ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయని శ్రీకాళహస్తి సిడిపివో శాంతిదుర్గా అన్నారు. నేటినుంచి కేంద్ర ప్రభుత్వంసహకారంతో ప్రతి ఏడాది ఆగస్ట్ 1తేదీనుంచి 7తేదీ వరకు నిర్వహించే తల్లి పాల వారోత్సవాలు సందర్భంగా శ్రీకాళహస్తిమండలంలోని టిఏంవి కండ్రిగా గ్రామంలో ఐసీడీఎస్ పీడీపిఓశాంతిదుర్గా ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ సమావేశంలో గ్రామంలోనీ ప్రజాప్రతినిధులు గర్భిణులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిపో మరియు ప్రజాప్రతినిధులు పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లి పాలు పట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి గర్భిణులు, బాలింతలకు వివరించారు. అలాగే బిడ్డకు 6 నెలలు పూర్తయ్యే వరకు కేవలం తల్లి పాలు మాత్రమే తాగించాలని, ఇతర ఎలాంటి పానీయాలు పెట్టకూడదని సూచించారు. తల్లిపాలు బిడ్డ మానసిక, శారీరకంగా ఎదుగులకు ఉపయోగపడతాయన్నారు. చాలా మంది తల్లులు పిల్లలకు తేనె, నీళ్లు వంటివి పడుతుంటారని, అలా చేయడం వల్ల బిడ్డ అనారోగ్యానికి గురవుతారన్నారు. రెండేళ్ల నుంచి బిడ్డకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని జేసీ అభిషేక్గౌడ్ పేర్కొన్నారు. పల్లెలోనూ తల్లిపాల ప్రాముఖ్యతపై చర్చ జరగాలన్నారు. పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి పెరగడానికి తల్లిపాలు ఎంతో దోహదపడతాయన్నారు. బహిరంగ ప్రదేశాలలో గర్భిణులకు వారి పిల్లలకు పాలు ఇచ్చే విధంగా(మదర్ ఫీడింగ్ రూమ్) ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలనేది, ఇ ఏడాది ప్రతిపాదనని, ఈ ప్రతిపాదనను అమలుచేసే విధంగ తమ శాఖ పనిచేస్తుందని తెలియజేశామన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయని శ్రీకాళహస్తి సిడిపివో శాంతిదుర్గా అన్నారు. నేటినుంచి కేంద్ర ప్రభుత్వంసహకారంతో ప్రతి ఏడాది ఆగస్ట్ 1తేదీనుంచి 7తేదీ వరకు నిర్వహించే తల్లి పాల వారోత్సవాలు సందర్భంగా శ్రీకాళహస్తిమండలంలోని టిఏంవి కండ్రిగా గ్రామంలో ఐసీడీఎస్ పీడీపిఓశాంతిదుర్గా ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ సమావేశంలో గ్రామంలోనీ ప్రజాప్రతినిధులు గర్భిణులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిపో మరియు ప్రజాప్రతినిధులు పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లి పాలు పట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి గర్భిణులు, బాలింతలకు వివరించారు. అలాగే బిడ్డకు 6 నెలలు పూర్తయ్యే వరకు కేవలం తల్లి పాలు మాత్రమే తాగించాలని, ఇతర ఎలాంటి పానీయాలు పెట్టకూడదని సూచించారు. తల్లిపాలు బిడ్డ మానసిక, శారీరకంగా ఎదుగులకు ఉపయోగపడతాయన్నారు. చాలా మంది తల్లులు పిల్లలకు తేనె, నీళ్లు వంటివి పడుతుంటారని, అలా చేయడం వల్ల బిడ్డ అనారోగ్యానికి గురవుతారన్నారు. రెండేళ్ల నుంచి బిడ్డకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని జేసీ అభిషేక్గౌడ్ పేర్కొన్నారు. పల్లెలోనూ తల్లిపాల ప్రాముఖ్యతపై చర్చ జరగాలన్నారు. పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి పెరగడానికి తల్లిపాలు ఎంతో దోహదపడతాయన్నారు. బహిరంగ ప్రదేశాలలో గర్భిణులకు వారి పిల్లలకు పాలు ఇచ్చే విధంగా(మదర్ ఫీడింగ్ రూమ్) ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలనేది, ఇ ఏడాది ప్రతిపాదనని, ఈ ప్రతిపాదనను అమలుచేసే విధంగ తమ శాఖ పనిచేస్తుందని తెలియజేశామన్నారు.
- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.3
- Post by KLakshmi Devi1
- భారత్ మాత కి జై 🇮🇳1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- Post by Ravi Poreddy1
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- మనసున్న వారు మూర్కులకు మృగం క్రూరమైన వారికి కూడా సహాయం చేయగలరు1