చిన్నారుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రాధాన్యం..*_ _*అంగన్వాడీల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది*_ _*ఎమ్మెల్యే మేఘారెడ్డి*_ ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నూతన అంగన్వాడీ భవన ప్రారంభం*_ _*విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం*_ _*చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి*_ _*రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం, సురక్షితమైన వాతావరణం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి అన్నారు.*_ _*శుక్రవారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు*_ _*అనంతరం కేంద్రంలోని వివిధ గదులు, చిన్నారులకు కల్పించిన సౌకర్యాలు, పోషకాహార పంపిణీ విధానాన్ని పరిశీలించి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు.*_ _*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలే మనిషి జీవితానికి తొలి పాఠశాలలన్నారు.*_ _*ఇక్కడే పిల్లల్లో విద్యపై ఆసక్తి, క్రమశిక్షణ, మంచి అలవాట్లు పెంపొందుతాయని పేర్కొన్నారు*_ _*అందువల్ల ప్రతి చిన్నారికి ప్రేమతో బోధిస్తూ నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు.*_ _*గ్రామీణ ప్రాంతాల చిన్నారులు కూడా పట్టణాల పిల్లలతో సమానంగా విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.*_ _*అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం, ఆరోగ్య సేవలు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన బోధన అందేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు*_ _*ప్రతి చిన్నారిని సొంత బిడ్డలా భావించి వారి సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.*_ _*ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పద్మమ్మ, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు నవనీత క్యామ రాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*_
చిన్నారుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రాధాన్యం..*_ _*అంగన్వాడీల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది*_ _*ఎమ్మెల్యే మేఘారెడ్డి*_ ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నూతన అంగన్వాడీ భవన ప్రారంభం*_ _*విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం*_ _*చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి*_ _*రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం, సురక్షితమైన వాతావరణం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి అన్నారు.*_ _*శుక్రవారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు*_ _*అనంతరం కేంద్రంలోని వివిధ గదులు, చిన్నారులకు కల్పించిన సౌకర్యాలు, పోషకాహార పంపిణీ విధానాన్ని పరిశీలించి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు.*_ _*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలే మనిషి జీవితానికి తొలి పాఠశాలలన్నారు.*_ _*ఇక్కడే పిల్లల్లో విద్యపై ఆసక్తి, క్రమశిక్షణ, మంచి అలవాట్లు పెంపొందుతాయని పేర్కొన్నారు*_ _*అందువల్ల ప్రతి చిన్నారికి ప్రేమతో బోధిస్తూ నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు.*_ _*గ్రామీణ ప్రాంతాల చిన్నారులు కూడా పట్టణాల పిల్లలతో సమానంగా విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.*_ _*అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం, ఆరోగ్య సేవలు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన బోధన అందేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు*_ _*ప్రతి చిన్నారిని సొంత బిడ్డలా భావించి వారి సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.*_ _*ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పద్మమ్మ, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు నవనీత క్యామ రాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*_
- రణ్బీర్ కపూర్ సాయి పల్లవి నటించిన రామాయణం ట్రైలర్ పై మిశ్రమస్తు స్పందన మొన్న విడుదల చేసిన రామాయణం పార్ట్ వన్ ట్రైలర్ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు రణబీర్ కపూర్ కన్నా యాష్ యాక్టింగ్ డామినేషన్ చేశాడని రావణాసురుడి పాత్రలలో పలువురు కామెంట్ చేశారు సీత పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోయిందని కొందరు సరిగ్గా సెట్ కాలేదని కొందరుకామెంట్ చేస్తున్నారు టైలర్లో హనుమంతుడు కనిపించకపోవడంతో ట్రైలర్ ఇన్ కంప్లీట్ గా ఉందని విస్మయం చెందుతున్నారు బిఎఫ్ ఎక్స్ మ్యూజిక్ బాగుంది అని అంటున్నారు1
- జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక ధరూర్ మండల పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఇన్ ఫ్లో :1,77,000 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో : 1,76,000 వేల, క్యూ సెక్కులు నీటిని 29 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.1
- నాగర్ కర్నూల్ జిల్లా వి బి జి రాంజీ ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం నాగర్ కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జి - సాంకేతిక సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాంకేతిక సహాయకులు ఏపీవోలు,ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.ఆ సంఘం జేఏసీ చెర్మన్, వాయిస్ చెర్మన్, నాయకులు మాట్లాడుతూ....వీబీజీ రామ్ జి పథకం లో 2006 నుంచి పనిచేస్తున్నాము. మాకు పే స్కెల్ అమలుచేసి తమ సమస్యలు పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో 20 మండలాల వీబిజి రాంజీ ఉద్యోగులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జి - సాంకేతిక సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాంకేతిక సహాయకులు ఏపీవోలు,ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.ఆ సంఘం జేఏసీ చెర్మన్, వాయిస్ చెర్మన్, నాయకులు మాట్లాడుతూ....వీబీజీ రామ్ జి పథకం లో 2006 నుంచి పనిచేస్తున్నాము. మాకు పే స్కెల్ అమలుచేసి తమ సమస్యలు పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో 20 మండలాల వీబిజి రాంజీ ఉద్యోగులు పాల్గొన్నారు.1
- తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ టీయూ లోగో ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.1
- రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ ..పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్ల రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ1
- నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా2
- నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న స్తంభాలు తొలగించాలి నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వార్డులలో పర్యటించి శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించాలన్నారు. వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.1
- జూరాలకు భారీ వరద.. 17 గేట్లు ఎత్తివేత దిగినన్న శ్రీశైలం ప్రాజెక్టు విడుదల గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 1,04,375 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 17 గేట్లను ఎత్తి 67,235 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 317.59 మీటర్లు (1,041.962 అడుగులు) గా నమోదైంది. ప్రాజెక్టు స్థూల సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.817 టీఎంసీల నీటి నిల్వ ఉంది. లైవ్ స్టోరేజ్ 4.11 టీఎంసీలుగా నమోదైంది. జూరాల జలవిద్యుత్ కేంద్రం ద్వారా 37,906 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్కు 750, భీమా లిఫ్ట్–1కు 1,300, కోయిల్సాగర్ లిఫ్ట్కు 315 క్యూసెక్కులు, ఎల్ఎంసీకి 870, ఆర్ఎంసీకి 500, ప్యారలల్ కెనాల్కు 600, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 1,09,519 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.1