చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు – నర్సంపేటలో వాల్ పోస్టర్ విడుదల.... శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి.... వరంగల్ జిల్లా నర్సంపేటలో వాల్ పోస్టర్ నర్సంపేట పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వరంగల్ రోడ్ చౌరస్తా కాకతీయ తోరణం వద్ద శుక్రవారం వాల్ పోస్టర్ను శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నంద్యాల వినయ్ రెడ్డి మాట్లాడుతూ— రాబోయే 19-02-2026 గురువారం రోజున మహబూబాబాద్ రోడ్, అరవింద్ రైస్ మిల్ సమీపంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మంది హాజరవుతారని, ఉదయం 9.30 గంటలకు ర్యాలీగా బయలుదేరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శివాజీ మహారాజ్ ధైర్యం, పరాక్రమం, స్వరాజ్య స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణ, దేశభక్తి భావనలను ప్రజల్లో మరింత బలంగా నాటేందుకు ఈ విగ్రహ ఆవిష్కరణ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. నర్సంపేటలో కొలువు దీరనున్న శివాజీ విగ్రహం పట్టణానికి గర్వకారణంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే విగ్రహ ఆవిష్కరణ రోజున హిందూ బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీలో పాల్గొని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పోలిపాక విజయ్, ఊరూగొండ శివ, శ్రీనివాస్, మల్లారెడ్డి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నాయకులు పట్టణ ప్రజలను కలిసి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించారు. నర్సంపేటలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠతో ప్రాంతంలో సాంస్కృతిక–జాతీయ చైతన్యం మరింత పెరుగుతుందని, రాబోయే రోజుల్లో ఈ స్థలం ప్రజలకు ప్రేరణ కేంద్రంగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు – నర్సంపేటలో వాల్ పోస్టర్ విడుదల.... శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి.... వరంగల్ జిల్లా నర్సంపేటలో వాల్ పోస్టర్ నర్సంపేట పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వరంగల్ రోడ్ చౌరస్తా కాకతీయ తోరణం వద్ద శుక్రవారం వాల్ పోస్టర్ను శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నంద్యాల వినయ్ రెడ్డి మాట్లాడుతూ— రాబోయే 19-02-2026 గురువారం రోజున మహబూబాబాద్ రోడ్, అరవింద్ రైస్ మిల్ సమీపంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మంది హాజరవుతారని, ఉదయం 9.30 గంటలకు ర్యాలీగా బయలుదేరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శివాజీ మహారాజ్ ధైర్యం, పరాక్రమం, స్వరాజ్య స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణ, దేశభక్తి భావనలను ప్రజల్లో మరింత బలంగా నాటేందుకు ఈ విగ్రహ ఆవిష్కరణ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. నర్సంపేటలో కొలువు దీరనున్న శివాజీ విగ్రహం పట్టణానికి గర్వకారణంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే విగ్రహ ఆవిష్కరణ రోజున హిందూ బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీలో పాల్గొని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పోలిపాక విజయ్, ఊరూగొండ శివ, శ్రీనివాస్, మల్లారెడ్డి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నాయకులు పట్టణ ప్రజలను కలిసి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించారు. నర్సంపేటలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠతో ప్రాంతంలో సాంస్కృతిక–జాతీయ చైతన్యం మరింత పెరుగుతుందని, రాబోయే రోజుల్లో ఈ స్థలం ప్రజలకు ప్రేరణ కేంద్రంగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
- ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.1
- తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది. 👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా? 👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.2
- Post by Motam Rajesh1
- ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు... రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర... మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.... ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం. ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు. ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు. ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు. తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు. కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ... తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం. రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది. రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము. తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.... ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్. దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.1
- _తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు_ _తీవ్ర ఉద్రిక్తతల మధ్య దయాకర్రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్కు లింపు_ _మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన ఎర్రబెల్లి దయాకర్రావు_ _కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలి అంటూ దయాకర్రావు కంటతడి_ _రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేశారంటూ ఎర్రబెల్లి దయాకర్రావు ఆవేదన_1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరగా, ఎంపీకి ఎక్స్ఆఫీషియో ఓటు హక్కు లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.1
- తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.2
- వరంగల్ మండలం వర్ధన్నపేటలో రోడ్డు వెడల్పు చేయకుండా డివైడర్ ఏర్పాటు చేయడంతో మరో లారీ ప్రమాదానికి గురైంది. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో అనేక వాహనాలు ప్రమాదాలకు గురై ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.1