*స్వామి వివేకానంద 163వ జయంతి* కథలాపూర్ జనవరి 13 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో సోమవారం రోజున యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన యోగి అని,తన ఉపన్యాసాల ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన మహనీయుడని కొనియాడారు. పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన తొలి హిందూ ఆధ్యాత్మికవేత్త కావడం విశేషమని తెలిపారు. ఇనుప కండరాలు, ఉక్కునరాలు, వజ్రసంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అని,లేవండి.మేల్కొనండి,గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ ఆయన చేసిన సూక్తుల నుండి ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారన్నారు. వారు దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన పుట్టినరోజును "జాతీయ యువజన దినోత్సవం"గా జరుపుతున్నదని కీర్తించారు. ఈ కార్యక్రమంలో గాంధారి శ్రీనివాస్,నీలి శ్రీనివాస్,మల్యాల మారుతి, కాసోజి ప్రతాప్,నాంపల్లి శ్రీధర్, సిరిమల్లె రాజశేఖర్,మారంపల్లి నారాయణ, శ్రీధర్, మంచాల మధుసూధన్,రఘు,నిమ్మ రూపేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
*స్వామి వివేకానంద 163వ జయంతి* కథలాపూర్ జనవరి 13 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో సోమవారం రోజున యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన యోగి అని,తన ఉపన్యాసాల ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన మహనీయుడని కొనియాడారు. పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన తొలి
హిందూ ఆధ్యాత్మికవేత్త కావడం విశేషమని తెలిపారు. ఇనుప కండరాలు, ఉక్కునరాలు, వజ్రసంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అని,లేవండి.మేల్కొనండి,గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ ఆయన చేసిన సూక్తుల నుండి ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారన్నారు. వారు దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన పుట్టినరోజును "జాతీయ యువజన దినోత్సవం"గా జరుపుతున్నదని కీర్తించారు. ఈ కార్యక్రమంలో గాంధారి శ్రీనివాస్,నీలి శ్రీనివాస్,మల్యాల మారుతి, కాసోజి ప్రతాప్,నాంపల్లి శ్రీధర్, సిరిమల్లె రాజశేఖర్,మారంపల్లి నారాయణ, శ్రీధర్, మంచాల మధుసూధన్,రఘు,నిమ్మ రూపేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
- కరీంనగర్ జిల్లా రేకుర్తి బస్తీ దావ ఖాన పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆమె సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సూచనలను మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు తెలియజేశారు1
- పోలీసులు మీకోసం కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం హెల్మెట్లు, వాలీబాల్ కిట్ పంపిణీ కేరమేరి: “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ నితిక పంత్, అదనపు ఎస్పీ చిత్తరంజన్తో కలిసి ప్రారంభించారు. ఈ కెమెరాల ద్వారా మండల కేంద్రం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం కానుంది.అనంతరం అనర్పల్లి గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం నిర్వహించి, ప్రజలకు 50 ద్విచక్ర వాహనాల హెల్మెట్లు, యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో భద్రతకు సీసీ కెమెరాలు కీలకమని, నేరాల నివారణలో ప్రజల సహకారం అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.2
- సంగారెడ్డి శివారులో వైకుంటపురం వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ఆటో ఒకరు ఒక్కడికక్కడే మృతి కేసు నమోదు1
- MSR CULT లో వచ్చిన పాటను నా సొంత లిరిక్ ద్వారా రాసి రావణాసుర అనే చిత్రానికి ఈ పాట చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి🙏1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్* *కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్* *సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు* *గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్* *మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*3
- సంక్రాంతి పండుగ రేపే కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణమయ్యారు దీంతో చౌటుప్పల్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మంగళవారం విపరీతమైన వాహనాలతో రద్దీగా మారిన టోల్ ప్లాజా గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.1
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల సందడి జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. ఆలయ అర్చకులు స్వామివారిని అభిషేకించి, పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ముందుగా కోనేరులో స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉప ఆలయాలైన శ్రీ బేతాళ, రామాలయాలను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.1