సైబర్ నేరాల నియంత్రణపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి విజయనగరం ట్రాఫిక్ సీఐ ఎస్.రాము విజయనగరం: జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలోని ఎ.ఐ.ఎ.టి. కళాశాల విద్యార్థులకు రహదారి భద్రత, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ఎస్. రాము ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ ఎస్. రాము మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నేరాల తీరు మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నేరాలపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ప్రజలను ప్రలోభపెట్టి, బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల మాటలకు, బెదిరింపులకు లొంగవద్దని, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, బాలలను గౌరవించడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని అన్నారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో యాప్లోని SOS బటన్ నొక్కి పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు. యువత రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, వాహనాలకు సంబంధించిన రికార్డులు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. యువత జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్, జూదానికి సంబంధించిన యాప్లకు ఆకర్షితులు కావద్దని హెచ్చరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ లక్ష్య సాధన కోసం కష్టపడి పనిచేసి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సీఐ ఎస్. రాము పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఏఎస్ఐ నాగాదిత్య, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ నేరాల నియంత్రణపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి విజయనగరం ట్రాఫిక్ సీఐ ఎస్.రాము విజయనగరం: జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలోని ఎ.ఐ.ఎ.టి. కళాశాల విద్యార్థులకు రహదారి భద్రత, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ఎస్. రాము ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ ఎస్.
రాము మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నేరాల తీరు మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నేరాలపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ప్రజలను ప్రలోభపెట్టి, బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల మాటలకు, బెదిరింపులకు లొంగవద్దని, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, బాలలను గౌరవించడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని
అన్నారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో యాప్లోని SOS బటన్ నొక్కి పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు. యువత రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, వాహనాలకు సంబంధించిన రికార్డులు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. యువత
జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్, జూదానికి సంబంధించిన యాప్లకు ఆకర్షితులు కావద్దని హెచ్చరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ లక్ష్య సాధన కోసం కష్టపడి పనిచేసి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సీఐ ఎస్. రాము పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఏఎస్ఐ నాగాదిత్య, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.1
- శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో ప్రధాన రహదారి, సెగిడివీధీలో లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.1
- రాజాం :శ్రీ వెంకటశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జి ప్రక్కన సోలార్ హెచ్చరిక లైట్లు ఏర్పాటు రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జ్ పక్కన హాంజరాంపేటకు చెందిన కొల్లి రాముఅనే యువకుడు తన సొంత డబ్బులతో సోలార్ హెచ్చరిక లైట్లును అమర్చారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ఎక్కువగా యువత మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లైట్ల వల్లనైనా ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్న రాము చేసిన ఈ పనిని వాహనదారులు గ్రామస్తులు అభినందించారు.1
- వీధి పశువుల నియంత్రణకు కార్పొరేషన్ కమిషనర్ శ్రావణకుమార్ కఠిన చర్యలు శ్రీకాకుళం : రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం వెల్లడించారు. వీధి పశువుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా బాధ్యత లేకుండా పశువులను రోడ్లపై వదిలే పశువుల యజమానులతో ఇటీవల సమావేశం నిర్వహించామని, అయినా వారిధోరణిలో మార్పు లేదని, పశువులు రోడ్లపై కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపై కనిపించే పశువులను పట్టుకొని నగరంలోని కాజీపేట ఏరియాకు కాకుండా నేరుగా సింహాచలం గోశాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.1
- బొబ్బిలి పట్టణంలోని మేదరబంద కాలువ కంపు కొడుతుంది. బజారు, చిన బజారు, యాతవీధి, రావువారివీధి, గౌడవీధి వీధుల మురుగునీరు ఇక్కడ కలిసి చెరువుకు వెళ్తుంది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు. మేదరబంద కాలువ దుర్వాసన1
- *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II1
- *మారికవలస గురుకులాన్ని తీసేయమని సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గారే ఆదేశించారంట??* *పాడేరు ఐటిడిఏ ఆదిత్య శర్మ గారు అమలు చేశారట...!* ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా..? ⁉️ *సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే....గిరిజన పిల్లలు చదువుకుంటున్న స్కూల్ ని తీసేయండి" అని చెబితే,ఇక ఈ కూటమి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది..?*🤦🏻♂️ *యోగా గిన్నిస్ రికార్డులకు గిరిజన బిడ్డలు కావాలి..!* *భోగాపురం ఎయిర్పోర్ట్ రెడ్ కార్పెట్ కోసం గిరిజన బిడ్డలు కావాలి..!* *కానీ అదే గిరిజన బిడ్డలు చదువుకునే స్కూల్ ని మాత్రం తీసేయమని గిరిజన మంత్రే చెబుతారా...?* *ఇది #గిరిజనశాఖ కాదు.. #గిరిజనవంచన శాఖ..!* *480 మంది పేద గిరిజన బిడ్డలను అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ మంత్రి గారిదేనా...?* గిరిజన బిడ్డల కన్నీళ్లకు కారణమైన మంత్రి వెంటనే సమాధానం చెప్పాలి..! #ITDA_Paderu #Araku #Marikavalasa1
- కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలసి కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నుండి నేరుగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి కి అందించే పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయం లోకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. పవిత్రమైన శ్రావణమాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు.1