కన్నీళ్ల సాగరం పుస్తకావిష్కరణ నిర్వాసితులకు కొండంత అండ మల్లన్నసాగర్ ఉద్యమాలను భవిష్యత్ తరాలకు అందించేలా ‘పోరాటాల సాగరం’గా మరో పుస్తకం రావాలి రచయితలకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి విజ్ఞప్తి గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలను, వారి పోరాటాలను అక్షరబద్ధం చేస్తూ ప్రముఖ జర్నలిస్టు సురకంటి రాజేందర్, ఉపాధ్యాయుడు, రైతు బాంధవుడు పులి రాజు ఆధ్వర్యంలో రచించిన ‘కన్నీళ్ల సాగరం’ పుస్తకావిష్కరణ నిర్వాసితులకు కొండంత అండగా నిలిచిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి అన్నారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురైన గ్రామాల ప్రజల్లో అర్హత ఉన్నప్పటికీ ఇప్పటికీ పలువురికి పరిహారం, పునరావాస ప్యాకేజీలు, ఇళ్లు, ఇంటి స్థలాలు అందలేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక అనేక కుటుంబాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తమ సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.ఇలాంటి కుటుంబాల కన్నీటి గాథలను పుస్తక రూపంలో ఆవిష్కరించడం ద్వారా నిర్వాసితుల సమస్యలను మరోసారి అధికారులకు, ప్రజాప్రతినిధులకు గుర్తు చేసినట్లవుతుందని, ఇది చరిత్రలో నిలిచిపోయే మైలురాయిగా మారుతుందని బండ్ల స్వామి అన్నారు. మల్లన్నసాగర్ భూసేకరణ నోటిఫికేషన్ నుంచి ముంపు గ్రామాలను ఖాళీ చేసే వరకు ప్రజలు చేసిన ఉద్యమాలు, ప్రజాప్రతినిధులు–అధికారులతో సాగిన పోరాటాలు, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు, యువత, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఉద్యమాలు, న్యాయపోరాటాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.అందుకోసం ‘కన్నీళ్ల సాగరం’కు కొనసాగింపుగా మల్లన్నసాగర్ ఉద్యమ చరిత్రను ప్రతిబింబించేలా ‘పోరాటాల సాగరం’ పేరుతో మరో పుస్తకాన్ని రచించాలని రచయితలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వేల సంవత్సరాల చరిత్ర, ప్రత్యేక అస్తిత్వం కలిగిన ముంపు గ్రామాల గుర్తింపును కనుమరుగు చేసేందుకు ప్రభుత్వాలు, పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో ముంపు గ్రామాల పేర్లు లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్వాసితులకు అందించే ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో వారి అసలు గ్రామాల పేర్లను నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి హక్కులను సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.‘కన్నీళ్ల సాగరం’ పుస్తకాన్ని రచించిన సురకంటి రాజేందర్, పులి రాజులతో పాటు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులకు ముంపు గ్రామాల ప్రజల తరఫున బండ్ల స్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కన్నీళ్ల సాగరం పుస్తకావిష్కరణ నిర్వాసితులకు కొండంత అండ మల్లన్నసాగర్ ఉద్యమాలను భవిష్యత్ తరాలకు అందించేలా ‘పోరాటాల సాగరం’గా మరో పుస్తకం రావాలి రచయితలకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి విజ్ఞప్తి గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలను, వారి పోరాటాలను అక్షరబద్ధం చేస్తూ ప్రముఖ జర్నలిస్టు సురకంటి రాజేందర్, ఉపాధ్యాయుడు, రైతు బాంధవుడు పులి రాజు ఆధ్వర్యంలో రచించిన ‘కన్నీళ్ల సాగరం’ పుస్తకావిష్కరణ నిర్వాసితులకు కొండంత అండగా నిలిచిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి అన్నారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురైన గ్రామాల ప్రజల్లో అర్హత ఉన్నప్పటికీ ఇప్పటికీ పలువురికి పరిహారం, పునరావాస ప్యాకేజీలు, ఇళ్లు, ఇంటి స్థలాలు అందలేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక అనేక కుటుంబాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తమ సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.ఇలాంటి కుటుంబాల కన్నీటి గాథలను పుస్తక రూపంలో ఆవిష్కరించడం ద్వారా నిర్వాసితుల సమస్యలను మరోసారి అధికారులకు, ప్రజాప్రతినిధులకు గుర్తు చేసినట్లవుతుందని, ఇది చరిత్రలో నిలిచిపోయే మైలురాయిగా మారుతుందని బండ్ల స్వామి అన్నారు. మల్లన్నసాగర్ భూసేకరణ నోటిఫికేషన్ నుంచి ముంపు గ్రామాలను ఖాళీ చేసే వరకు ప్రజలు చేసిన ఉద్యమాలు, ప్రజాప్రతినిధులు–అధికారులతో సాగిన పోరాటాలు, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు, యువత, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఉద్యమాలు, న్యాయపోరాటాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.అందుకోసం ‘కన్నీళ్ల సాగరం’కు కొనసాగింపుగా మల్లన్నసాగర్ ఉద్యమ చరిత్రను ప్రతిబింబించేలా ‘పోరాటాల సాగరం’ పేరుతో మరో పుస్తకాన్ని రచించాలని రచయితలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వేల సంవత్సరాల చరిత్ర, ప్రత్యేక అస్తిత్వం కలిగిన ముంపు గ్రామాల గుర్తింపును కనుమరుగు చేసేందుకు ప్రభుత్వాలు, పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో ముంపు గ్రామాల పేర్లు లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్వాసితులకు అందించే ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో వారి అసలు గ్రామాల పేర్లను నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి హక్కులను సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.‘కన్నీళ్ల సాగరం’ పుస్తకాన్ని రచించిన సురకంటి రాజేందర్, పులి రాజులతో పాటు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులకు ముంపు గ్రామాల ప్రజల తరఫున బండ్ల స్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- మహిళలపై నేను ప్రెస్ మీట్ పెట్టను: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మహిళలపై నేను ప్రెస్ మీట్లు పెట్టను మహిళలను కించపరిచేలా నేను మాట్లాడను ఎవరు తప్పు చేశారు అనేది దేవుడు చూస్తున్నాడు మహిళ కంటనీరు ఒక్క చుక్క నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతాం కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది * జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి1
- Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion1
- పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.1
- మాజీ మంత్రి హరీశ్ పై కోల్కురి కౌంటర్ -22ఏ భూములపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్దాంతంపై క్లారిటీ *మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చేరు కు రేపు వచ్చిన ఎల్లుండి వచ్చిన ఎన్ని బాగోతాలు ఆడినా ఇన్కర్, ఔరా, అరబిందో, తత్వ మిర్చి డెవలపర్స్ భూముల తెరవెనుక బాగోతం మాత్రం అందరికీ తెలుసంటూ సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నర్సింహ రెడ్డి ధ్వజమెత్తారు ప్రజలారా 22 -A కింద నిషేధిత జాబితాల్లో ఉన్న పట్టాభూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తొలగిస్తుందిని స్పష్టం చేశారు.1
- మేడ్చల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్ స్ట్రైక్–59’ మేడ్చల్: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్ స్ట్రైక్–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1500 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యం అని పేర్కొన్నారు 20 30 కామన్వెల్స్ గేమ్స్ కు ఆదిపత్యం ఇవ్వనుంది అలాగే 2036 ఒలంపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.4
- రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. బైట్...రాం చందర్ రావు4