ....వీబీజీ రామ్ జి పథకం లో 2006 నుంచి పనిచేస్తున్నాము. మాకు పే స్కెల్ అమలుచేసి తమ సమస్యలు పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో 20 మండలాల వీబిజి రాంజీ ఉద్యోగులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జి - సాంకేతిక సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాంకేతిక సహాయకులు ఏపీవోలు,ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఆ సంఘం జేఏసీ చెర్మన్, వాయిస్ చెర్మన్, నాయకులు మాట్లాడుతూ....వీబీజీ రామ్ జి పథకం లో 2006 నుంచి పనిచేస్తున్నాము. మాకు పే స్కెల్ అమలుచేసి తమ సమస్యలు పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో 20 మండలాల వీబిజి రాంజీ ఉద్యోగులు పాల్గొన్నారు.
    1
    నాగర్ కర్నూల్ జిల్లా వి బి జి రాంజీ ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం
నాగర్ కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జి - సాంకేతిక సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాంకేతిక సహాయకులు ఏపీవోలు,ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఆ సంఘం జేఏసీ చెర్మన్, వాయిస్ చెర్మన్, నాయకులు మాట్లాడుతూ....వీబీజీ రామ్ జి పథకం లో 2006 నుంచి పనిచేస్తున్నాము. మాకు పే స్కెల్ అమలుచేసి తమ సమస్యలు పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో 20 మండలాల వీబిజి రాంజీ ఉద్యోగులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జి - సాంకేతిక సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాంకేతిక సహాయకులు ఏపీవోలు,ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఆ సంఘం జేఏసీ చెర్మన్, వాయిస్ చెర్మన్, నాయకులు మాట్లాడుతూ....వీబీజీ రామ్ జి పథకం లో 2006 నుంచి పనిచేస్తున్నాము. మాకు పే స్కెల్ అమలుచేసి తమ సమస్యలు పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో 20 మండలాల వీబిజి రాంజీ ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    11 hrs ago
  • వర్షంలో కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర వర్షంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.
    1
    వర్షంలో కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర

తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర వర్షంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    9 hrs ago
  • దేవుడిలా వచ్చి భక్తుణ్ని కాపాడిన జవాన్..జవాన్పై ప్రశంసలు.. గంగా నదిలో కొట్టుకుపోతున్న భక్తుణ్ని జవాన్ ప్రాణాలకు తెగించి రక్షించారు. నోయిడా(UP)కు చెందిన శివభక్తుడు హరిద్వార్లోని కాంగ్రా ఘాట్ వద్ద స్నానం చేస్తుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు.గమనించిన SDRF జవాన్ వెంటనే నదిలోకి దూకి అతడిని పట్టుకున్నారు. వరద కిందికి లాక్కెళ్తున్నా ఈదుతూ అతణ్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ వీడియోను ఉత్తరాఖండ్ పోలీస్ Xలో షేర్ చేయగా జవాన్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.....
    1
    దేవుడిలా వచ్చి భక్తుణ్ని కాపాడిన జవాన్..జవాన్పై ప్రశంసలు..
గంగా నదిలో కొట్టుకుపోతున్న భక్తుణ్ని జవాన్ ప్రాణాలకు తెగించి రక్షించారు. నోయిడా(UP)కు చెందిన శివభక్తుడు హరిద్వార్లోని కాంగ్రా ఘాట్ వద్ద స్నానం చేస్తుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు.గమనించిన SDRF జవాన్ వెంటనే నదిలోకి దూకి అతడిని పట్టుకున్నారు. వరద కిందికి లాక్కెళ్తున్నా ఈదుతూ అతణ్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ వీడియోను ఉత్తరాఖండ్ పోలీస్ Xలో షేర్ చేయగా జవాన్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.....
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.