logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పోనకల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న సర్ ప్రక్రియను స్థానిక తాసిల్దార్ బక్కయ్య, డిటి మస్కూర్ అలీ పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం వారు పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, క్యాంపును పరిశీలించి, ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించారు. సర్ ప్రక్రియను సందర్శించిన తాసిల్దార్ బక్కన్న ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, ఉప సర్పంచ్ అప్పల జలపతి, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_P.G.Murthy
P.G.Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
1 hr ago
426fdcb8-6e8c-4461-bfba-37649c160d99
6368947c-800b-49cb-9d61-81024bc2b6c2
3d9f1461-6ceb-4a37-9e86-61c25ccfc619

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పోనకల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న సర్ ప్రక్రియను స్థానిక తాసిల్దార్ బక్కయ్య, డిటి మస్కూర్ అలీ పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం వారు పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, క్యాంపును పరిశీలించి, ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించారు. సర్ ప్రక్రియను సందర్శించిన తాసిల్దార్ బక్కన్న ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, ఉప సర్పంచ్ అప్పల జలపతి, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.
    1
    జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు.

జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జోన్-2 చీఫ్ జోనల్ ఇంచార్జ్ దాగిల్ల దయానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో పార్టీ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాగిళ్ల దయానందరావు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రను తిరగరాసేది బహన్ మాయావతి గారేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ రక్షణ, అణగారిన వర్గాల అభివృద్ధి సాధించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. 2027లో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, అదే స్ఫూర్తితో 2028లో తెలంగాణలోనూ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చిన ఆయన, జిల్లాలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టం చంద్రశేఖర్, మహనీయుల ఆలోచనలకు ఆకర్షితులై బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ముఖ్య అతిథి దయానందరావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి, మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ళ మురళి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌లు గోమాస బ్రహ్మానందం, గోలేటి నారాయణ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి మాతిన్ ఖాన్, నస్పూర్ మండల అధ్యక్షుడు వేముల కిరణ్, నాయకుడు జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జోన్-2 చీఫ్ జోనల్ ఇంచార్జ్ దాగిల్ల దయానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో పార్టీ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాగిళ్ల దయానందరావు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రను తిరగరాసేది బహన్ మాయావతి గారేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ రక్షణ, అణగారిన వర్గాల అభివృద్ధి సాధించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. 2027లో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, అదే స్ఫూర్తితో 2028లో తెలంగాణలోనూ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చిన ఆయన, జిల్లాలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టం చంద్రశేఖర్, మహనీయుల ఆలోచనలకు ఆకర్షితులై బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ముఖ్య అతిథి దయానందరావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి, మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ళ మురళి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌లు గోమాస బ్రహ్మానందం, గోలేటి నారాయణ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి మాతిన్ ఖాన్, నస్పూర్ మండల అధ్యక్షుడు వేముల కిరణ్, నాయకుడు జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • ప్రభుత్వం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక కాలనీని ఎంచుకుని, సొసైటీ స్థాపకుడు ఇర్షాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ఫారాలను పూర్తి చేయిస్తున్నారు. ఓటర్లు తమ సరైన ధ్రువపత్రాలను పరిశీలించుకుని, అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఇర్షాన్, ఫహీమ్, ఆఫ్రిన్, మహీం, రజాక్ తదితరులు పాల్గొంటున్నారు.
    1
    ప్రభుత్వం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక కాలనీని ఎంచుకుని, సొసైటీ స్థాపకుడు ఇర్షాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ఫారాలను పూర్తి చేయిస్తున్నారు.

ఓటర్లు తమ సరైన ధ్రువపత్రాలను పరిశీలించుకుని, అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఇర్షాన్, ఫహీమ్, ఆఫ్రిన్, మహీం, రజాక్ తదితరులు పాల్గొంటున్నారు.
    user_SIDDU.ASR
    SIDDU.ASR
    నిర్మల్, తెలంగాణ•
    26 min ago
  • తెలంగాణలో నీళ్లు లేక రైతులు తీవ్రంగా గోస పడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపుల ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని కరీంనగర్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో కొప్పుల డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీటిని వదిలితే బాగుంటుందని రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో, సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలపై గతంలో తుపాకీ పెట్టిన సీఎం, నేడు రాష్ట్ర రైతులను మరియు ప్రజలను పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్లను, శ్యాం ప్రసాద్ రెడ్డిని బెల్ట్ తో కొట్టాలని, జైలులో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అనడం అత్యంత సిగ్గుచేటని కొప్పుల విమర్శించారు. రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలను సీఎం బే వాకూఫ్ సలహాలు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, బీఆర్‌ఎస్ వాళ్ల రక్తం కోసి పంటలు పండించాలని సీఎం మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్, కేటీఆర్‌లపై బూతుల పురాణం అందుకోవడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏమీ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ఎంతో ముందు చూపుతోనే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని కొప్పుల స్పష్టం చేశారు. కన్నెపల్లి పంపు హౌస్ నుండి నీళ్లు తీస్తే తాము మాట్లాడిన అవాక్కులు బహిర్గతం అవుతాయనే భయంతోనే సీఎం నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. గోదావరి, కన్నెపల్లిలో నీళ్లు ఉన్నాయని ఇంజనీర్లు చెబుతున్నా పట్టించుకోకపోవడం వల్ల 98 టీఎంసీల నీటి ప్రవాహం వృధాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న ప్రాజెక్ట్ పిల్లర్‌ను రిపేర్ చేయడానికి ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ ముందుకు వచ్చినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, ప్రాజెక్టును రిపేర్ చేస్తే ఆ క్రెడిట్ తనకు రాదనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందనడం సిగ్గుచేటని పేర్కొంటూ, ప్రపంచ దేశాలు సూపర్ ఎల్నీనో వల్ల ప్రజలకు కష్టాలు రాబోతున్నాయని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం సరికాదన్నారు.
    1
    తెలంగాణలో నీళ్లు లేక రైతులు తీవ్రంగా గోస పడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపుల ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని కరీంనగర్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో కొప్పుల డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీటిని వదిలితే బాగుంటుందని రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో, సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలపై గతంలో తుపాకీ పెట్టిన సీఎం, నేడు రాష్ట్ర రైతులను మరియు ప్రజలను పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు.

రిటైర్డ్ ఇంజనీర్లను, శ్యాం ప్రసాద్ రెడ్డిని బెల్ట్ తో కొట్టాలని, జైలులో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అనడం అత్యంత సిగ్గుచేటని కొప్పుల విమర్శించారు. రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలను సీఎం బే వాకూఫ్ సలహాలు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, బీఆర్‌ఎస్ వాళ్ల రక్తం కోసి పంటలు పండించాలని సీఎం మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్, కేటీఆర్‌లపై బూతుల పురాణం అందుకోవడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏమీ లేదని దుయ్యబట్టారు.

కేసీఆర్ ఎంతో ముందు చూపుతోనే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని కొప్పుల స్పష్టం చేశారు. కన్నెపల్లి పంపు హౌస్ నుండి నీళ్లు తీస్తే తాము మాట్లాడిన అవాక్కులు బహిర్గతం అవుతాయనే భయంతోనే సీఎం నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. గోదావరి, కన్నెపల్లిలో నీళ్లు ఉన్నాయని ఇంజనీర్లు చెబుతున్నా పట్టించుకోకపోవడం వల్ల 98 టీఎంసీల నీటి ప్రవాహం వృధాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న ప్రాజెక్ట్ పిల్లర్‌ను రిపేర్ చేయడానికి ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ ముందుకు వచ్చినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, ప్రాజెక్టును రిపేర్ చేస్తే ఆ క్రెడిట్ తనకు రాదనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందనడం సిగ్గుచేటని పేర్కొంటూ, ప్రపంచ దేశాలు సూపర్ ఎల్నీనో వల్ల ప్రజలకు కష్టాలు రాబోతున్నాయని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం సరికాదన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    16 min ago
  • భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరడంతో దేశం ఆత్మనిర్భర రక్షణ తయారీ, సముద్ర భద్రత దిశగా మరో పెద్ద అడుగు వేసింది. అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ అయిన ఈ యుద్ధనౌక భారత్ యొక్క పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యానికి, ప్రపంచ రక్షణ రంగంలో బలపడుతున్న గుర్తింపునకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక యుద్ధనౌక తయారీలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించగా, దీని నిర్మాణంలో 200కు పైగా భారతీయ పరిశ్రమలు మరియు ఎంఎస్ఎంఈల (MSMEs) భాగస్వామ్యం ఉంది. ఇది దేశీయ రక్షణ ఉత్పత్తి రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. బలమైన నౌకాదళం, సురక్షితమైన సముద్రం మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధన దిశగా ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలిచింది.
    1
    భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరడంతో దేశం ఆత్మనిర్భర రక్షణ తయారీ, సముద్ర భద్రత దిశగా మరో పెద్ద అడుగు వేసింది. అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ అయిన ఈ యుద్ధనౌక భారత్ యొక్క పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యానికి, ప్రపంచ రక్షణ రంగంలో బలపడుతున్న గుర్తింపునకు ప్రతీకగా నిలుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక యుద్ధనౌక తయారీలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించగా, దీని నిర్మాణంలో 200కు పైగా భారతీయ పరిశ్రమలు మరియు ఎంఎస్ఎంఈల (MSMEs) భాగస్వామ్యం ఉంది. ఇది దేశీయ రక్షణ ఉత్పత్తి రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. బలమైన నౌకాదళం, సురక్షితమైన సముద్రం మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధన దిశగా ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలిచింది.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    1 hr ago
  • ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని మరియు ప్రైవేట్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శనివారం మార్కెట్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మార్కెట్లోని చిరు వ్యాపారస్తులను, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేటు విద్యా వ్యవస్థ చేస్తున్న దోపిడీని వివరించారు. ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్య పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను సైతం అమ్ముకోవాల్సి వస్తోందని ఆరోపించారు. చదువును వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు విద్యాసంస్థలు పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని మండిపడ్డారు. కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని, ప్రైవేటు విద్యా విధానం సామాన్యులకు అందుబాటులోకి వచ్చేవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టు 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిగల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగే కోటేశ్వర్, చొప్పరి సుధాకర్, కనపర్తి శ్రీనివాస్, గాలి రమేష్, బూడిద వినోద్ కుమార్, కుడిది శ్రీనివాస్, పల్లపు చిన్నారెడ్డి, మహిళా ప్రతినిధులు మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, అంజలి దేవేంద్రతో పాటు పలువురు ప్రతినిధులు, విద్యా విధాన బాధితులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
    1
    ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని మరియు ప్రైవేట్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శనివారం మార్కెట్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మార్కెట్లోని చిరు వ్యాపారస్తులను, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేటు విద్యా వ్యవస్థ చేస్తున్న దోపిడీని వివరించారు.

ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్య పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను సైతం అమ్ముకోవాల్సి వస్తోందని ఆరోపించారు. చదువును వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు విద్యాసంస్థలు పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని మండిపడ్డారు. కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని, ప్రైవేటు విద్యా విధానం సామాన్యులకు అందుబాటులోకి వచ్చేవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

వచ్చే ఆగస్టు 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిగల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగే కోటేశ్వర్, చొప్పరి సుధాకర్, కనపర్తి శ్రీనివాస్, గాలి రమేష్, బూడిద వినోద్ కుమార్, కుడిది శ్రీనివాస్, పల్లపు చిన్నారెడ్డి, మహిళా ప్రతినిధులు మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, అంజలి దేవేంద్రతో పాటు పలువురు ప్రతినిధులు, విద్యా విధాన బాధితులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు అండ్ రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ ఎస్ రత్నాకర్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మొట్టమొదటిసారిగా హర్యానా, పంజాబ్‌లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాంపిల్‌గా ఎస్సీ వర్గీకరణకు బీజం వేస్తే, ప్రధాని మోడీ దానిని దేశవ్యాప్తం చేశారని రత్నాకర్ విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో ఒకరిద్దరికే ప్రయోజనం జరుగుతోందని, అది కూడా అధికారిక లెక్క కాదని అన్నారు. సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ప్రధాని మోడీ, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రిజర్వేషన్లను ఎలా పంచుతారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది దళితుల ఐక్యతపై జరుగుతున్న కుట్ర కాదా అని ఆయన ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తొక్కుతుంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం అన్యాయమని రత్నాకర్ అన్నారు. మాలలు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉంటున్నారే తప్ప, తమ జాతి పట్ల విశ్వాసంగా లేరనే విషయాన్ని గమనించాలని ఆయన హితవు పలికారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు అండ్ రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ ఎస్ రత్నాకర్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

మొట్టమొదటిసారిగా హర్యానా, పంజాబ్‌లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాంపిల్‌గా ఎస్సీ వర్గీకరణకు బీజం వేస్తే, ప్రధాని మోడీ దానిని దేశవ్యాప్తం చేశారని రత్నాకర్ విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో ఒకరిద్దరికే ప్రయోజనం జరుగుతోందని, అది కూడా అధికారిక లెక్క కాదని అన్నారు. సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ప్రధాని మోడీ, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రిజర్వేషన్లను ఎలా పంచుతారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది దళితుల ఐక్యతపై జరుగుతున్న కుట్ర కాదా అని ఆయన ప్రశ్నించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తొక్కుతుంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం అన్యాయమని రత్నాకర్ అన్నారు. మాలలు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉంటున్నారే తప్ప, తమ జాతి పట్ల విశ్వాసంగా లేరనే విషయాన్ని గమనించాలని ఆయన హితవు పలికారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    16 min ago
  • జగిత్యాల నియోజకవర్గంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి సాయం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణకు బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ, సీఎం సహాయ నిధి నుండి మొత్తం 9 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. దీనికి సంబంధించి మంజూరైన రూ. 1 లక్షల 50 వేల విలువ గల చెక్కులను శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ కౌన్సిలర్లు కోరుకంటి రాము, తోట హరీష్, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, రాయికల్ మండలం ప్రధాన కార్యదర్శి కొండపల్కల రత్నాకర్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు వొళ్ళాల గంగాధర్, గంగిపెల్లి వేణుమాధవ్, పెండేం గంగాధర్, చిరంజీవి, నందు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.
    1
    జగిత్యాల నియోజకవర్గంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి సాయం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణకు బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ, సీఎం సహాయ నిధి నుండి మొత్తం 9 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. దీనికి సంబంధించి మంజూరైన రూ. 1 లక్షల 50 వేల విలువ గల చెక్కులను శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ కౌన్సిలర్లు కోరుకంటి రాము, తోట హరీష్, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, రాయికల్ మండలం ప్రధాన కార్యదర్శి కొండపల్కల రత్నాకర్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు వొళ్ళాల గంగాధర్, గంగిపెల్లి వేణుమాధవ్, పెండేం గంగాధర్, చిరంజీవి, నందు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.