Shuru
Apke Nagar Ki App…
తెలంగాణలో బత్తాయి రైతులు తీవ్ర నష్టాలతో సతమతమవుతున్నారు. కాయ నాణ్యత లేకపోవడం, తెగుళ్ల బెడద, అధికారుల పర్యవేక్షణ లోపంతో బత్తాయి తోటలు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. పెట్టుబడి కూడా రాక ఆవేదనలో ఉన్న రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
T Shankar Public News Reporter Nalgonda
తెలంగాణలో బత్తాయి రైతులు తీవ్ర నష్టాలతో సతమతమవుతున్నారు. కాయ నాణ్యత లేకపోవడం, తెగుళ్ల బెడద, అధికారుల పర్యవేక్షణ లోపంతో బత్తాయి తోటలు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. పెట్టుబడి కూడా రాక ఆవేదనలో ఉన్న రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
More news from Telangana and nearby areas
- నల్గొండ: కనిపించని స్పీడ్ బ్రేకర్లు.. వాహనదారుల ప్రాణాలకే ముప్పు NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా ఏమి రెడ్డి గూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఇవి అసలు కనిపించక వాహనాలు అదుపుతప్పి పలువురు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే రహదారి భద్రత అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- తిప్పర్తి మండలంలో ఇండియన్ గ్యాస్ కస్టమర్ల సమస్యను పరిష్కరించాలి: సిపిఎం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని సిపిఎం మండల కార్యదర్శి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి మణిదీప్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మన్నెం బిక్షం, మండల నాయకులు భీమగాని గణేష్ లు మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న కస్టమర్లకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వెంటనే సిలిండర్ అందజేయాలని డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.16,83,760, VIP దర్శనాలతో రూ.9,29,700, కార్ పార్కింగ్తో రూ.7,27,500, బ్రేక్ దర్శనాలతో రూ.4,21,500, ప్రధాన బుకింగ్తో రూ.3,57,950, వ్రతాలతో రూ.2,79,000, యాదరుషి నిలయం రూ.2,71,150, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.51,80,379 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- తెలంగాణ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బూతు పురాణంతో వార్తల్లో నిలిచారు. అధికారం రాగానే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.1
- NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.1
- నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి:బీజేపీ ఎంపీ బండి సంజయ్ నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాలను బిజెపి కార్యకర్తలు ప్రజలు నమ్మవద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సామాన్యంగా కార్యకర్తగా కాషాయం జెండాను భుజంపై ఎత్తుకొని కేంద్రమంత్రి అయ్యానని కాలర్ ఎగర వేసుకొని నేను బిజెపి కార్యకర్తలు అని చెప్పుకుంటానని తెలిపారు. తండ్రుల పేర్లు చెప్పి నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.1
- నల్గొండలో చికెన్ ధరలు అమాంతం పెరిగి రూ.330 దాటాయి, మటన్ ధరలను చేరువవుతున్నాయి. వేసవిలో కోళ్ల దిగుమతి తగ్గడంతో ఈ ధరల పెరుగుదల సంభవించిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయల వైపు మొగ్గు చూపుతున్నారు.1