Shuru
Apke Nagar Ki App…
S Satyanarayana
More news from Srikakulam and nearby areas
- 0-5 వయసు గల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి. శాసన సభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం,డిశంబరు,21: 0-5 వయసు లోపు గల పిల్లలందరూ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేసుకొని పోలియోను తరిమి కొట్టాలని స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ ఆఫీసు దగ్గర గల వాంబే కాలనీలో పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పిల్లలకు పోలియో చుక్కలను శత శాతం పూర్తి అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలియో చుక్కల రాష్ట్ర పరిశీలకులు బి. మీనాక్షి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రాందాసు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అనిత మున్సిపల్ కమిషనర్ పి వి వి పి ప్రసాదరావు, ఐసిడిఎస్ పిడి విమల,తదితరులు పాల్గొన్నారు.2
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- ఘనంగా ఆరట్టు ఉత్సవం జన్నారం మండల కేంద్రంలో అయ్యప్ప దీక్షాపరులు అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం వారు జన్నారంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్న మూల విగ్రహాలను బాదంపల్లి గోదావరి తీరానికి తీసుకువెళ్లి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్తి పాటలు మధ్య మూల విగ్రహాలకు శోభాయాత్ర నిర్వహించి దేవాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గోదావరి తీరంతో పాటు దేవాలయం ఆవరణలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణ సంతరించుకుంది.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Nirmal KR NEWS 3691
- రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన, నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413 86888 కు సంప్రదించగలరు తెలియజేస్తున్నారు.1
- ANM నర్స్ పై కానిస్టేబుల్ అత్యాయత్నం అన్నమయ్య జిల్లా తంబాలపల్లి లో పనిచేస్తున్న ANM నర్స్ పై పోలీస్ కానిస్టేబుల్ అత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు కానిస్టేబుల్ చేసిన దాడికి ఓ మహిళ చెవిని కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. ముక్కోళ్ల రెడ్డప్ప మరియు అతని భార్య సుజాత మధ్య మనస్పర్ధలు రావడంతో PTM పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. న్యాయం చేస్తామని పిలిచిన పోలీస్ స్టేషన్ ముందే కానిస్టేబుల్ సురేంద్ర మర్డర్ అటెమ్ట్ చేయబోయాడు. ఈ నేపథ్యంలో ANM గా పనిచేస్తున్న రెడ్డమ్మకు PTM పోలీస్ స్టేషన్ నుండి పిలుపు రావడంతో తన తల్లిదండ్రులతో పాటు అన్న రెడ్డప్పతో కలిసి పోలీస్ స్టేషన్ కు ఈనెల 18వ తేదీన చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత కుటుంబం మొత్తం బయట మాట్లాడుకొని తర్వాత రండి అని స్థానిక ఎస్ఐ సూచించడంతో, స్టేషన్ ముందుకు రావడంతో కానిస్టేబుల్ సురేంద్ర, ANM రెడ్డమ్మ మీద అత్యాయత్నానికి పాల్పడ్డాడ్డు. రెడ్డమ్మ తప్పించుకొనే ప్రయత్నంలో కానిస్టేబుల్ ఆమె చెవిని రెండుగా కోసేసాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ తన అధికార బలంతో స్థానిక పోలీసులను సైతం లెక్కచేయకుండా మాట్లాడారు. ఈ విషయంపై స్థానిక PTM పోలీసులు సురేంద్ర మీద సంబంధం లేని సెక్షన్లతో కేసు నమోదు చేసి కాపాడే ప్రయత్నం చేశారు. బాధిత మహిళను భయభ్రాంతులతో గురి చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఆ మహిళ మీడియా ముందు వాపోతున్నది.1
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1