ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సహకారంతో హైవే పక్కన నూతన చలివేంద్రం వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మరియు ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో పెద్దకడబూరు మండలం పరిధిలో ఒక శ్రేష్ఠమైన సేవా కార్యక్రమం నిర్వహించబడింది. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని చిన్నతుంబలం మరియు పులికనుమ గ్రామాల సమీపంలో, ఆదోని – రాయచూరు హైవే రహదారి పక్కన మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వై.బాలనాగిరెడ్డి సహకారంతో, పెద్దకడబూరు మండల వైస్ ఎంపీపీ శ్రీమతి కె.ముత్తమ్మ ఆధ్వర్యంలో నూతన చలివేంద్రం ఏర్పాటు చేయబడింది.ఈ చలివేంద్రం ద్వారా మండల ప్రజలకు, పాదయాత్రగా వెళ్లే భక్తాదులకు, అలాగే ఆ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులకు ఉచితంగా చల్లని తాగునీరు అందించబడుతుంది. వేసవి కాలంలో దాహంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ సేవ ఎంతో ఉపయుక్తంగా ఉండనుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి రైతు విభాగం అధ్యక్షులు కేపీ. యల్లప్ప , పులికనుమ గ్రామ సర్పంచ్ కే. చిన్న మహాదేవ , ఉప సర్పంచ్ తిమ్మప్ప , చిన్నతుంబలం గ్రామ సొసైటీ సీఈఓ నరసింహమూర్తి , గ్రామ పెద్దలు సోమప్పదని, లింగన్న గౌడ్, మదిరి రాముడు, పెద్ద మహాదేవ (పులికనుమ), ముస్లిం వలీ భాష, వైఎస్ఆర్సిపి చిన్నతుంబలం గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు హరిజన బొడ్డన్న, బీసీ సెల్ అధ్యక్షులు బి. చిన్న కడబూరి, పెద్దకడబూరు మండల వైఎస్ఆర్సిపి వాలంటీర్స్ విభాగం అధ్యక్షులు కమ్మరి నరసింహ ఆచారి, శట్టుమన్న ముకప్ప, బరికి మల్లయ్య, చిన్నతుంబలం గ్రామ యువజన విభాగం అధ్యక్షులు కమ్మరి వీరేష్, అలాగే పెద్దకడబూరు మండల వైఎస్ఆర్సిపి ఇంటలెక్చువల్స్ వింగ్ అధ్యక్షులు కమ్మరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవికాలంలో ప్రజలకు తాగునీరు అందించడం గొప్ప సేవ అని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు.
ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సహకారంతో హైవే పక్కన నూతన చలివేంద్రం వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మరియు ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో పెద్దకడబూరు మండలం పరిధిలో ఒక శ్రేష్ఠమైన సేవా కార్యక్రమం నిర్వహించబడింది. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని చిన్నతుంబలం మరియు పులికనుమ గ్రామాల సమీపంలో, ఆదోని – రాయచూరు హైవే రహదారి పక్కన మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వై.బాలనాగిరెడ్డి సహకారంతో, పెద్దకడబూరు మండల వైస్ ఎంపీపీ శ్రీమతి కె.ముత్తమ్మ ఆధ్వర్యంలో నూతన చలివేంద్రం ఏర్పాటు చేయబడింది.ఈ చలివేంద్రం ద్వారా మండల ప్రజలకు, పాదయాత్రగా వెళ్లే భక్తాదులకు, అలాగే ఆ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులకు ఉచితంగా చల్లని తాగునీరు అందించబడుతుంది. వేసవి కాలంలో దాహంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ సేవ ఎంతో ఉపయుక్తంగా ఉండనుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి రైతు విభాగం అధ్యక్షులు కేపీ. యల్లప్ప , పులికనుమ గ్రామ సర్పంచ్ కే. చిన్న మహాదేవ , ఉప సర్పంచ్ తిమ్మప్ప , చిన్నతుంబలం గ్రామ సొసైటీ సీఈఓ నరసింహమూర్తి , గ్రామ పెద్దలు సోమప్పదని, లింగన్న గౌడ్, మదిరి రాముడు, పెద్ద మహాదేవ (పులికనుమ), ముస్లిం వలీ భాష, వైఎస్ఆర్సిపి చిన్నతుంబలం గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు హరిజన బొడ్డన్న, బీసీ సెల్ అధ్యక్షులు బి. చిన్న కడబూరి, పెద్దకడబూరు మండల వైఎస్ఆర్సిపి వాలంటీర్స్ విభాగం అధ్యక్షులు కమ్మరి నరసింహ ఆచారి, శట్టుమన్న ముకప్ప, బరికి మల్లయ్య, చిన్నతుంబలం గ్రామ యువజన విభాగం అధ్యక్షులు కమ్మరి వీరేష్, అలాగే పెద్దకడబూరు మండల వైఎస్ఆర్సిపి ఇంటలెక్చువల్స్ వింగ్ అధ్యక్షులు కమ్మరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవికాలంలో ప్రజలకు తాగునీరు అందించడం గొప్ప సేవ అని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు.
- కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.4
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.1
- కూటమి పాలనలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెల్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ వద్ద ఇటీవల ఏర్పాటైన నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాయదుర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.1
- కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నీరు కార్చకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిలీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కాదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వయంగా ఆ యువకుడే తన తల్లిని చూసుకోవాలని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని తనపై కొందరు దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడన్నారు. ఇవన్నీ క్లుప్తంగా ఉన్నాయని వాటిపై సమగ్ర విచారణ చేస్తే నిజమైన నిందితులు దొరుకుతారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు. దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని పోలీసులను కోరారు.2
- పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు1
- కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.4