అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకో - బీసీ దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ భవాని శంకర్ హెచ్చరిక పిఠాపురం: జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబర్పేట శ్రీనివాస్ యాదవ్పై బీసీ దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ భవాని శంకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ యాదవ్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా, కుల ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తున్న ఏకైక పార్టీ జనసేన అని ఆయన స్పష్టం చేశారు. శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలిపిన రామచంద్ర యాదవ్కు అసెంబ్లీ టికెట్ ఇచ్చి గౌరవించింది జనసేన పార్టీయేనని,బీసీలను మొదటి నుంచి గుర్తిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. రాజకీయంగా ఉనికి చాటుకోవడం కోసం,పబ్లిసిటీ కోసమే పవన్ కళ్యాణ్ పై శ్రీనివాస్ యాదవ్ పిచ్చి వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. కేవలం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాలనే తాపత్రయంతోనే ఇలాంటి దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నీలాగే మేము కూడా ఇష్టానుసారంగా మాట్లాడగలము కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాకు నేర్పిన సంస్కారం అడ్డు వస్తోంది. అంతేకానీ మా అసమర్థత కాదు" అని భవాని శంకర్ హెచ్చరించారు. "నోరు ఉంది కదా అని పబ్లిసిటీ కోసం ఇష్టానుసారంగా వాగితే సహించేది లేదు. మరోసారి పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే.. మళ్ళీ మైక్ పట్టుకోవడానికి కూడా భయపడేలా బుద్ధి చెప్తాం అని భవాని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలోని బీసీలందరూ నేడు సంతోషంగా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ వల్లనేనని, ఇకనైనా శ్రీనివాస్ యాదవ్ తన పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకో - బీసీ దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ భవాని శంకర్ హెచ్చరిక పిఠాపురం: జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబర్పేట శ్రీనివాస్ యాదవ్పై బీసీ దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ భవాని శంకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ యాదవ్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా, కుల ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తున్న ఏకైక పార్టీ జనసేన అని ఆయన స్పష్టం చేశారు. శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలిపిన రామచంద్ర యాదవ్కు అసెంబ్లీ టికెట్ ఇచ్చి గౌరవించింది జనసేన పార్టీయేనని,బీసీలను మొదటి నుంచి గుర్తిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. రాజకీయంగా ఉనికి చాటుకోవడం కోసం,పబ్లిసిటీ కోసమే పవన్ కళ్యాణ్ పై శ్రీనివాస్ యాదవ్ పిచ్చి వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. కేవలం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాలనే తాపత్రయంతోనే ఇలాంటి దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నీలాగే మేము కూడా ఇష్టానుసారంగా మాట్లాడగలము కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాకు నేర్పిన సంస్కారం అడ్డు వస్తోంది. అంతేకానీ మా అసమర్థత కాదు" అని భవాని శంకర్ హెచ్చరించారు. "నోరు ఉంది కదా అని పబ్లిసిటీ కోసం ఇష్టానుసారంగా వాగితే సహించేది లేదు. మరోసారి పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే.. మళ్ళీ మైక్ పట్టుకోవడానికి కూడా భయపడేలా బుద్ధి చెప్తాం అని భవాని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలోని బీసీలందరూ నేడు సంతోషంగా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ వల్లనేనని, ఇకనైనా శ్రీనివాస్ యాదవ్ తన పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
- పిఠాపురం: స్థానిక పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఫోటో ఎక్కడ? అని అధికారులను బహిరంగంగా నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జనసేన నేత పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులను నిలదీసే క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు నేతల అనుచరులు, టీడీపీ - జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ మీదకు దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. కార్యాలయం లోపల, బయట కార్యకర్తల మోహరింపుతో పాడా ఆఫీసు రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా? అంటూ అధికారులను నిలదీస్తూనే, ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులను సర్దిచెప్పి అక్కడి నుండి పంపించివేయడంతో ఉద్రిక్తత కాస్త సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరు పార్టీల మధ్య గొడవ జరిగిందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తరచూ పాడా కార్యాలయంలో ఇటువంటి ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్యే ఇలా బహిరంగంగా తోపులాట జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు పార్టీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.1
- శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు1
- 🙏😭1
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- Post by Sageni gangadhar1
- అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పట్టణం మొత్తం జలమయంగా కనిపించింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రోడ్లపై వరదలా ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు చేయడం కష్టంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది... జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం. ఘటన స్థలాలనికి చేరుకున్న గాజువాక ఫైర్ ఇంజన్లు దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో మంటలు చెలరేగుతున్నాయి...4
- పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.3