శంకర్రావు చేసిన అభివృద్ధిపై టిడిపి నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు - టిడిపి నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతున్న బొకాయిస్తున్నారు. పెదకూరపాడు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో పెదకూరపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు జరగనంతగా జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, తాటికొండ నియోజకవర్గ పరిశీలకులు ఈదా సాంబిరెడ్డి అన్నారు. బుధవారం పెదకూరపాడు ఎంపీపీ, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెల్లంకొండ మీరయ్య గృహమునందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబిరెడ్డి, మీరయ్య, ఎస్సీ సెల్ నాయకులు పిచ్చియ, కాపు నాయకులు మల్లెల కోటేశ్వరరావు,మైనార్టీ నాయకులు సుభాని, అచ్యుత్ రావు, మరియన్నలు మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి నంబూరు శంకర రావు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. నియోజకవర్గంలో , పెదకూరపాడు మండలంలో రూ. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని తెలిపారు. పెదకూరపాడు లో సామాజిక ఆరోగ్య కేంద్రం, గ్రామ సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, జలజీవిని మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, చివరి భూముల వరకు సాగునీరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాలనీలలో సిసి రోడ్లు, డ్రైన్లు, షాదీ ఖానాలు, కమ్యూనిటీ హాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కళ్యాణ మండపం, దేవాలయాల అభివృద్ధి, లింకు రోడ్లు, నాడు నేడు కింద చేసిన పాఠశాలల అభివృద్ధి, పాలిటెక్నిక్ కళాశాల, అచ్చంపేట మోడల్ పోలీస్ స్టేషన్, పెద్ద ముదురు వద్ద బ్రిడ్జి నిర్మాణం, కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం, అమరావతి బెల్లంకొండ రహదారి కళ్ళకు కనబడుతున్న ఆస్తులని టిడిపి వారికి తెలియదా అని ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నంబూరు శంకరరావు పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు. నియోజకవర్గంలో తిరగనీయమని టిడిపి నేతలు మాట్లాడటం బెదిరింపు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. టిడిపి రెండేళ్ల పాలనలో ఏం చేసిందని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా నంబూరు శంకరరావు అన్ని వర్గాలకు సహాయం చేశారన్నారు. గత ప్రభుత్వ హాయంలో కోట్ల రూపాయలు అంత నష్ట బీమా కింద రైతులు అందించామన్నారు. టిడిపి రెండేళ్ల పాలనలో ఏం చేసిందన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాళ్లు విరిసిరారు. దుల్హన్ పథకం అమలు చేస్తామని చెప్పిన టిడిపి ఆ పథకాన్ని వదిలేసిందన్నారు. కొత్త పింఛన్లు, గృహ నిర్మాణాలు, కార్పొరేషన్ రుణాలు, ఆడబిడ్డ నిధి పథకం ఎక్కడ అని ప్రశ్నించారు. శంకరరా వు పై అవాకులు, చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆర్టిఐ విభాగం అధ్యక్షులు అంచూరు హనుమ రెడ్డి, నల్లపాటి యెహోను, షేక్ బాజీ,రహం,కీసర గంగాధర్ రెడ్డి, కోటిరెడ్డి, కంచర్ల గోవిందరావు, గుడిపూడి అశోక్, కాసుల బాధ వెంకటేశ్వర్లు,కరీం మాస్టర్, ఈసుబుఖాన్, సుభాని, నాగయ్య, దేవీలాల్, వెలితోటి చిన్నబాబు, వేమవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శంకర్రావు చేసిన అభివృద్ధిపై టిడిపి నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు - టిడిపి నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతున్న బొకాయిస్తున్నారు. పెదకూరపాడు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో పెదకూరపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు జరగనంతగా జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, తాటికొండ నియోజకవర్గ పరిశీలకులు ఈదా సాంబిరెడ్డి అన్నారు. బుధవారం పెదకూరపాడు ఎంపీపీ, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెల్లంకొండ మీరయ్య గృహమునందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబిరెడ్డి, మీరయ్య, ఎస్సీ సెల్ నాయకులు పిచ్చియ, కాపు నాయకులు మల్లెల కోటేశ్వరరావు,మైనార్టీ నాయకులు సుభాని, అచ్యుత్ రావు, మరియన్నలు మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి నంబూరు శంకర రావు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. నియోజకవర్గంలో , పెదకూరపాడు మండలంలో రూ. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని తెలిపారు. పెదకూరపాడు లో సామాజిక ఆరోగ్య కేంద్రం, గ్రామ సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, జలజీవిని మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, చివరి భూముల వరకు సాగునీరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాలనీలలో సిసి రోడ్లు, డ్రైన్లు, షాదీ ఖానాలు, కమ్యూనిటీ హాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కళ్యాణ మండపం, దేవాలయాల అభివృద్ధి, లింకు రోడ్లు, నాడు నేడు కింద చేసిన పాఠశాలల అభివృద్ధి, పాలిటెక్నిక్ కళాశాల, అచ్చంపేట మోడల్ పోలీస్ స్టేషన్, పెద్ద ముదురు వద్ద బ్రిడ్జి నిర్మాణం, కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం, అమరావతి బెల్లంకొండ రహదారి కళ్ళకు కనబడుతున్న ఆస్తులని టిడిపి వారికి తెలియదా అని ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నంబూరు శంకరరావు పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు. నియోజకవర్గంలో తిరగనీయమని టిడిపి నేతలు మాట్లాడటం బెదిరింపు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. టిడిపి రెండేళ్ల పాలనలో ఏం చేసిందని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా నంబూరు శంకరరావు అన్ని వర్గాలకు సహాయం చేశారన్నారు. గత ప్రభుత్వ హాయంలో కోట్ల రూపాయలు అంత నష్ట బీమా కింద రైతులు అందించామన్నారు. టిడిపి రెండేళ్ల పాలనలో ఏం చేసిందన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాళ్లు విరిసిరారు. దుల్హన్ పథకం అమలు చేస్తామని చెప్పిన టిడిపి ఆ పథకాన్ని వదిలేసిందన్నారు. కొత్త పింఛన్లు, గృహ నిర్మాణాలు, కార్పొరేషన్ రుణాలు, ఆడబిడ్డ నిధి పథకం ఎక్కడ అని ప్రశ్నించారు. శంకరరా వు పై అవాకులు, చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆర్టిఐ విభాగం అధ్యక్షులు అంచూరు హనుమ రెడ్డి, నల్లపాటి యెహోను, షేక్ బాజీ,రహం,కీసర గంగాధర్ రెడ్డి, కోటిరెడ్డి, కంచర్ల గోవిందరావు, గుడిపూడి అశోక్, కాసుల బాధ వెంకటేశ్వర్లు,కరీం మాస్టర్, ఈసుబుఖాన్, సుభాని, నాగయ్య, దేవీలాల్, వెలితోటి చిన్నబాబు, వేమవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- Post by దాసరి ప్రేమ్1
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1
- Post by V Ramarao3
- Post by JADI RAJU1
- విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1