గంధసిరి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా అల్పాహార పథకం ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న అల్పాహార పథకం కింద ముదిగొండ మండలం గంధసిరి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గంధసిరి గ్రామ సర్పంచ్ మల్లెల రామారావు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు అల్పాహారం వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో కలిసి మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ చేపట్టిన అల్పాహార పథకం ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ఉదయంపూట పోషకాహారం అందించడంవల్ల విద్యార్థులు ఉత్సాహంగా తరగతులకు హాజరై ఏకాగ్రతతో చదువుకుని మెరుగైనఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి సంక్షేమకార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎస్ కే రఫీ నాయకులు డి రాఘవరెడ్డి కె సోమయ్యగౌడ్ వి రవీందర్ రెడ్డి ఎమ్ వెంకట్రావు గోవిందారావు దామోదర్ రెడ్డి సాంబశివ పాల్గొన్నారు.
గంధసిరి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా అల్పాహార పథకం ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న అల్పాహార పథకం కింద ముదిగొండ మండలం గంధసిరి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గంధసిరి గ్రామ సర్పంచ్ మల్లెల రామారావు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు అల్పాహారం వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో కలిసి మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ చేపట్టిన అల్పాహార పథకం ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ఉదయంపూట పోషకాహారం అందించడంవల్ల విద్యార్థులు ఉత్సాహంగా తరగతులకు హాజరై ఏకాగ్రతతో చదువుకుని మెరుగైనఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి సంక్షేమకార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎస్ కే రఫీ నాయకులు డి రాఘవరెడ్డి కె సోమయ్యగౌడ్ వి రవీందర్ రెడ్డి ఎమ్ వెంకట్రావు గోవిందారావు దామోదర్ రెడ్డి సాంబశివ పాల్గొన్నారు.
- ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.1
- బస్సు సౌకర్యం కల్పించడంతో ఎమ్మెల్యేకు పాలాభిషేకం,....... నడిగూడెం: కోదాడ నుంచి నడిగూడెం మీదుగా మోతే వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, నడిగూడెం సర్పంచ్ దున్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.1
- *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 మూడు ప్రధాన పార్టీలకు మూడు షేర్ల నీళ్ళు తాగించింది అప్పుడే మర్చిపోయారా..??? ఒకవేళ మర్చిపోయి ఉంటే...ఈ సారి మూడు చెరువుల నీళ్ళు తాగడానికి సిద్ధంగా ఉండండి🌊🌊🌊 WGL- NLG-KMM గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వార్ వన్ సైడ్...అది తీన్మార్ మల్లన్న సైడ్🔥1
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- నేలకొండపల్లి మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల (BC) బాలికల వసతి గృహాన్ని తహసీల్దార్ రాంప్రసాద్ సందర్శించారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల (BC) బాలికల వసతి గృహాన్ని తహసీల్దార్ రాంప్రసాద్ సందర్శించారు. విద్యార్థినుల మధ్య కూర్చొని భోజనం చేస్తూ,వారికి అందుతున్న విద్యా, వసతి వివరాలను ఆరా తీశారు. మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సౌజన్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు1
- భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 44 అడుగులకు చేరిన గోదావరి వరద భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు. భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.2