*పేదవాని నోటి దగ్గర భోజనం లాగేసిన వ్యక్తి జగన్ రెడ్డి* *అన్నక్యాంటీన్ ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత* *రాప్తాడులో అట్టహాసంగా అన్న క్యాంటీన్ ప్రారంభం* పేదవాడికి మూడు పూటలా అన్నం పెడుతుంటే.. దాన్ని కూడా జగన్ రెడ్డి ఓర్వలేకపోయాడని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, హిందూపురం ఎంపీ పార్థసారథి విమర్శలు చేశారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే, ఎంపీకి స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీగా తరలివచ్చిన ప్రజల మధ్య క్యాంటీన్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీత, ఎంపీ పార్థసారథి క్యాంటీన్ లో భోజనం రుచి చూశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ తర్వాత 10లక్షలతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును కూడా ప్రారంభించారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో అన్న క్యాంటీన్ ప్రారంభంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ మండల కేంద్రాలకు, నియోజకవర్గ కేంద్రాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి కోసం గత టీడీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తే.. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి కక్ష పూరితంగా మూసివేయించాడన్నారు. తమిళనాడులో కూడా అన్న క్యాంటీన్ల తరహాలోనే అమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు. ఆ తర్వాత వచ్చిన స్టాలిన్ వాటిని పేర్లు కూడా మార్చకుండా కొనసాగించారన్నారు. జగన్మోహన్ రెడ్డికి అన్న క్యాంటీన్ అనే పేరు ఇష్టం లేకపోతే తన తండ్రి పేరు పెట్టుకున్నా తాము ఆక్షేపించే వారం కాదన్నారు. కానీ ఆయన ఏకంగా క్యాంటీన్లను ఎత్తివేయించడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. అందుకే కూటమి వచ్చిన తొలి నెలలోనే 200క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. ఇప్పుడు మరో 65క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. ఇప్పుడు ఈ క్యాంటీన్లు వేలాదీ మంది కూలీలు, రైతులు, పేద వారికి ఉపయోగపడుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉన్న తేడా ఏంటనేది ఒక్క విషయం ద్వారానే తెలుసుకోవచ్చన్నారు. మరోవైపు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో తాను పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. తమిళనాడుకు వెళ్లి అక్కడ అమ్మ క్యాంటీన్లను పరిశీలించి.. అదే తరహాలోనే ఎక్కువ మందికి భోజనం అందించేలా వీటిని ప్రారంభించామన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ఇవి కొనసాగితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశ్యంతో వాటిని మూసివేయించారన్నారు. దీని వలన ఎంతో మంది పేదలు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక.. అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారన్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన వాటితో కలిపి మొత్తం 265క్యాంటీన్లలో పేదలకు మూడు పూటలా కేవలం 5రూపాయలకు భోజనం అందుతోందన్నారు. రాప్తాడులో ఎప్పటి నుంచో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందన్నారు. పనులు ప్రారంభించిన 6నెలల్లోగానే 61లక్షలతో క్యాంటీన్ నిర్మాణం చేసినట్టు చెప్పారు. దీని వలన రాప్తాడు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రికి వచ్చే వారికి ఆటో నగర్ లో ఉన్న కార్మికులకు, కూలీ పనులకు వచ్చే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉదయం అల్పహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం అందుబాటులో ఉంటుందన్నారు. ఇది అత్యంత నాణ్యతగా ఉండేలా హరే కృష్ణ మిషన్, అక్షయపాత్ర వారికి అప్పగించినట్టు చెప్పారు. అయితే చాలా మంది పుట్టినరోజు, పెళ్లిరోజులంటూ వృథాగా డబ్బు ఖర్చు చేస్తుంటారు.. అలాంటి వారు అన్నక్యాంటీన్ల వద్ద తమ పేరుతో ఉచితంగా భోజనం అందించవచ్చన్నారు. ఇక్కడ ముందే సంప్రదించి.. డబ్బు చెల్లిస్తే వారే అన్నదాన కార్యక్రమం చేస్తారన్నారు. ఈ క్యాంటీన్ లో భోజనం తినే వారి సంఖ్యను బట్టి మరింత మందికి అందించేలా చూస్తామని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు...
*పేదవాని నోటి దగ్గర భోజనం లాగేసిన వ్యక్తి జగన్ రెడ్డి* *అన్నక్యాంటీన్ ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత* *రాప్తాడులో అట్టహాసంగా అన్న క్యాంటీన్ ప్రారంభం* పేదవాడికి మూడు పూటలా అన్నం పెడుతుంటే.. దాన్ని కూడా జగన్ రెడ్డి ఓర్వలేకపోయాడని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, హిందూపురం ఎంపీ పార్థసారథి విమర్శలు చేశారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే, ఎంపీకి స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీగా తరలివచ్చిన ప్రజల మధ్య క్యాంటీన్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీత, ఎంపీ పార్థసారథి క్యాంటీన్ లో భోజనం రుచి చూశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ తర్వాత 10లక్షలతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును కూడా ప్రారంభించారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో అన్న క్యాంటీన్ ప్రారంభంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ మండల కేంద్రాలకు, నియోజకవర్గ కేంద్రాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి కోసం గత టీడీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తే.. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి
కక్ష పూరితంగా మూసివేయించాడన్నారు. తమిళనాడులో కూడా అన్న క్యాంటీన్ల తరహాలోనే అమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు. ఆ తర్వాత వచ్చిన స్టాలిన్ వాటిని పేర్లు కూడా మార్చకుండా కొనసాగించారన్నారు. జగన్మోహన్ రెడ్డికి అన్న క్యాంటీన్ అనే పేరు ఇష్టం లేకపోతే తన తండ్రి పేరు పెట్టుకున్నా తాము ఆక్షేపించే వారం కాదన్నారు. కానీ ఆయన ఏకంగా క్యాంటీన్లను ఎత్తివేయించడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. అందుకే కూటమి వచ్చిన తొలి నెలలోనే 200క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. ఇప్పుడు మరో 65క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. ఇప్పుడు ఈ క్యాంటీన్లు వేలాదీ మంది కూలీలు, రైతులు, పేద వారికి ఉపయోగపడుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉన్న తేడా ఏంటనేది ఒక్క విషయం ద్వారానే తెలుసుకోవచ్చన్నారు. మరోవైపు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో తాను పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. తమిళనాడుకు వెళ్లి అక్కడ అమ్మ క్యాంటీన్లను పరిశీలించి.. అదే తరహాలోనే ఎక్కువ మందికి భోజనం అందించేలా వీటిని ప్రారంభించామన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ఇవి కొనసాగితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశ్యంతో వాటిని మూసివేయించారన్నారు. దీని వలన ఎంతో మంది పేదలు ఆకలితో
ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక.. అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారన్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన వాటితో కలిపి మొత్తం 265క్యాంటీన్లలో పేదలకు మూడు పూటలా కేవలం 5రూపాయలకు భోజనం అందుతోందన్నారు. రాప్తాడులో ఎప్పటి నుంచో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందన్నారు. పనులు ప్రారంభించిన 6నెలల్లోగానే 61లక్షలతో క్యాంటీన్ నిర్మాణం చేసినట్టు చెప్పారు. దీని వలన రాప్తాడు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రికి వచ్చే వారికి ఆటో నగర్ లో ఉన్న కార్మికులకు, కూలీ పనులకు వచ్చే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉదయం అల్పహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం అందుబాటులో ఉంటుందన్నారు. ఇది అత్యంత నాణ్యతగా ఉండేలా హరే కృష్ణ మిషన్, అక్షయపాత్ర వారికి అప్పగించినట్టు చెప్పారు. అయితే చాలా మంది పుట్టినరోజు, పెళ్లిరోజులంటూ వృథాగా డబ్బు ఖర్చు చేస్తుంటారు.. అలాంటి వారు అన్నక్యాంటీన్ల వద్ద తమ పేరుతో ఉచితంగా భోజనం అందించవచ్చన్నారు. ఇక్కడ ముందే సంప్రదించి.. డబ్బు చెల్లిస్తే వారే అన్నదాన కార్యక్రమం చేస్తారన్నారు. ఈ క్యాంటీన్ లో భోజనం తినే వారి సంఖ్యను బట్టి మరింత మందికి అందించేలా చూస్తామని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు...
- ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు1
- వైయస్ఆర్సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ.....1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి..* *ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..* 👉అధికారులరా..!! పోలీసులారా..!! తోటి విలేకరులారా..!!తెలుసుకొండి.. 👉అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..? వారు సంపాదకులు కారా..? 👉అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి, కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా..? 👉 అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను భంగం కలిగించడమే అవుతుంది. 👉ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైన, సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం.. ఇది తెలుసా..? 👉అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి..? INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా…? 👉PRINT MEDIA, ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా..? ఆయా జిల్లా కలెక్టర్లు, DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు..? 👉నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టు కుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…? 👉రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు. 👉అక్రిడేషన్ కొలమానం కాదు. అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే.. 👉మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? వారికి లేని బాధ మీకెందుకు…? 👉అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో, సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి. 🙏అయా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి. 👉ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు..?గమనించండి. 👉 ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా…? 👉ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం, వార్తలో సత్తా ఉండాలి.. ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి… కత్తిలా మార్చండి. 👉 జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలనుకునే వారికి.. అక్రిడేషన్ కార్డు జీవితం కాదు, జాబ్ కార్డ్ కాదు. మీరు రాబట్టిన సమాచారాన్ని, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే.. అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా.. లేకపోతే మీకు అందదా.. అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి.. ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి.. *జై జర్నలిజం.. జై జై జర్నలిజం..* 🇮🇳 దేశం కోసం సామాన్య ప్రజల కోసం పనిచేసే జర్నలిజం రావాలి ధన్యవాదాలు మిత్రులారా *🇮🇳జర్నలిస్టు🇮🇳* *🇮🇳ఆంద్రప్రదేశ్&తెలంగాణా🇮🇳*1
- రైతు రాజన్నాడం తప్పు రైతుకు గిట్ట పట్టేలార కావాలి అంటూ ఆహ్వానిస్తున్నారు1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ1
- ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley1