*రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా దారుణ హత్య?* రాజన్న జిల్లా: ఏప్రిల్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది, ఈ ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధి 24 వ వార్డు రాజీవ్ నగర్ లో జరిగింది, స్థానికుల వివరాల ప్రకారం కోన లక్ష్మి 75 అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు ఉండగా ఒకరు చనిపోయారు. ఇద్దరిలో ఒకరు వేముల వాడ మరొకరు సిరిసిల్ల పట్టణంలోని సర్దార్ నగర్ లో నివాసం ఉంటున్నారు. కొనలక్ష్మి, రాజీవ్ నగర్ లో ఒంటరిగా ఉంటుంది, ఈ క్రమంలో చిన్న కొడుకు వెంకటేష్ మంగళవారం సాయంత్రం తల్లి వద్దకు రాగా..రక్తపు మడుగులో పడి ఉంది, దగ్గరికి వెళ్లి చూడగా దుండగులు గొంతులో కత్తితో పొడవడంతో మృతి చెందినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు హత్య ఘటనకు సంబం ధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా దారుణ హత్య?* రాజన్న జిల్లా: ఏప్రిల్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది, ఈ ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధి 24 వ వార్డు రాజీవ్ నగర్ లో జరిగింది, స్థానికుల వివరాల ప్రకారం కోన లక్ష్మి 75 అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు ఉండగా ఒకరు చనిపోయారు. ఇద్దరిలో ఒకరు వేముల వాడ మరొకరు సిరిసిల్ల పట్టణంలోని సర్దార్ నగర్ లో నివాసం ఉంటున్నారు. కొనలక్ష్మి, రాజీవ్ నగర్ లో ఒంటరిగా ఉంటుంది, ఈ క్రమంలో చిన్న కొడుకు వెంకటేష్ మంగళవారం సాయంత్రం తల్లి వద్దకు రాగా..రక్తపు మడుగులో పడి ఉంది, దగ్గరికి వెళ్లి చూడగా దుండగులు గొంతులో కత్తితో పొడవడంతో మృతి చెందినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు హత్య ఘటనకు సంబం ధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని నియోజకవర్గ సాధన కమిటీ కన్వీనర్ చుంచు రాజ్ కిరణ్ అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఇంటర్ పరీక్షలో టాపర్గా నిలిచిన అక్కల సాయి త్రినితను ఆయన కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కానగంటి మధు, మాజీ ఎంపీటీసీ తోట మోహన్, వల్లంబట్ల శ్రీనివాస్ బిళ్ళకూరి రమేష్ చుంచు గిరిధర్, గొల్ల రాయమల్లు, అంకతి గంగాధర్, చెలిగంటి మల్లేష్, గూడెం, గ్రామస్తులు పాల్గొన్నారు..1
- Post by Rajitha Antharpula9
- सरकार अब जो प्रस्ताव ला रही है, उसका महिला आरक्षण से कोई संबंध नहीं है। वो सिर्फ़ delimitation और gerrymandering के जरिए सत्ता हथियाने का प्रयास है। जाति जनगणना के आंकड़ों को दरकिनार कर OBC, दलित और आदिवासी समुदायों से किसी हालत में “हिस्सा चोरी” बर्दाश्त नहीं की जाएगी। हम दक्षिण, उत्तर-पूर्व, उत्तर-पश्चिम और छोटे राज्यों के साथ भी किसी कीमत पर अन्याय नहीं होने देंगे।1
- తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన అజీస్ పటేల్ జొన్న పంట కాలిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం పంట పొలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... దేవపూర్ గ్రామానికి చెందిన అజీస్ పటేల్ కు సంబంధించిన 6 ఎకరాల జొన్న పంట పూర్తిగా కాలిపోవడం బాధాకరమని అన్నారు. అధైర్యపడొద్దని ప్రభుత్వం తరపున అండగా ఉంటామని రైతు అజీస్ పటేల్ కు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ప్రభుత్వం కచ్చితంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేవలం వరి పంటలకే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో పండించే అన్ని పంటలకు రూ.500 బోనస్ అందిస్తే రైతులకు ఊరట కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ భీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం, మండలాల్లో పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదవుతోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకే 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో కార్యాలయాలకు, దుకాణాలకు, పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు వెళ్ళకుంటే మంచిదని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లను వెంట ఉంచుకోవాలని ప్రభుత్వ వైద్యులు కోరారు.1