అల్లూరి జిల్లా అనంతగిరి, డుంబ్రిగూడ, హుక్కుంపేట మండలాలను విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు కలిపే నిమ్మలపాడు - వేంగడ 10 కిలోమీటర్ల ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు వాహనంపై కొద్దిగా అదుపు తప్పినా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు. ఇరుకైన ఈ రోడ్డులో ప్రయాణించేటప్పుడు వాహనదారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 2016లో కోట్ల రూపాయల పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన ఈ రోడ్డు, ఇటీవల కాలంలో జుంబువలస నుండి బూర్జ వరకు, బూర్జ నుండి పట్టక దవడ వరకు, అలాగే మజ్జివలస నుండి అడవి తల్లి బాట కొండయ్యపాడు వరకు కొత్తగా చేపట్టిన రహదారి పనుల వల్ల తీవ్రంగా దెబ్బతింది. ఈ పనుల కోసం భారీ వాహనాలు, యంత్రాలు తిరగడంతో కోట్లు ఖర్చు చేసిన రోడ్డు పూర్తిగా కోతకు గురై కంకర రాళ్లు తేలడమే కాకుండా మోకాల్లోతు గుంతలు పడ్డాయి. అనంతగిరి మండల పరిధిలోని ఐదు పంచాయతీల గిరిజన ప్రజలు జిల్లా కేంద్రమైన పాడేరు చేరుకోవడానికి ఇది అత్యంత సమీప మార్గం కావడంతో నిత్యం అనేకమంది ఇబ్బందులు పడుతూనే రాకపోకలు సాగిస్తున్నారు. విద్యా, వైద్య, వ్యాపార అవసరాల కోసం మైదాన ప్రాంతాలైన శృంగవరపుకోట, విజయనగరం వెళ్లేందుకు గిరిజనులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఈ మార్గం ఇరుకుగా ఉండటమే కాకుండా మలుపుల వద్ద కనీసం సూచిక బోర్డులు కూడా లేకపోవడంతో ఇప్పటికే ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పాలకులు, జిల్లా అధికారులు పలుమార్లు ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నప్పటికీ, రోడ్డు విస్తరణ కోసం లేదా కనీసం మరమ్మతుల కోసం స్పందించకపోవడంపై స్థానిక గిరిజనుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికార యంత్రాంగం, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించి ఈ శాశ్వత రోడ్డు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ బస్సు సౌకర్యం కల్పిస్తే పాడేరు జిల్లా కేంద్రం నుండి ఎస్.కోట, విజయనగరం మైదాన ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణం సాగుతుందని, తద్వారా ఈ మారుమూల గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గిరిజనులు, ఆదివాసీ మేధావులు, విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.
అల్లూరి జిల్లా అనంతగిరి, డుంబ్రిగూడ, హుక్కుంపేట మండలాలను విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు కలిపే నిమ్మలపాడు - వేంగడ 10 కిలోమీటర్ల ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు వాహనంపై కొద్దిగా అదుపు తప్పినా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు. ఇరుకైన ఈ రోడ్డులో ప్రయాణించేటప్పుడు వాహనదారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 2016లో కోట్ల రూపాయల పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన ఈ రోడ్డు, ఇటీవల కాలంలో జుంబువలస
నుండి బూర్జ వరకు, బూర్జ నుండి పట్టక దవడ వరకు, అలాగే మజ్జివలస నుండి అడవి తల్లి బాట కొండయ్యపాడు వరకు కొత్తగా చేపట్టిన రహదారి పనుల వల్ల తీవ్రంగా దెబ్బతింది. ఈ పనుల కోసం భారీ వాహనాలు, యంత్రాలు తిరగడంతో కోట్లు ఖర్చు చేసిన రోడ్డు పూర్తిగా కోతకు గురై కంకర రాళ్లు తేలడమే కాకుండా మోకాల్లోతు గుంతలు పడ్డాయి. అనంతగిరి మండల పరిధిలోని ఐదు పంచాయతీల గిరిజన ప్రజలు జిల్లా కేంద్రమైన పాడేరు చేరుకోవడానికి ఇది
అత్యంత సమీప మార్గం కావడంతో నిత్యం అనేకమంది ఇబ్బందులు పడుతూనే రాకపోకలు సాగిస్తున్నారు. విద్యా, వైద్య, వ్యాపార అవసరాల కోసం మైదాన ప్రాంతాలైన శృంగవరపుకోట, విజయనగరం వెళ్లేందుకు గిరిజనులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఈ మార్గం ఇరుకుగా ఉండటమే కాకుండా మలుపుల వద్ద కనీసం సూచిక బోర్డులు కూడా లేకపోవడంతో ఇప్పటికే ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పాలకులు, జిల్లా అధికారులు పలుమార్లు ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నప్పటికీ, రోడ్డు విస్తరణ కోసం లేదా కనీసం మరమ్మతుల కోసం
స్పందించకపోవడంపై స్థానిక గిరిజనుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికార యంత్రాంగం, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించి ఈ శాశ్వత రోడ్డు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ బస్సు సౌకర్యం కల్పిస్తే పాడేరు జిల్లా కేంద్రం నుండి ఎస్.కోట, విజయనగరం మైదాన ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణం సాగుతుందని, తద్వారా ఈ మారుమూల గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గిరిజనులు, ఆదివాసీ మేధావులు, విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.
- అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని గంగవరం గ్రామంలో ఒక బావిలో చిక్కుకున్న భారీ రాజనాగును (కింగ్ కోబ్రా) అటవీ శాఖకు చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ (RRR) బృందం విజయవంతంగా రక్షించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ను వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపట్టిన "హనుమాన్" (HANUMAN) కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. గంగవరం గ్రామానికి చెందిన గ్రామస్తుడు శ్రీ రమేష్ తమ ఊరి బావిలో పెద్ద పాము పడి ఉండటాన్ని గమనించి వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించడంతో ఈ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే జీనబాడు రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్, RRR బృంద నాయకుడు శ్రీ ఆర్. రాజబాబు ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ పి. శివకుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ పి. సాయి ప్రణీత్, ప్రొటెక్షన్ వాచర్లు సత్యనారాయణ, అచ్చిబాబు పాల్గొన్నారు. అటవీ శాఖతో పాటు శ్రీ మూర్తి కంటిమహంతి నేతృత్వంలోని ఈజీడబ్ల్యూఎస్ (EGWS) స్వచ్ఛంద సంస్థ సభ్యులు కృష్ణ, ప్రసాద్ సాంకేతిక సహకారం అందించారు. మొదట పొడవైన వెదురు కర్రకు హుక్ కట్టి పామును రంధ్రం నుండి బయటకు లాగి, ఆపై హ్యాండ్ హెల్డ్ హుక్, పొడవైన సరుగుడు కర్ర సహాయంతో బావి నుండి సురక్షితంగా పైకి తీశారు. ఎలాంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తగా పామును పైప్-బ్యాగ్లోకి ప్రవేశపెట్టి భద్రపరిచారు. అనంతరం ఈ రాజనాగును జీనాబాడు బీట్ పరిధిలోని సంకరం రిజర్వ్ ఫారెస్ట్ (RL) లో అడవిలోకి వదిలిపెట్టారు. ఈ విజయవంతమైన ఆపరేషన్పై రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ ఆర్. రాజబాబు మాట్లాడుతూ, హనుమాన్ కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల రక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామస్తుడు శ్రీ రమేష్ చూపిన అప్రమత్తత, ఆర్ఆర్ఆర్ బృందం నైపుణ్యం, స్వచ్ఛంద సంస్థల సహకారం వల్లే ఈ అరుదైన జీవి ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. ప్రజలు, అటవీ శాఖ, ఎన్జీవోలు కలిసి పనిచేస్తే వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుందని ఈ సంఘటన నిరూపించింది.4
- బాపట్ల జిల్లా చుండూరులో వంగవీటి మోహన రంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. వంగవీటి రంగా కుమార్తె ఆశ కిరణ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా అని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కొనియాడారు. రంగా ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు తదితరులు పాల్గొన్నారు.1
- గుంటూరులో గురువారం జరిగిన సీపీఐ సోషల్ మీడియా వర్క్షాప్లో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగత దూషణలతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికగా ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.1
- నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక చొరవతో ఉచిత క్యాన్సర్ పరీక్షల మెగా వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రముఖ బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రాయలసీమ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో ఒక్కో పరీక్షకు రూ. 15 వేల విలువైన పరీక్షలను ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించారు. నంద్యాల జిల్లా ప్రజలకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు అంగీకరించిన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు నంద్యాల ఎంపీ, లోక్సభ టీడీపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభ సభలో ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, ఇటీవల తాను విజయవాడలో ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసినప్పుడు నంద్యాల జిల్లాలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన బాలకృష్ణ, నంద్యాల ప్రజల కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని, అత్యాధునిక పరీక్షల యంత్రాలను ఏర్పాటు చేశారని వివరించారు. నెహ్రూ నగర్ మాజీ సర్పంచ్, టీడీపి సీనియర్ నాయకుడు, బాలకృష్ణ వీరాభిమాని అయిన కట్టుబడి శ్రీనివాస నాయుడు చొరవతోనే నెహ్రూ నగర్లో ఈ మొదటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు, అలాగే హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రి వైద్య బృందం, స్థానిక వైద్యులు, వాలంటీర్లు, టీడీపి శ్రేణులకు ఎంపీ శబరి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, నందికొట్కూరు బాలకృష్ణ అసోసియేషన్ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, బీఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యుడు కురువ రమేష్, టీడీపీ నాయకులు వెంకటేశ్వరశర్మ, బంగారు వెంకటేశ్వర్లు, గుణశేఖర్ రెడ్డి, రఘురామిరెడ్డి, పారుమంచాల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.3
- చిలుకూరు మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలను నిర్వహించాలని ఆయన కోరారు. ఈ హామీల సాధన కోసం చేపట్టనున్న గాంధీభవన్ ముట్టడి కార్యక్రమానికి అందరూ భారీగా తరలిరావాలని గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు.1
- ఖమ్మం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ)లో భూ పునఃసర్వే పనుల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, సర్వే అధికారులతో కలిసి సరిహద్దులు నిర్ధారించిన గ్రామాల పునఃసర్వే పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ పునఃసర్వే పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.1
- బాపట్ల జిల్లా రేపల్లెలోని జగనన్న కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రేపల్లె డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సోదా చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 బైకులు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు డిఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ తనిఖీల్లో పట్టణ సిఐ అశోక్, రూరల్ సిఐ సురేష్, సబ్ డివిజన్లోని పోలీసు సిబ్బందితో పాటు ఈగల్ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు.3
- హైదరాబాద్లో కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత బైఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడాన్ని డ్యాన్సర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఎన్నికలకు ఫెడరేషన్ అనుమతి లేదని ఆరోపిస్తూ 10 మంది డ్యాన్సర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. డ్యాన్స్ అసోసియేషన్లో తలెత్తిన ఈ వివాదానికి ఎన్నికలు, సభ్యత్వాల అంశాలే ప్రధాన కారణమైనట్లు తెలుస్తోంది.1