రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ సతీమణి వేగుళ్ళ అనితమ్మ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం కోనసీమ జిల్లా మండపేటలోని అందుల పాఠశాలలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండపేట కృష్ణ మహల్ పక్క వీధిలో ఉన్న ఈ పాఠశాలలో జరిగిన వేడుకలను ఏడిద గ్రామ జనసేన పార్టీ నాయకులు రామిశెట్టి రాజా, వాసంశెట్టి వెంకట రమణ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా పాఠశాలలోని విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి 25 కేజీల బియ్యం మరియు టిఫిన్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సరాకుల అబ్బులు, మండపేట టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు నామాల చంద్రరావు, ఏడిద గ్రామ సోసైటి చైర్మన్ గొడవర్తి సత్యనారాయణ (ఎర్రబ్బు) హాజరయ్యారు. అనితమ్మ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ద్వారపూడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు చింతా దొరబాబు, వల్లురూ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కోట పుల్లాజి, ఏడిద గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు మేకా జేజిబాబుతో పాటు జనసేన పార్టీ నాయకులు చల్ల మణికంఠ, కొప్పిరెడ్డి శ్రీనివాసరావు, పలివెల వీర్రాజు, దూబ శ్రీనివాస్, కర్రి సతీష్, చింతాకుల దుర్గా ప్రసాద్, సుధీర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ సతీమణి వేగుళ్ళ అనితమ్మ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం కోనసీమ జిల్లా మండపేటలోని అందుల పాఠశాలలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండపేట కృష్ణ మహల్ పక్క వీధిలో ఉన్న ఈ పాఠశాలలో జరిగిన వేడుకలను ఏడిద గ్రామ జనసేన పార్టీ నాయకులు రామిశెట్టి రాజా, వాసంశెట్టి వెంకట రమణ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా పాఠశాలలోని విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి 25 కేజీల బియ్యం మరియు టిఫిన్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సరాకుల అబ్బులు, మండపేట టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు నామాల చంద్రరావు, ఏడిద గ్రామ సోసైటి చైర్మన్ గొడవర్తి సత్యనారాయణ (ఎర్రబ్బు) హాజరయ్యారు. అనితమ్మ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ద్వారపూడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు చింతా దొరబాబు, వల్లురూ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కోట పుల్లాజి, ఏడిద గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు మేకా జేజిబాబుతో పాటు జనసేన పార్టీ నాయకులు చల్ల మణికంఠ, కొప్పిరెడ్డి శ్రీనివాసరావు, పలివెల వీర్రాజు, దూబ శ్రీనివాస్, కర్రి సతీష్, చింతాకుల దుర్గా ప్రసాద్, సుధీర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
- 🙏🙏1
- 🙏🙏1
- 😭🙏1
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల అభివృద్ధి పేరుతో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, పరిశ్రమల స్థాపన నెపంతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు స్పష్టంగా గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ, స్థానిక యువతకు ఉద్యోగాలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడం, ఉపాధి సృష్టించడం మరియు ప్రాంతీయ సమతుల్యతను కాపాడటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.1
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలో గల లంక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. నియోజకవర్గంలోనే అత్యంత పెద్దదైన ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గోదావరి నీళ్లు రావడంతో ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వానలు పడకపోవడంతో ఖరీఫ్ సీజన్పై ఆందోళన చెందుతున్న రైతులకు ఈ గోదావరి జలాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంతవరకు వరి నాట్లు వేయలేకపోయిన ఈ ప్రాంత రైతులు, ఇప్పుడు లంక సాగర్ ప్రాజెక్టుకు నీరు చేరడంతో నాట్ల పనుల్లో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే వైరా ప్రాజెక్టు పరిధిలోని రైతులు వరి నాట్లు ప్రారంభించగా, ఇప్పుడు ఇక్కడి రైతులు కూడా పనులకు సిద్ధమవుతున్నారు. ఈ గోదావరి జలాలు తమ జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని రైతులు భావిస్తున్నారు. తమ పంట పొలాలను కాపాడుతున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ ప్రాంత రైతులు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.1
- 🙏🙏1
- ఓటర్లకు అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ అయింది. మీ ఓటు భద్రంగా ఉండాలంటే ఎన్యూమరేషన్ ఫారమ్ (EF) ను జూలై 14వ తేదీలోపు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన ఫారమ్ను మీ ప్రాంత బీఎల్ఓ (BLO) కు అందజేయాలి. ఒకవేళ నిర్ణీత గడువులోగా దీనిని సమర్పించకపోతే, జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఇంకా ఈ ఫారమ్ అందనట్లయితే, ఈసీఐ (ECI) ఓటర్ పోర్టల్ లేదా ఈసీఐ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో సమర్పించవచ్చు. లేదా మీ పరిధిలోని బీఎల్ఓను సంప్రదించి కూడా ఫారమ్ పొందవచ్చు. మీ ఓటు భద్రంగా ఉండాలంటే జూలై 14 లోపు ఈ ఎన్యూమరేషన్ ఫారమ్ను సమర్పించడం తప్పనిసరి.1