Shuru
Apke Nagar Ki App…
గోపాలపురంలో ఫ్లెక్సీల వివాదం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నుంచి వాదాలకుంట రోడ్డులో వైసిపి ఏర్పాటు చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ చర్యపై 9వ వార్డు మెంబర్ తానేటి క్రాంతి, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు గెల్లా శీను తీవ్రంగా మండిపడ్డారు. ప్లెక్సీలు చింపే సంస్కృతి ఇంకా మానరా అంటూ ప్రత్యర్థులను నిలదీశారు. రాజకీయ కక్షలతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
Alluri DurgaPrasad
గోపాలపురంలో ఫ్లెక్సీల వివాదం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నుంచి వాదాలకుంట రోడ్డులో వైసిపి ఏర్పాటు చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ చర్యపై 9వ వార్డు మెంబర్ తానేటి క్రాంతి, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు గెల్లా శీను తీవ్రంగా మండిపడ్డారు. ప్లెక్సీలు చింపే సంస్కృతి ఇంకా మానరా అంటూ ప్రత్యర్థులను నిలదీశారు. రాజకీయ కక్షలతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు.... మండపేట న్యూస్... రిపోర్టర్ నందికోళ్ల రాజు.... స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...3
- 🙏🙏1
- దళిత చైతన్య వేదిక1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- Post by Paramesh Ratnagiri1
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- 🙏🙏1