బీసీ రాజ్యాధికారమే లక్ష్యం – మల్లన్న పాదయాత్రకు జనగామ జిల్లా సంఘీభావం* *బీసీ రాజ్యాధికారమే లక్ష్యం – మల్లన్న పాదయాత్రకు జనగామ జిల్లా సంఘీభావం* తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు *సెప్టెంబర్ 17న* చేపట్టనున్న బీసీ రాజ్యాధికార *పాదయాత్రను* విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే డిమాండ్తో తీన్మార్ మల్లన్న గారు చేపడుతున్న పాదయాత్రకు సంఘీభావంగా జనగామ జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, బహుజనుల రాజకీయ భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. “మన రాజ్యం – మన అధికారం” అనే నినాదంతో ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని, సెప్టెంబర్ 17న జరిగే బీసీ రాజ్యాధికార పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్, నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మౌనిక యాదవ్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పిట్టల సురేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గడ్డం కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇల్లందుల రవి ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లందుల సమ్మయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు దండురాని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వెంబటి అజయ్ జిల్లా యూత్ ఉపాధ్యక్షులు గంగరాజు జిల్లా కార్యదర్శి మంద దిలీప్, పట్టణ యూత్ అధ్యక్షులు పానుగంటి కృష్ణ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీసీ రాజ్యాధికారమే లక్ష్యం – మల్లన్న పాదయాత్రకు జనగామ జిల్లా సంఘీభావం* *బీసీ రాజ్యాధికారమే లక్ష్యం – మల్లన్న పాదయాత్రకు జనగామ జిల్లా సంఘీభావం* తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు *సెప్టెంబర్ 17న* చేపట్టనున్న బీసీ రాజ్యాధికార *పాదయాత్రను* విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే డిమాండ్తో తీన్మార్ మల్లన్న గారు చేపడుతున్న పాదయాత్రకు సంఘీభావంగా జనగామ జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, బహుజనుల రాజకీయ భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. “మన రాజ్యం – మన అధికారం” అనే నినాదంతో ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని, సెప్టెంబర్ 17న జరిగే బీసీ రాజ్యాధికార పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్, నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మౌనిక యాదవ్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పిట్టల సురేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గడ్డం కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇల్లందుల రవి ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లందుల సమ్మయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు దండురాని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వెంబటి అజయ్ జిల్లా యూత్ ఉపాధ్యక్షులు గంగరాజు జిల్లా కార్యదర్శి మంద దిలీప్, పట్టణ యూత్ అధ్యక్షులు పానుగంటి కృష్ణ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?2
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గిన నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.80,100, VIP దర్శనాలతో రూ.1,12,350, కార్ పార్కింగ్ రూ.1,75,000, ప్రసాద విక్రయాలతో రూ.4,21,770, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- సువర్ణ శివలింగ దర్శనంతో రమణేశ్వరంలో భక్తిశోభ రమణేశ్వరం సువర్ణ శివలింగం వద్ద పెరిగిన భక్తుల రద్దీ1
- వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.1
- బీఆర్ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర...ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచి పెడతాం-కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని కరీంనగర్ లో ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని ప్రస్తావించి ఆ పార్టీతో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోందని, బీఆర్ఎస్ కు సంబంధించి 8గురు ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టిందని మరి 90 మంది ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని ప్రశ్నించారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని గజం జాగా కూడా లేదు...కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూములను దోచుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో బీఆర్ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తా అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా..? సీఎంకు బీఆర్ఎస్ నేతలతో డీల్ కుదరలేదా? అని ప్రశ్నించారు. ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి డీల్ కోసం బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.1
- మడికొండలో కొండచిలువ కలకలం.. అధికారుల స్పందన కోరుతున్న ప్రజలు హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం మడికొండ హైవేపై డీసీసీ బ్యాంక్ పక్కన వేకువజామున భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. రద్దీ ప్రాంతంలో పాము రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యార. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించి కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించాలని, అలాగే ఇలాంటి ఘటనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.1
- తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్1