రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిల్లు కోసం స్కుల్ కు తాళం వేసిన వల్లంపట్ల మాజీ సర్పంచ్...స్కూల్ అదనపు తరగతి గదుల బిల్లులు చెల్లించే వరకు తాళం తీయనని హెచ్చరిక రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో మన ఊరు మన బడిలో నిర్మించిన అదనపు గదుల బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ వినూత్న ఆందోళనకు దిగారు. పిల్లలను బయట పంపించి స్కూల్ గేట్ కు తాళం వేశారు. వల్లంపట్ల పాఠశాల అదనపు గదులు, కిచెన్ షెడ్డు నిర్మాణం దాదాపు 22 లక్షలు పెట్టి మాజీ సర్పంచ్ మూడేళ్ళ క్రితం ఫూర్తి చేశారు. పనులు పూర్తై బిల్డింగ్ వినియోగం లోకి వచ్చినా బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ అనసూయ భర్త ఆందోళనకు దిగారు. స్కూల్ అదనపు తరగతి గదులకు, కిచెన్ షెడ్ కు తాళం వేశారు .గదులు తాళం వేయడంతో విద్యార్థులు వరండాలోనే కూర్చున్నారు. విషయం తెలుసుకుని పాఠశాలకు అధికారులు, పోలీసులు చేరుకుని మాజీ సర్పంచ్ భర్తను సముదాయించారు. బిల్లులు వచ్చేవరకు తాళం తీయనని స్పష్టం చేశారు. చేసేదేమీ లేక మరో గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి బోధన సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ 20 లక్షల వరకు ఉందని అందులో ఐదో పదో ఇచ్చి తమ ఆర్థిక ఇబ్బందులను తీర్చాలని కోరారు. లేదంటే ఆర్థిక ఇబ్బందులతో తనకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. స్పాట్ బైట్...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిల్లు కోసం స్కుల్ కు తాళం వేసిన వల్లంపట్ల మాజీ సర్పంచ్...స్కూల్ అదనపు తరగతి గదుల బిల్లులు చెల్లించే వరకు తాళం తీయనని హెచ్చరిక రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో మన ఊరు మన బడిలో నిర్మించిన అదనపు గదుల బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ వినూత్న ఆందోళనకు దిగారు. పిల్లలను బయట పంపించి స్కూల్ గేట్ కు తాళం వేశారు. వల్లంపట్ల పాఠశాల అదనపు గదులు, కిచెన్ షెడ్డు నిర్మాణం దాదాపు 22 లక్షలు పెట్టి మాజీ సర్పంచ్ మూడేళ్ళ క్రితం ఫూర్తి చేశారు. పనులు పూర్తై బిల్డింగ్ వినియోగం లోకి వచ్చినా బిల్లు రాకపోవడంతో మాజీ
సర్పంచ్ అనసూయ భర్త ఆందోళనకు దిగారు. స్కూల్ అదనపు తరగతి గదులకు, కిచెన్ షెడ్ కు తాళం వేశారు .గదులు తాళం వేయడంతో విద్యార్థులు వరండాలోనే కూర్చున్నారు. విషయం తెలుసుకుని పాఠశాలకు అధికారులు, పోలీసులు చేరుకుని మాజీ సర్పంచ్ భర్తను సముదాయించారు. బిల్లులు వచ్చేవరకు తాళం తీయనని స్పష్టం చేశారు. చేసేదేమీ లేక మరో గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి బోధన సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ 20 లక్షల వరకు ఉందని అందులో ఐదో పదో ఇచ్చి తమ ఆర్థిక ఇబ్బందులను తీర్చాలని కోరారు. లేదంటే ఆర్థిక ఇబ్బందులతో తనకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. స్పాట్ బైట్...
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విభాగం ఉక్కుపాదం మోపింది. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు అధికారులు ఏకకాలంలో పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, జీఎస్టీ ఎగవేత, పాన్ కార్డుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మధ్యవర్తుల ప్రమేయంపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిర్దేశించిన ఫీజుల వసూలులో పారదర్శకత, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో లోపాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తుల జోక్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.4
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.1
- Post by నీరటి మహేందర్1
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో కన్న పిల్లలను చంపేందుకు తండ్రి కుట్ర పన్నిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, రెండో భార్యతో కలిసి విషం కలిపిన బిస్కెట్లు ఇచ్చి ఇద్దరు కుమారులను హతమార్చాలని ప్రణాళిక రచించారు. స్థానిక వ్యక్తి అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. పిల్లల తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రి శ్రీనివాస్, రెండో భార్య మమతలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.1
- అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత హాజరై, ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్. లత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణ కాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. రాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో మాట్లాడుతూ...రక్తదానం పట్ల ఇలాంటి అపోహలు అనుమానాలు అక్కరలేదని ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అలాగే, అగ్నిప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభావించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందిదే ప్రధానపాత్ర అనీ, వారిని ముందుకు నడిపించే అధికారులే అసలైన రియల్ హీరోస్ అన్నారు. అనంతరం, అగ్నిమాపక శాఖలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. కాగా ఈ రక్తదాన శిభిరంలో జిల్లా అధికారి సైదులుతో పాటుగా 30 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.4
- Post by JADI RAJU1
- సిరిసిల్ల లో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎమ్మార్వో పై దాడి కి యత్నించారు. సిరిసిల్ల లో తహశిల్దార్ మహేశ్పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్ తోలో దాడికి యత్నించారు. ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీ పరార్ అయ్యారు. ప్రమాదం నుంచి తృటిలో తహశీల్దార్ తప్పించుకున్నారు. పోలీసులకు తహశిల్దార్ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్కు తరలించారు. పోలీసులు ట్రాక్టర్ ను సీజ్ చేసి ఎమ్మార్వో కు రాశారు.2