తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయించిన ధూప దీప నైవేద్య అర్చక పథకం సోషల్ ఆడిట్ ఖమ్మం జిల్లాలో విజయవంతంగా పూర్తయిందని ఖమ్మం జిల్లా ధూపదీప నివేదన అర్చక సంఘం అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ఆడిట్లో ఖమ్మం జిల్లాలోని 20 మండలాలలో విస్తరించి ఉన్న సుమారు 370 దేవాలయాలను ఆడిటర్ అధికారులు సందర్శించి వివరాలు సేకరించినట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి అర్చక సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న అర్చకుల కుటుంబ పోషణ రోజురోజుకు భారంగా మారుతోందని పేర్కొంటూ, డీడీఎన్ అర్చకుల గౌరవ వేతనాన్ని ₹25,000/- మరియు పడితరం ₹10,000/-కు పెంచాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, అర్చకులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య వైద్య సదుపాయం అందించాలని కోరారు. నేడు సత్తుపల్లి మండల కేంద్రంలో సోషల్ ఆడిట్ పై అర్చకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ధూపదీప నైవేదన అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి మరింగంటి భార్గవాచార్యులు, కన్వీనర్/కోశాధికారి అన్నావజల ప్రసాద్ శర్మ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు యార్లగడ్డ దయానంద్, మండల సంఘం గౌరవ సలహాదారులు ఉప్పల వెంకటరమణ శర్మ, మరియు మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే, పెనుబల్లి మండలం ధూప దీప నివేదన అర్చక సంఘం అధ్యక్షులు గుండు కాశీ విశ్వనాథ శర్మ, కల్లూరు మండలం ధూపదీప నివేదన అర్చక సంఘం అధ్యక్షులు ఇంగువ పూర్ణానంద శర్మ, ప్రధాన కార్యదర్శి ఆమనమంచి కృష్ణమోహన్ శర్మ, ఖమ్మం రూరల్ మండలం ధూపదీప నివేదన అర్చక సంఘం అధ్యక్షులు అవధానుల సీతారామ శర్మ, కొనిజర్ల మండలం ధూపదీప నివేదన అర్చక సంఘం అధ్యక్షులు అని పెద్ది యశ్వంత్ శర్మతో పాటు వివిధ మండలాల అర్చకులు మరియు వారి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయించిన ధూప దీప నైవేద్య అర్చక పథకం సోషల్ ఆడిట్ ఖమ్మం జిల్లాలో విజయవంతంగా పూర్తయిందని ఖమ్మం జిల్లా ధూపదీప నివేదన అర్చక సంఘం అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ఆడిట్లో ఖమ్మం జిల్లాలోని 20 మండలాలలో విస్తరించి ఉన్న సుమారు 370 దేవాలయాలను ఆడిటర్ అధికారులు సందర్శించి వివరాలు సేకరించినట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి అర్చక సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న అర్చకుల కుటుంబ పోషణ రోజురోజుకు భారంగా
మారుతోందని పేర్కొంటూ, డీడీఎన్ అర్చకుల గౌరవ వేతనాన్ని ₹25,000/- మరియు పడితరం ₹10,000/-కు పెంచాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, అర్చకులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య వైద్య సదుపాయం అందించాలని కోరారు. నేడు సత్తుపల్లి మండల కేంద్రంలో సోషల్ ఆడిట్ పై అర్చకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ధూపదీప నైవేదన అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి మరింగంటి భార్గవాచార్యులు, కన్వీనర్/కోశాధికారి అన్నావజల ప్రసాద్ శర్మ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు యార్లగడ్డ దయానంద్, మండల సంఘం గౌరవ సలహాదారులు
ఉప్పల వెంకటరమణ శర్మ, మరియు మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే, పెనుబల్లి మండలం ధూప దీప నివేదన అర్చక సంఘం అధ్యక్షులు గుండు కాశీ విశ్వనాథ శర్మ, కల్లూరు మండలం ధూపదీప నివేదన అర్చక సంఘం అధ్యక్షులు ఇంగువ పూర్ణానంద శర్మ, ప్రధాన కార్యదర్శి ఆమనమంచి కృష్ణమోహన్ శర్మ, ఖమ్మం రూరల్ మండలం ధూపదీప నివేదన అర్చక సంఘం అధ్యక్షులు అవధానుల సీతారామ శర్మ, కొనిజర్ల మండలం ధూపదీప నివేదన అర్చక సంఘం అధ్యక్షులు అని పెద్ది యశ్వంత్ శర్మతో పాటు వివిధ మండలాల అర్చకులు మరియు వారి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- ఖమ్మంలో కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా మెగా వైద్య శిబిరం మరియు మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తుమ్మల, నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ఆయనను స్మరించుకుంటూ కమ్మ మహాజన సంఘం ఉచిత మెగా వైద్య శిబిరం మరియు మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలతో పాటు, ఈ సంఘం ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు, సేవలు చేసి ఖమ్మం ప్రజలందరికీ ఉపయోగపడాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు.2
- ఈరోజు సత్రంపాడులోని అంబికా దేవి గుడి శివాలయంలో శివుని యొక్క శివలింగానికి అభిషేకం వైభవంగా జరిగింది. టౌన్ తెలుగుదేశం బీసీ సెల్ సెక్రెటరీ ఎల్లపు మోహన దుర్గారావు స్వయంగా శివలింగానికి అభిషేకం చేసి, శివుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో గాంధీ స్కూల్ డైరెక్టర్ ఎల్లపు లక్ష్మి గారు కూడా పాల్గొన్నారు. ఆయనతో పాటు చాలామంది భక్తులు కూడా శివలింగానికి అభిషేకం చేసి, అంబికా దేవిని దర్శించుకున్నారు. ఏలూరు భక్తులందరూ సత్రంపాడు అంబికా దేవి ఆలయమునకు వెళ్లి, దర్శించుకుని, శివుని కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా కోరారు.1
- ఖమ్మం నగరంలోని శ్రీస్తంబాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో, ఆలయ గుట్టపై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను గమనించిన భక్తులు తక్షణమే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదే సమయంలో, చుట్టుపక్కల ఇళ్ళలోని ప్రజలు కూడా బకెట్లతో నీళ్ళు చల్లి మంటలను ఆర్పేందుకు సహాయపడ్డారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ మంటలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.2
- టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం నాడు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కనీసం వైద్య సేవలు కూడా అందించలేని దయనీయ స్థితి ఉందని తీవ్రంగా విమర్శించారు. ఆమె మాట్లాడుతూ, డబ్బులు లేని కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఒక చిన్నారి, అక్కడ వైద్యుల నిర్లక్ష్యం వల్ల రక్తం ఎక్కించే క్రమంలో అంగవైకల్యానికి గురయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించి, బాధిత బాలుడి కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం అందించాలని కవిత గట్టిగా డిమాండ్ చేశారు.1
- రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే, గోదావరి పరివాహక ప్రాంతంలోని దేవాలయాలను ₹1000 కోట్ల నిధులతో అభివృద్ధి చేయడానికి కార్యాచరణను రూపొందించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అలాగే, భద్రాచల దేవస్థానంలో కూడా ₹350 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించామని తెలిపారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమై, పుష్కరాల సమయం నాటికి పూర్తి చేయబడతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ₹100 కోట్లు ఇస్తామని చెప్పి, కనీసం ₹100 పైసలు కూడా ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.1
- పొగాకు వినియోగించే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని DMHO విజయలక్ష్మి హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం నాడు సిబార్ వైద్య విద్యార్థులు నగరంపాలెంలో ఒక భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే అత్యధికంగా 12 శాతం మంది పొగాకును వినియోగిస్తున్నారని తెలిపారు. దీని నియంత్రణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.1
- ఈరోజు ఏలూరులోని ఆర్ఆర్ పేట వెంకటేశ్వర స్వామి గుడి భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్క భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న సమారాధనలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూలైన్ను క్రమశిక్షణతో పాటించారు. ప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. మొత్తంగా, ఈరోజు ఏలూరు ఆర్ఆర్ పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది.1
- గ్రామీణ ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి పంటల కోతల అనంతరం పొలాల్లో పంట అవశేషాలను తగలబెట్టే ఘటనలు గణనీయంగా పెరుగుతున్నాయి. వ్యవసాయ ఖర్చులు పెరగడం, అవసరమైన యంత్రాల కొరత, అలాగే తదుపరి పంట సాగు చేయాలనే ఒత్తిడి వంటి కారణాల వల్లనే రైతులు ఈ పద్ధతిని ఆశ్రయిస్తున్నారని రైతులు స్వయంగా చెబుతున్నారు. అయితే, పంట అవశేషాలను దహనం చేయడం వల్ల భూమి సారవంతానికి కీలకమైన సూక్ష్మజీవులు, వానపాములు నశించిపోతున్నాయి. ఇది భూమి నాణ్యతను దెబ్బతీయడంతో పాటు గాలి కాలుష్యాన్ని పెంచుతోంది. అంతేకాకుండా, రహదారుల పక్కన ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు, సమీపంలోని ఇతర పంటలకు మంటలు అంటుకునే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ పొగ కారణంగా రోడ్లపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ వర్గాల సూచనల ప్రకారం, రైతులను నిందించడం కంటే, రోటావేటర్, మల్చర్, బేలర్ వంటి ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం అవసరం. అదనంగా, పంట అవశేషాలను పశుగ్రాసంగా, కంపోస్టు ఎరువుగా, లేదా బయోమాస్ ఇంధనంగా వినియోగించుకునే వ్యవస్థలను గ్రామ స్థాయిలో అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యవసాయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పంట అవశేషాల దహనానికి శాశ్వత ప్రత్యామ్నాయ పరిష్కారాలను అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.1