జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 2,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగును లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా శేక్ శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద ఉన్న తెలంగాణ రాష్ట్ర నూనె ఉత్పత్తి సహకార సంఘం ద్వారా రైతులకు అవసరమైన మొక్కలను సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు. ఆయిల్ పామ్ సాగు కోసం ఎకరాకు 57 మొక్కల చొప్పున నాటుకోవచ్చని, ఒక్కో మొక్క అసలు ధర రూ. 193 కాగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు కేవలం రూ. 20 చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. తోటల్లో ఐదు హెక్టార్ల వరకు బిందు సేద్య పరికరాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం సబ్సిడీ అందజేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన 1,777 మంది రైతులు ఇప్పటివరకు 7,164.72 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను సాగు చేశారని వెల్లడించారు. ఇందులో 2,014.53 ఎకరాల్లో 349 మంది రైతులకు 4,619.64 టన్నుల దిగుబడి రాగా, రూ. 10,02,67,169 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఈ తోటల సాగుకు దరఖాస్తు చేసుకునే రైతుల భూమి, విద్యుత్, నీటి లభ్యతను క్షేత్రస్థాయిలో ఉద్యానవన శాఖ అధికారులు ముందుగా పరిశీలిస్తారని తెలిపారు. పరిశీలన పూర్తయిన తర్వాత ప్రాధాన్య క్రమంలో మొక్కలను అందజేస్తారని, ఆసక్తి గల రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద దరఖాస్తు చేసుకుని అవసరమైన పత్రాలను జత చేయాలని సూచించారు. మొక్కల ఖరీదుకు సంబంధించి రైతుల వాటా సొమ్మును 'డిహెచ్ఎస్ఓ గద్వాల' పేరిట మాత్రమే డిడి తీసి ఇవ్వాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి రాజ్ కుమార్ (8977714301), గద్వాల, ధరూర్, మల్దకల్ మండలాల రైతులు రాజశేఖర్ (8977714295), అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి, వడ్డేపల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి రైతులు ఇమ్రాన్ (8977714296), ఐజా, గట్టు, కేటీ దొడ్డి, రాజోలి మండలాల రైతులు మహేష్ (8977714297) ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని కలెక్టర్ వివరించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 2,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగును లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా శేక్ శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద ఉన్న తెలంగాణ రాష్ట్ర నూనె ఉత్పత్తి సహకార సంఘం ద్వారా రైతులకు అవసరమైన మొక్కలను సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు. ఆయిల్ పామ్ సాగు కోసం ఎకరాకు 57 మొక్కల చొప్పున నాటుకోవచ్చని,
ఒక్కో మొక్క అసలు ధర రూ. 193 కాగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు కేవలం రూ. 20 చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. తోటల్లో ఐదు హెక్టార్ల వరకు బిందు సేద్య పరికరాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం సబ్సిడీ అందజేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన 1,777 మంది రైతులు ఇప్పటివరకు 7,164.72 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను సాగు చేశారని
వెల్లడించారు. ఇందులో 2,014.53 ఎకరాల్లో 349 మంది రైతులకు 4,619.64 టన్నుల దిగుబడి రాగా, రూ. 10,02,67,169 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఈ తోటల సాగుకు దరఖాస్తు చేసుకునే రైతుల భూమి, విద్యుత్, నీటి లభ్యతను క్షేత్రస్థాయిలో ఉద్యానవన శాఖ అధికారులు ముందుగా పరిశీలిస్తారని తెలిపారు. పరిశీలన పూర్తయిన తర్వాత ప్రాధాన్య క్రమంలో మొక్కలను అందజేస్తారని, ఆసక్తి గల రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద దరఖాస్తు చేసుకుని అవసరమైన పత్రాలను జత చేయాలని సూచించారు. మొక్కల
ఖరీదుకు సంబంధించి రైతుల వాటా సొమ్మును 'డిహెచ్ఎస్ఓ గద్వాల' పేరిట మాత్రమే డిడి తీసి ఇవ్వాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి రాజ్ కుమార్ (8977714301), గద్వాల, ధరూర్, మల్దకల్ మండలాల రైతులు రాజశేఖర్ (8977714295), అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి, వడ్డేపల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి రైతులు ఇమ్రాన్ (8977714296), ఐజా, గట్టు, కేటీ దొడ్డి, రాజోలి మండలాల రైతులు మహేష్ (8977714297) ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని కలెక్టర్ వివరించారు.
- జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఆసుపత్రిలోని 'రేడియాలజీ హబ్'లో ఉదయం నుండి కరెంట్ లేకపోవడంతో ఎక్స్-రే, స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పరీక్షల కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులు గంటల తరబడి వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రిలో జనరేటర్ అందుబాటులో ఉన్నప్పటికీ, అధికారులు మరియు సిబ్బంది దానిని ఆన్ చేసి స్కానింగ్ ప్రక్రియను కొనసాగించడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి విద్యుత్ లేదనే నెపంతో టెక్నిషియన్లు కూడా స్కానింగ్ చేయడానికి నిరాకరిస్తున్నారని, దీనివల్ల దూర ప్రాంతాల నుండి వచ్చిన పేద రోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారులు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు తక్షణమే స్పందించి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రేడియాలజీ సేవలను పునరుద్ధరించాలని, పేద రోగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపల్ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు స్థానిక కమిషనర్ రాజేష్ ఆదేశానుసారం సీనియర్ అసిస్టెంట్లు సుప్రియ, ప్రియాంక ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం వలన భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.1
- తమ ఉనికిని చాటుకోవాల్సిన దుస్థితిలో నాయక్ పోడ్ జాతి ఉందని, వారిపై సమాజం చూపిస్తున్న చిన్నచూపును ఇది స్పష్టం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లో కూడా తమ కులాన్ని చేర్చడం లేదని నాయక్ పోడ్ వర్గీయులు వాపోతున్నారని ఆమె పేర్కొన్నారు. నాయక్ పోడ్ వర్గీయులను కొందరు గొండు అని, మరికొందరు కోయ నాయక్ పోడ్ అని తప్పుగా నమోదు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. ఏ జాతి వారికైనా తమ అస్తిత్వం, గౌరవం ఉంటాయని, ఈ విషయంలో వారిని మనుషులుగా గుర్తించరా? అంటూ ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.1
- నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి పరిధిలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ బాలాజీ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వారం వారం భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాగనూలు గ్రామానికి చెందిన భజన మండలి సభ్యులు భజనలు నిర్వహించారు. వీరికి నిబంధనల ప్రకారం అల్పాహారంతో పాటు ₹2,000 పారితోషికంగా అందజేశారు. ఈ వారం కార్యక్రమానికి స్థానిక శివాలయం పూజారి శ్రీ కె.వి చక్రపాణి దాతగా వ్యవహరించారు. తన తండ్రి కీర్తిశేషులు కె.వి నరసింహారావు స్మారకార్థం ఆయన ఈ విరాళాన్ని సమర్పించారు. భజన కార్యక్రమం నిర్వహించిన నాగనూలు భజన మండలి సభ్యులకు, దాతకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.1
- కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఏబీఎన్ రిపోర్టర్కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల ఘటనపై ఏపీయూడబ్ల్యూజే (APUWJ) ప్రతినిధులు పెద్దకడబూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.1
- కర్నూలు జిల్లాలో యూరియా సరఫరా సజావుగా కొనసాగుతోందని, జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 28,540 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది రైతులకు 17,900 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఎరువుల పంపిణీ ప్రక్రియను చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎరువుల సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 537 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 20 మంది డీలర్ల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ డా. ఏ. సిరి స్పష్టం చేశారు.1
- నంద్యాల కోర్టులో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్లో బాధితులకు అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడు అందరి అభినందనలు అందుకున్నారు. గౌరవ నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు చేతుల మీదుగా బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ, జాతీయ మెగా లోక్ అదాలత్లో ఎన్నడూ లేని విధంగా న్యాయవాదులు కక్షిదారులను సాధ్యమైనంత వరకు రాజీ మార్గంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ అదాలత్లో దాదాపు 125 మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు పరిష్కారమయ్యాయని, అత్యధికంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుండి బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల మేర సెటిల్మెంట్ జరిగిందని వివరించారు. కోర్టు స్థాయిలో మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులతో పాటు సివిల్ కేసులు, బ్యాంకు మేటర్స్, ఇతర లిటికేషన్ కేసులు కలిపి దాదాపు 300 వరకు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వ్యవహారాలపై న్యాయవాది సుబ్బరాయుడు మాట్లాడుతూ, కంపెనీల లీగల్ అడ్వైజర్ విజయ శేఖర్ రెడ్డి సహకారంతో 30 నుంచి 40 కేసులకు సంబంధించి రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులను బాధితులకు అందజేసినట్లు స్పష్టం చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చేకూరిన ఆర్థిక సహాయం ఎంతో అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.2
- తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరియు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించారు. ఈ పర్యటనలో వారు ఆసుపత్రిలోని వివిధ బ్లాక్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. అనంతరం, వారు ఎయిమ్స్లోని ఎమర్జెన్సీ బ్లాక్ను కూడా ప్రత్యేకంగా పరిశీలించారు.1