యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యేకు డీవైఎఫ్ఐ వినతి నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాస్ పథకం అమలుకు డిమాండ్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో యువజన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని డీవైఎఫ్ఐ నాయకులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించడంతో పాటు నిరుద్యోగ భృతి అమలు, రాజీవ్ యువ వికాస్ పథకం అమలు చేయాలని కోరారు. జిల్లాలో కోచింగ్ సెంటర్లు పునరుద్ధరణ, ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఏర్పాటు, జాబ్ క్యాలెండర్ విడుదల, ప్రతి మండలంలో క్రీడా మైదానాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, గ్రామాల వారీగా లైబ్రరీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వినతిపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పందిస్తూ జిల్లాలో యువత, క్రీడాకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టీకానంద్, కార్యదర్శి గొడిసెల కార్తీక్, మున్సిపల్ కౌన్సిలర్ చిలువేరు వెంకన్న పాల్గొన్నారు.
యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యేకు డీవైఎఫ్ఐ వినతి నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాస్ పథకం అమలుకు డిమాండ్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో యువజన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని డీవైఎఫ్ఐ నాయకులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించడంతో పాటు నిరుద్యోగ భృతి అమలు, రాజీవ్ యువ వికాస్ పథకం అమలు చేయాలని కోరారు. జిల్లాలో కోచింగ్ సెంటర్లు పునరుద్ధరణ, ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఏర్పాటు, జాబ్ క్యాలెండర్ విడుదల, ప్రతి మండలంలో క్రీడా మైదానాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, గ్రామాల వారీగా లైబ్రరీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వినతిపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పందిస్తూ జిల్లాలో యువత, క్రీడాకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టీకానంద్, కార్యదర్శి గొడిసెల కార్తీక్, మున్సిపల్ కౌన్సిలర్ చిలువేరు వెంకన్న పాల్గొన్నారు.
- విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని నియోజకవర్గ సాధన కమిటీ కన్వీనర్ చుంచు రాజ్ కిరణ్ అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఇంటర్ పరీక్షలో టాపర్గా నిలిచిన అక్కల సాయి త్రినితను ఆయన కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కానగంటి మధు, మాజీ ఎంపీటీసీ తోట మోహన్, వల్లంబట్ల శ్రీనివాస్ బిళ్ళకూరి రమేష్ చుంచు గిరిధర్, గొల్ల రాయమల్లు, అంకతి గంగాధర్, చెలిగంటి మల్లేష్, గూడెం, గ్రామస్తులు పాల్గొన్నారు..1
- Post by Rajitha Antharpula9
- सरकार अब जो प्रस्ताव ला रही है, उसका महिला आरक्षण से कोई संबंध नहीं है। वो सिर्फ़ delimitation और gerrymandering के जरिए सत्ता हथियाने का प्रयास है। जाति जनगणना के आंकड़ों को दरकिनार कर OBC, दलित और आदिवासी समुदायों से किसी हालत में “हिस्सा चोरी” बर्दाश्त नहीं की जाएगी। हम दक्षिण, उत्तर-पूर्व, उत्तर-पश्चिम और छोटे राज्यों के साथ भी किसी कीमत पर अन्याय नहीं होने देंगे।1
- తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన అజీస్ పటేల్ జొన్న పంట కాలిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం పంట పొలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... దేవపూర్ గ్రామానికి చెందిన అజీస్ పటేల్ కు సంబంధించిన 6 ఎకరాల జొన్న పంట పూర్తిగా కాలిపోవడం బాధాకరమని అన్నారు. అధైర్యపడొద్దని ప్రభుత్వం తరపున అండగా ఉంటామని రైతు అజీస్ పటేల్ కు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ప్రభుత్వం కచ్చితంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేవలం వరి పంటలకే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో పండించే అన్ని పంటలకు రూ.500 బోనస్ అందిస్తే రైతులకు ఊరట కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ భీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- అగ్నిమాపక వారోత్సవాల్లో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాన్స్టెస్టసన్ కార్యక్రమాన్ని నిర్వహించగా నీటితో పాలు రకాల విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అలాగే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.3
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం, మండలాల్లో పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదవుతోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకే 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో కార్యాలయాలకు, దుకాణాలకు, పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు వెళ్ళకుంటే మంచిదని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లను వెంట ఉంచుకోవాలని ప్రభుత్వ వైద్యులు కోరారు.1