*ప్రతిపక్షంలో కూడా.. వైయస్ఆర్సీపీలోకి తగ్గని వలసలు* *నెల్లూరు సిటీ నియోజకవర్గంలో..వైఎస్ఆర్ సీపీకి భారీ మద్దతుగా నిలుస్తున్న యువత* నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్సిపి ఆఫీసులో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి మద్దతుగా..15వ డివిజన్ యూత్ లోకేష్,అజయ్,గుణవంత్ ఆధ్వర్యంలో 100 మంది.. యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.* *పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు.. కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.* *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. యువతకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.* 👉 ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానాలతోనే.. ఆ పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటకటుకుందన్నారు. 👉 కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన.. ప్రజలు ఈరోజు.. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుకున్నామా..అని వేదన చెందుతున్నారని తెలిపారు. 👉 ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరో సారి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న..ప్రజల ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. 👉 ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ఆదరణకు.. నిదర్శనంగానే.. పెద్ద ఎత్తున ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. చేరువ అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత సాయి, బాను, సాగర్, బాషా, సుకేష్, సుధీర్, విశ్వ తదితరులు పాల్గొన్నారు.
*ప్రతిపక్షంలో కూడా.. వైయస్ఆర్సీపీలోకి తగ్గని వలసలు* *నెల్లూరు సిటీ నియోజకవర్గంలో..వైఎస్ఆర్ సీపీకి భారీ మద్దతుగా నిలుస్తున్న యువత* నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్సిపి ఆఫీసులో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి మద్దతుగా..15వ డివిజన్ యూత్ లోకేష్,అజయ్,గుణవంత్ ఆధ్వర్యంలో 100 మంది.. యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.* *పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు.. కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.* *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. యువతకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.* 👉 ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానాలతోనే.. ఆ పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటకటుకుందన్నారు. 👉 కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన.. ప్రజలు ఈరోజు.. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుకున్నామా..అని వేదన చెందుతున్నారని తెలిపారు. 👉 ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరో సారి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న..ప్రజల ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. 👉 ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ఆదరణకు.. నిదర్శనంగానే.. పెద్ద ఎత్తున ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. చేరువ అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత సాయి, బాను, సాగర్, బాషా, సుకేష్, సుధీర్, విశ్వ తదితరులు పాల్గొన్నారు.
- భారత్ మాత కి జై 🇮🇳1
- జై హొ సనాతన ధర్మం3
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- *ఆదిత్యుని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* - సూర్య దేవుని ఆశీస్సులు తీసుకున్న శివాన్ ఎర్రంనాయుడు - వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఏర్పాట్లపై ఆరా తీసిన రామ్మోహన్ నాయుడు. డిసెంబర్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు.. తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడు తో కలసి ఆదివారం నాడు శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వదాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని అదేశించారు. అరసవల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ ఆ ఆదిత్యుని తలచుకున్నా.. విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.1