మహిళా సాధికారతకు జగనన్నే బ్రాండ్ అంబాసిడర్ - వర్దినిడి సుజాత పిఠాపురం: రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ, వారిని సాధికారత దిశగా నడిపించడంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్దినిడి సుజాత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న వివిధ సంస్కరణలను కొనియాడారు. 50 శాతం రిజర్వేషన్లతో నూతన శకం స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, ఆచరణలో మహిళా సాధికారతను నిరూపించిన ఘనత జగనన్నదేనని ఆమె అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడాన్ని ఆమె స్వాగతించారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్సీపీ మొదటి నుంచీ పూర్తి మద్దతు తెలుపుతోందని గుర్తుచేశారు. పదవుల్లో సింహభాగం మహిళలకే "నేనున్నానంటూ" మహిళా లోకానికి అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,క్యాబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని సుజాత వివరించారు. మంత్రివర్గంలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవితో పాటు,పలువురు మహిళలకు మంత్రి పదవులు కల్పించారు. హోం మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం కల్పించడం, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా ముస్లిం మహిళను నియమించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. తానేటి వనిత,విడదల రజిని, ఆర్కే రోజా వంటి వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడమే కాకుండా రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మహిళలను నియమించి వారి పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆచరణలో మహిళా పక్షపాతి కందుకూరి,గురజాడ వంటి మహనీయుల బాటలో నడుస్తూ,మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో మహిళా పక్షపాతిగా జగన్ నిలిచారని ఆమె కొనియాడారు. స్థానిక సంస్థల ద్వారా సామాన్య మహిళలకు కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పించిన జగనన్నకు మహిళా లోకం రుణపడి ఉంటుందని వర్దినిడి సుజాత అన్నారు.
మహిళా సాధికారతకు జగనన్నే బ్రాండ్ అంబాసిడర్ - వర్దినిడి సుజాత పిఠాపురం: రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ, వారిని సాధికారత దిశగా నడిపించడంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్దినిడి సుజాత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న వివిధ సంస్కరణలను కొనియాడారు. 50 శాతం రిజర్వేషన్లతో నూతన శకం స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, ఆచరణలో మహిళా సాధికారతను నిరూపించిన ఘనత జగనన్నదేనని ఆమె అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడాన్ని ఆమె స్వాగతించారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్సీపీ మొదటి నుంచీ పూర్తి మద్దతు తెలుపుతోందని గుర్తుచేశారు. పదవుల్లో సింహభాగం మహిళలకే "నేనున్నానంటూ" మహిళా లోకానికి అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,క్యాబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని సుజాత వివరించారు. మంత్రివర్గంలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవితో పాటు,పలువురు మహిళలకు మంత్రి పదవులు కల్పించారు. హోం మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం కల్పించడం, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా ముస్లిం మహిళను నియమించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. తానేటి వనిత,విడదల రజిని, ఆర్కే రోజా వంటి వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడమే కాకుండా రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మహిళలను నియమించి వారి పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆచరణలో మహిళా పక్షపాతి కందుకూరి,గురజాడ వంటి మహనీయుల బాటలో నడుస్తూ,మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో మహిళా పక్షపాతిగా జగన్ నిలిచారని ఆమె కొనియాడారు. స్థానిక సంస్థల ద్వారా సామాన్య మహిళలకు కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పించిన జగనన్నకు మహిళా లోకం రుణపడి ఉంటుందని వర్దినిడి సుజాత అన్నారు.
- 🙏😭1
- రంపచోడవరం ఐటిడిఎలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 155 అర్జీలను స్వీకరించారు. గిరిజన ప్రాంత సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగిలో బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, పెండింగ్ అర్జీలపై అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.1
- డుంబ్రిగూడ, ఏప్రిల్ 21: మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలకు వెళ్లే రహదారిలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ మార్గంలో విద్యార్థులు, స్థానికులు నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చేతికందే స్థాయిలో తీగలు ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.1
- Post by V Ramarao1
- **“Wish you a blessed Akshaya Tritiya ✨ May prosperity and positivity fill your life. Choose comfort that stays with you every day. MGM Vests – Wear Prosperity.”**1
- *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు1
- పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని, మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.1
- 🙏😭1
- Post by V Ramarao1