logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు గ్రామంలో కొలువైన స్వయంభూ సిద్ధేశ్వరాలయంలో సోమవారం మహా గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరగనుంది. పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన నిజ జేష్ఠ బహుళ చతుర్ధశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం 7:30 గంటలకు ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను శనివారం ఆలయ కమిటీ చైర్మన్ ఈదులకంటి వెంకటరెడ్డి, ముఖ్య కార్యనిర్వాహణాధికారి దం వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓం నమ శివాయలు వెల్లడించారు. భక్తులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ మహా గిరి ప్రదక్షిణలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

2 hrs ago
user_Bachannapet, Jangoan, Telangan
Bachannapet, Jangoan, Telangan
Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
2 hrs ago
60506972-b3df-4f2d-bb60-36274b3b0b57

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు గ్రామంలో కొలువైన స్వయంభూ సిద్ధేశ్వరాలయంలో సోమవారం మహా గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరగనుంది. పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన నిజ జేష్ఠ బహుళ చతుర్ధశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం 7:30 గంటలకు ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను శనివారం ఆలయ కమిటీ చైర్మన్ ఈదులకంటి వెంకటరెడ్డి, ముఖ్య కార్యనిర్వాహణాధికారి దం వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓం నమ శివాయలు వెల్లడించారు. భక్తులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ మహా గిరి ప్రదక్షిణలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలోని కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు మాట్లాడితే రక్తం పారిస్తా, నాలిక కోస్తా అనడం ఒక సీఎం మాట్లాడే భాషేనా అని ఆయన నిలదీశారు. బ్యారేజీల గురించి రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే కరుస్తున్నావని, అదే ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లు మాట్లాడితే వారిపై ఏసీబీ దాడులు చేయిస్తున్నావని హరీష్ రావు సీఎంపై ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు మాట్లాడితే రక్తం పారిస్తా, నాలిక కోస్తా అనడం సరికాదన్న ఆయన, ముఖ్యమంత్రికి ప్రజలను ఎలా కాపాడుకోవాలనే తపన ఉండాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వదులుతూ తన గురువు (CBN)కు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్షాలను రక్తం పారిస్తా, కోస్తా అంటావా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    2
    తెలంగాణలోని కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు మాట్లాడితే రక్తం పారిస్తా, నాలిక కోస్తా అనడం ఒక సీఎం మాట్లాడే భాషేనా అని ఆయన నిలదీశారు.

బ్యారేజీల గురించి రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే కరుస్తున్నావని, అదే ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లు మాట్లాడితే వారిపై ఏసీబీ దాడులు చేయిస్తున్నావని హరీష్ రావు సీఎంపై ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు మాట్లాడితే రక్తం పారిస్తా, నాలిక కోస్తా అనడం సరికాదన్న ఆయన, ముఖ్యమంత్రికి ప్రజలను ఎలా కాపాడుకోవాలనే తపన ఉండాలని హితవు పలికారు.

ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వదులుతూ తన గురువు (CBN)కు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్షాలను రక్తం పారిస్తా, కోస్తా అంటావా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • జనగామ జిల్లా కేంద్రంలోని పలు మాంసం విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారులు ఆదివారం ఉదయం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 20 కిలోల నాసిరకం, పరిశుభ్రత లేని మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఒక వ్యాపారిపై రూ. లక్ష భారీ జరిమానా విధించినట్లు పురపాలక సంఘం అధికారులు వెల్లడించారు. నగరంలోని మాంసం వ్యాపారులందరూ ప్రభుత్వం అనుమతించిన స్లాటర్ హౌస్‌లలోనే జంతువులను వధించాలని, ప్రజలకు కేవలం పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని మాత్రమే విక్రయించాలని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ వధలు, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయించడం లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏ చర్యలైనా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మున్సిపల్ చట్టం మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జనగామ మున్సిపాలిటీ పనిచేస్తోందని అధికారులు తెలిపారు. నగర ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అపరిశుభ్రంగా లేదా నాణ్యత లేని మాంసం, చికెన్ విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే జనగామ మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇటువంటి ఫిర్యాదులపై తాము తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలోని పలు మాంసం విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారులు ఆదివారం ఉదయం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 20 కిలోల నాసిరకం, పరిశుభ్రత లేని మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఒక వ్యాపారిపై రూ. లక్ష భారీ జరిమానా విధించినట్లు పురపాలక సంఘం అధికారులు వెల్లడించారు.

నగరంలోని మాంసం వ్యాపారులందరూ ప్రభుత్వం అనుమతించిన స్లాటర్ హౌస్‌లలోనే జంతువులను వధించాలని, ప్రజలకు కేవలం పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని మాత్రమే విక్రయించాలని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ వధలు, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయించడం లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏ చర్యలైనా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మున్సిపల్ చట్టం మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు.

ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జనగామ మున్సిపాలిటీ పనిచేస్తోందని అధికారులు తెలిపారు. నగర ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అపరిశుభ్రంగా లేదా నాణ్యత లేని మాంసం, చికెన్ విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే జనగామ మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇటువంటి ఫిర్యాదులపై తాము తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter Jangoan, Telangana•
    14 hrs ago
  • యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆలయానికి ఒకే రోజు రూ.68,22,052 నిత్య ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ఆలయ ఆదాయ వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.21,00,810 లభించాయి. అలాగే VIP दर्शनాలతో రూ.15,23,100, కార్ పార్కింగ్ ద్వారా రూ.8,47,000, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.8,40,600 రాగా, తదితర విభాగాల నుంచి కూడా ఆలయానికి ఆదాయం సమకూరింది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో పేర్కొన్నారు.
    1
    యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆలయానికి ఒకే రోజు రూ.68,22,052 నిత్య ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. 

ఆలయ ఆదాయ వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.21,00,810 లభించాయి. అలాగే VIP दर्शनాలతో రూ.15,23,100, కార్ పార్కింగ్ ద్వారా రూ.8,47,000, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.8,40,600 రాగా, తదితర విభాగాల నుంచి కూడా ఆలయానికి ఆదాయం సమకూరింది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో పేర్కొన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • నకిరేకల్ నియోజకవర్గ ప్రజల సేవకుడిగా మన దైద రవీందర్ అన్న నిలిచారు. ఎలాంటి అధికారిక పదవి దక్కకపోయినప్పటికీ, ఎన్ని అవమానాలు, కష్టాలు మరియు కన్నీళ్లు ఎదురైనా ఆయన వెనకడుగు వేయలేదు. క్యారెక్టర్ అనే తన ఉత్తమమైన గుణంతో నిరంతరం ప్రజల కోసమే ఆయన దృఢంగా నిలబడుతున్నారు.
    1
    నకిరేకల్ నియోజకవర్గ ప్రజల సేవకుడిగా మన దైద రవీందర్ అన్న నిలిచారు. ఎలాంటి అధికారిక పదవి దక్కకపోయినప్పటికీ, ఎన్ని అవమానాలు, కష్టాలు మరియు కన్నీళ్లు ఎదురైనా ఆయన వెనకడుగు వేయలేదు. క్యారెక్టర్ అనే తన ఉత్తమమైన గుణంతో నిరంతరం ప్రజల కోసమే ఆయన దృఢంగా నిలబడుతున్నారు.
    user_నరేష్ nakarekantihttps://shuru
    నరేష్ nakarekantihttps://shuru
    Auto Accessories Store యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    5 hrs ago
  • సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని మాసాన్‌పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం పోసి, మంగళహారతులతో బోనాలు సమర్పించారు. మాసాన్‌పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కల్యాణం అనంతరం భక్తులందరికీ కమిటీ సభ్యులు భారీగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, పెద్దమ్మ తల్లి దయతో గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి ధన, వస్తు రూపేణా సహకరించిన దాతలకు, రాత్రింబవళ్లు కష్టపడిన గ్రామ యువకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ కులస్థులు, మహిళలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.
    1
    సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని మాసాన్‌పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం పోసి, మంగళహారతులతో బోనాలు సమర్పించారు. మాసాన్‌పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కల్యాణం అనంతరం భక్తులందరికీ కమిటీ సభ్యులు భారీగా అన్నప్రసాద వితరణ చేశారు.

ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, పెద్దమ్మ తల్లి దయతో గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి ధన, వస్తు రూపేణా సహకరించిన దాతలకు, రాత్రింబవళ్లు కష్టపడిన గ్రామ యువకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ కులస్థులు, మహిళలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.
    user_B Narsimhulu
    B Narsimhulu
    Financial Analyst గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
  • జగిత్యాల జిల్లా ధర్మపురి నక్కలపేట దారిలోని కొరండ్లపల్లి గ్రామ స్టేజి సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు పక్కన ఒక మొసలి సంచరించడం తీవ్ర కలకలం సృష్టించింది. సాధారణంగా నీటిలో ఉండే మొసలి ఇలా హఠాత్తుగా రోడ్డుపైకి రావడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొరండ్లపల్లి సమీపంలో రోడ్డుపై మొసలి కనిపించడంతో స్థానిక ప్రజలు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితి నేపథ్యంలో, సంబంధిత అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డుపై సంచరిస్తున్న ఆ మొసలిని వెంటనే బంధించి, తమకు తగిన రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    జగిత్యాల జిల్లా ధర్మపురి నక్కలపేట దారిలోని కొరండ్లపల్లి గ్రామ స్టేజి సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు పక్కన ఒక మొసలి సంచరించడం తీవ్ర కలకలం సృష్టించింది. సాధారణంగా నీటిలో ఉండే మొసలి ఇలా హఠాత్తుగా రోడ్డుపైకి రావడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొరండ్లపల్లి సమీపంలో రోడ్డుపై మొసలి కనిపించడంతో స్థానిక ప్రజలు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ ప్రమాదకర పరిస్థితి నేపథ్యంలో, సంబంధిత అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డుపై సంచరిస్తున్న ఆ మొసలిని వెంటనే బంధించి, తమకు తగిన రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా భద్రాద్రి భద్రాచలం చేరుకున్న జాతీయ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్‌కు స్థానిక తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు విచ్చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రోటోకాల్ దర్శనం ద్వారా రాజేంద్ర ప్రసాద్ స్వామివారిని దర్శించుకోగా, ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగబద్ధమైన, బలమైన స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు చేయడమే పంచాయతీ రాజ్ చాంబర్ యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మహత్తర లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తున్నామని ఆయన తెలిపారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీర్వాదంతో తమ ఆశయం సిద్ధించే వరకు రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పుసులూరు నరేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, ఏపీ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు శశికళ యాదవ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పుస్కూరి అశోక్ రావు, శ్రీశైలం యాదవ్, లోడిగ వెంకన్న యాదవ్, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్ మరియు పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి, ఉపాధ్యక్షులు ఆనేపు రామకృష్ణ నాయుడు, వై. వినోద్ రాజు, వానపల్లి ముత్యాలరావు, కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య, గోగినేని వసుధ, జల్లు కొండయ్యలతో పాటు వివిధ జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు ప్రతినిధులు ఈ స్వాగత వేడుకలో పాల్గొన్నారు.
    3
    తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా భద్రాద్రి భద్రాచలం చేరుకున్న జాతీయ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్‌కు స్థానిక తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు విచ్చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రోటోకాల్ దర్శనం ద్వారా రాజేంద్ర ప్రసాద్ స్వామివారిని దర్శించుకోగా, ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగబద్ధమైన, బలమైన స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు చేయడమే పంచాయతీ రాజ్ చాంబర్ యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మహత్తర లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తున్నామని ఆయన తెలిపారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీర్వాదంతో తమ ఆశయం సిద్ధించే వరకు రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పుసులూరు నరేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, ఏపీ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు శశికళ యాదవ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పుస్కూరి అశోక్ రావు, శ్రీశైలం యాదవ్, లోడిగ వెంకన్న యాదవ్, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్ మరియు పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి, ఉపాధ్యక్షులు ఆనేపు రామకృష్ణ నాయుడు, వై. వినోద్ రాజు, వానపల్లి ముత్యాలరావు, కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య, గోగినేని వసుధ, జల్లు కొండయ్యలతో పాటు వివిధ జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు ప్రతినిధులు ఈ స్వాగత వేడుకలో పాల్గొన్నారు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో రోడ్డు సమీపంలో ప్రమాదవశాత్తు గడ్డి పొదలకు నిప్పంటుకుని భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంపై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. మంటలు చెలరేగిన ప్రాంతం గడ్డి పొదలతో కూడిన ఖాళీ స్థలం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమీపంలోనే ఉన్న పెట్రోల్ బంక్, నివాస గృహ సముదాయాలకు మంటలు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో రోడ్డు సమీపంలో ప్రమాదవశాత్తు గడ్డి పొదలకు నిప్పంటుకుని భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంపై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు.

మంటలు చెలరేగిన ప్రాంతం గడ్డి పొదలతో కూడిన ఖాళీ స్థలం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమీపంలోనే ఉన్న పెట్రోల్ బంక్, నివాస గృహ సముదాయాలకు మంటలు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.