logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొల్చారం వద్ద కారు బోల్తా బీసీవై పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు దుర్మరణం *కొల్చారం వద్ద రోడ్డు ప్రమాదం* *బీసీవై పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మెదక్ పట్టణానికి చెందిన వనపర్తి రోహిత్ గుప్తా మృతి... బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కొల్చారం వద్ద జరిగిన కారు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అశ్రునయనాలలో ఆ భగవంతుని కోరుకుంటూ సద్గతి ప్రాప్తిరస్తు...*

20 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
20 hrs ago

కొల్చారం వద్ద కారు బోల్తా బీసీవై పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు దుర్మరణం *కొల్చారం వద్ద రోడ్డు ప్రమాదం* *బీసీవై పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మెదక్ పట్టణానికి చెందిన వనపర్తి రోహిత్ గుప్తా మృతి... బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కొల్చారం వద్ద జరిగిన కారు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అశ్రునయనాలలో ఆ భగవంతుని కోరుకుంటూ సద్గతి ప్రాప్తిరస్తు...*

More news from తెలంగాణ and nearby areas
  • జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 'బాల్య వివాహము భారత్ 1- 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా బుధవారం జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాహనంలోని మైక్ సదుపాయంతో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బాల్యం ఎంతో విలువైన దశ అని, బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేయడంలో అందరూ బాధ్యత వహించాలని చెప్పారు. జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామసభలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శాఖ అధికారినీ హేమ భార్గవి, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు,జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కోఆర్డినేటర్ సంతోషి, విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు రాజు, శరత్ మరియు సిబ్బంది సంజీవ్, నవనీత పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు
    1
    జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ నగేష్  తెలిపారు.
కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, విజన్ స్వచ్ఛంద సంస్థ   ఆధ్వర్యంలో మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 'బాల్య వివాహము భారత్ 1- 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా బుధవారం  జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాహనంలోని మైక్ సదుపాయంతో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బాల్యం ఎంతో విలువైన దశ అని, బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేయడంలో అందరూ బాధ్యత వహించాలని చెప్పారు.
జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ  100 రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామసభలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శాఖ అధికారినీ హేమ భార్గవి, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు,జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కోఆర్డినేటర్ సంతోషి, విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు రాజు, శరత్ మరియు సిబ్బంది సంజీవ్, నవనీత పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది ఇతర అధికారులు  పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    10 hrs ago
  • కొల్చారం శివారులో హైదరాబాద్ ప్రధాన రహదారి పై అతివేగంగా వస్తున్న కారు చెట్టు ను ఢీ కొట్టడం జరిగింది. ఈ సంఘటన లో మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్స్ యజమాని, బిసి వై పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి రోహిత్ గుప్తా అక్కడిక్కడే మృతి చెందాడు. విజయవాడలో జరిగిన బీసీవై పార్టీ బిసి సింహ గర్జన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తన స్నేహితుడు కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని 108 సహాయంతో మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కొల్చారం శివారులో హైదరాబాద్ ప్రధాన రహదారి పై అతివేగంగా వస్తున్న కారు చెట్టు ను ఢీ కొట్టడం జరిగింది. ఈ సంఘటన లో మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్స్ యజమాని, బిసి వై పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి రోహిత్ గుప్తా అక్కడిక్కడే మృతి చెందాడు. విజయవాడలో జరిగిన బీసీవై పార్టీ బిసి సింహ గర్జన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తన స్నేహితుడు కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని 108 సహాయంతో మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని  కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    19 hrs ago
  • కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని  అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో Bharatiya Janata Party ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ బిఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కడం, పార్టీ లోపలే విభేదాలు రెచ్చగొట్టడం, స్వార్థ ఎజెండాతో వ్యవహరించడం బిఆర్ఎస్ నేతల లక్ష్యమైందని ఆయన ఆరోపించారు. Bharat Rashtra Samithi లో పనిచేస్తూ నియోజకవర్గంలో ఉద్యమకారులకు, నిజమైన కేడర్‌కు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని, తన అనుచరులకు మాత్రమే పదవులు కట్టబెట్టే రాజకీయాలు నడుపుతున్నారని ప్రతాప్ రెడ్డిపై మండిపడ్డారు. “పార్టీ పతనం కోసం లోపలే కుయుక్తులు పన్నేవాడు నాయకుడా?” అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మచ్చలేని నాయకుడు Raghunandan Rao కోటి రూపాయలు తీసుకుని వేరే పార్టీకి మద్దతిచ్చారనే ఆరోపణలు చేసిన వారు గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయం వద్ద వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. “నిజం ఉంటే దేవాలయం వద్ద ప్రమాణం చేయి… లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకో” అని ఘాటుగా హెచ్చరించారు. గతంలో K. Chandrashekar Rao ను ఓడించాలని T. Harish Rao ఫోన్ చేశారని ప్రచారం చేసి, బిఆర్ఎస్ నేతల వద్ద ఎంత డబ్బులు దోచుకున్నావో గజ్వేల్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. “ఇతరులపై ఆరోపణలు చేసి డబ్బులు సంపాదించడం నీ రాజకీయ జీవన విధానమా?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ పంపకాలపై జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో జరిగిన రచ్చను ప్రజలు మర్చిపోలేదన్నారు. “బ్లాక్మెయిల్ రాజకీయాలతో జీవితం గడిపేవాడిని ప్రజలు ఇక నమ్మరు” అని భైరి శంకర్ ముదిరాజ్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయిని సందీప్, ఎల్కంటి సురేష్, టెలికం బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్, నత్తి శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో Bharatiya Janata Party ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ బిఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కడం, పార్టీ లోపలే విభేదాలు రెచ్చగొట్టడం, స్వార్థ ఎజెండాతో వ్యవహరించడం బిఆర్ఎస్ నేతల లక్ష్యమైందని ఆయన ఆరోపించారు.
Bharat Rashtra Samithi లో పనిచేస్తూ నియోజకవర్గంలో ఉద్యమకారులకు, నిజమైన కేడర్‌కు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని, తన అనుచరులకు మాత్రమే పదవులు కట్టబెట్టే రాజకీయాలు నడుపుతున్నారని ప్రతాప్ రెడ్డిపై మండిపడ్డారు. “పార్టీ పతనం కోసం లోపలే కుయుక్తులు పన్నేవాడు నాయకుడా?” అని ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో మచ్చలేని నాయకుడు Raghunandan Rao కోటి రూపాయలు తీసుకుని వేరే పార్టీకి మద్దతిచ్చారనే ఆరోపణలు చేసిన వారు గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయం వద్ద వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. “నిజం ఉంటే దేవాలయం వద్ద ప్రమాణం చేయి… లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకో” అని ఘాటుగా హెచ్చరించారు.
గతంలో K. Chandrashekar Rao ను ఓడించాలని T. Harish Rao ఫోన్ చేశారని ప్రచారం చేసి, బిఆర్ఎస్ నేతల వద్ద ఎంత డబ్బులు దోచుకున్నావో గజ్వేల్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. “ఇతరులపై ఆరోపణలు చేసి డబ్బులు సంపాదించడం నీ రాజకీయ జీవన విధానమా?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ పంపకాలపై జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో జరిగిన రచ్చను ప్రజలు మర్చిపోలేదన్నారు. “బ్లాక్మెయిల్ రాజకీయాలతో జీవితం గడిపేవాడిని ప్రజలు ఇక నమ్మరు” అని భైరి శంకర్ ముదిరాజ్ ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయిని సందీప్, ఎల్కంటి సురేష్, టెలికం బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్, నత్తి శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • బాన్సువాడ లో పట్ట పగలే భారీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎప్పుడూ రద్దీగా ఉండే తాడ్కోల్ ప్రధాన రహదారిపై నిలిపిన కారు నుంచి పట్టపగలే 8 లక్షల రూపాయల నగదుదొంగతనం జరగడం బాన్సువాడ లో కలకలం రేపింది. మొదటినుంచి మన దినపత్రిక బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ వరుస కథనాలు ప్రచరించినప్పటికీ, ఇటు పోలీస్ యంత్రాంగం, అటు వ్యాపారస్తులు స్పందించకపోవడం వల్ల బాన్సువాడ పోలీస్ డివిజన్ పరిధిలో దొంగతనాలు ఈమధ్య విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తాజాగా బాన్స్వాడ పట్టణంలోని తాడ్కోలు చౌరస్తా వద్ద నిలిపిన కారు నుంచి 8 లక్షల రూపాయలు దొంగలు అపహరించుకొని పోవడం బాన్సువాడ పట్టణ ప్రజల్ని భయం గుప్పెట్లోకి పంపించింది. ఇప్పటికే బిచ్కుంద పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో డోంగ్లి మండలం లింబురు గ్రామ శివారులో పొలం వద్ద గుర్తుతెలియని దొంగలు రెండు రోజుల క్రితం మూడు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి విలువైన రాగి తీగలు, నూనె ఎత్తుకొని వెళ్ళిపోయారు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార , పిట్లం మండలంలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి విలువైన రాగి తీగలను దొంగలించుకుని పోతున్నారు జిల్లాలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ల పగలగొట్టి విలువైన వస్తువులను దొంగలించుకుని పారిపోతున్నారు. బాన్స్వాడ పట్టణంలో ఎస్బిఐ బ్యాంక్ నుంచి తన బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వారి అవసరాల కోసం తోటి బంధువు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు మంగళవారం బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయలు డ్రా చేసుకొని, తాడ్ కోల్ చౌరస్తా వద్ద గల రిలయన్స్ సూపర్ మార్కెట్ కు సరుకులు కొనడానికి వెళ్లిన మాధవరావును గుర్తించిన దొంగలు, ఆయన కారులో దాచిన ఎనిమిది లక్షల రూపాయలు కారు అద్దాలు పగలగొట్టి పట్ట పగలే చోటికి పాల్పడ్డారు. ముఖ్యంగా బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడం వల్ల, నేరాలు, ఘోరాలు జరగడానికి కారణం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా ఎస్పీగా వచ్చిన శ్వేత ముఖ్యంగా సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు, వ్యాపారస్తుల కు అవగాహన కల్పించి వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరా ఏర్పాటు, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ శాఖ ద్వారా ముఖ్య కూడలిలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. కానీ వాటిపై పోలీస్ శాఖ నిర్లక్ష్యపు నీడలు అల్ముకోవడంతో, సిసి కెమెరాలు పనిచేయక పోవడంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దొంగతనాలు, హత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాన్సువాడ కల్కి చెరువు వద్ద గుర్తుతెలియని రెండు మహిళా మృతదేహాలు బయట పడ్డప్పటికీ, అవి ఎవరి అన్నది పోలీసులు చేదించలేకపోయారు, నిజం సాగర్ వద్ద 23 ఏళ్ల యువతి మృతదేహం బయటపడి మూడు నెలలు కావస్తున్నా ఆ యువతి ఎవరు అన్నది పోలీసులు చేదించలేకపోయారు. దీనివల్ల బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగతనాలు, ద్విచక్ర వాహనాలు దొంగలించడం, తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు దొంగలు పాల్పడుతున్నారు. కానీ పోలీసులకు చిక్కకుండా దొంగలు పారిపోవడానికి కారణం సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడమే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడుకుల్ చౌరస్తాలో 8 లక్షల నగదును కారులో నుంచి దొంగలించి పోయిన దొంగలు ఎవరు? కారు అద్దాలు పగలకొట్టేవరకు ఎవరు? ఎవరు గమనించలేదా? కారు అద్దం బలమైన ఏదైనా ఆయుధంతో పలగొట్టి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చుట్టుపక్కల గల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు, కొన్నిచోట్ల సీసీ కెమెరాలు పనిచేస్తుండగా, మరికొన్ని చోట్ల పని చేయకపోవడంతో, పట్టపగలు కారులో నుంచి 8 లక్షల దొంగలించుకుని పారిపోయిన వారి ఆచూకీ ఇప్పటివరకు పోలీసులకు చిక్కకపోవడంతో, మాధవరావు అనే రైతు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తన బంధువుకు చికిత్స ఖర్చులకోసం నుంచి బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులను సూపర్ మార్కెట్ నుంచి 15 నిమిషాల్లోనే బయటకు వచ్చేసరికి డబ్బులు మాయం కావడం పట్ల మాధవరావు వారిని రైతు కంటతడి పెడుతున్నారు. కారు అద్దాలు పగలగొట్టి భారీ నగదు చోరీకి పాల్పడ్డ దుండగులురు పట్టుకోలంటూ మాధవరావు అనే రైతు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బాన్స్వాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గల సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కారులో నుంచి నగదు చోరీకి పాల్పడ్డ దుండగులను పట్టుకుంటామని పోలీసులు సీరియస్గా తీసుకొని బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ లో మంగళవారం పట్టపగలు జరిగిన భారీ నగదు చోరీలో పాల్పడ్డ దుండగులు అంతరాష్ట్ర దొంగల ముఠాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం పకడ్బందీగా బాన్స్వాడ డిఎస్పి విట్టల్ రెడ్డి దొంగలను పట్టుకోవడానికి మూడు బృందాలుగా ఏర్పడి గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
    1
    బాన్సువాడ లో పట్ట పగలే భారీ  
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎప్పుడూ రద్దీగా ఉండే తాడ్కోల్ ప్రధాన రహదారిపై నిలిపిన కారు నుంచి పట్టపగలే 8 లక్షల రూపాయల నగదుదొంగతనం జరగడం బాన్సువాడ లో కలకలం రేపింది. మొదటినుంచి మన దినపత్రిక బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ వరుస కథనాలు ప్రచరించినప్పటికీ, ఇటు పోలీస్ యంత్రాంగం, అటు వ్యాపారస్తులు స్పందించకపోవడం వల్ల బాన్సువాడ పోలీస్ డివిజన్ పరిధిలో దొంగతనాలు ఈమధ్య విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తాజాగా బాన్స్వాడ పట్టణంలోని తాడ్కోలు చౌరస్తా వద్ద నిలిపిన కారు నుంచి 8 లక్షల రూపాయలు దొంగలు అపహరించుకొని పోవడం బాన్సువాడ పట్టణ ప్రజల్ని భయం గుప్పెట్లోకి పంపించింది. ఇప్పటికే బిచ్కుంద పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో డోంగ్లి మండలం లింబురు గ్రామ శివారులో పొలం వద్ద గుర్తుతెలియని దొంగలు రెండు రోజుల క్రితం మూడు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి విలువైన రాగి తీగలు, నూనె ఎత్తుకొని వెళ్ళిపోయారు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార , పిట్లం మండలంలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి విలువైన రాగి తీగలను దొంగలించుకుని పోతున్నారు జిల్లాలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ల పగలగొట్టి విలువైన వస్తువులను దొంగలించుకుని పారిపోతున్నారు. బాన్స్వాడ పట్టణంలో ఎస్బిఐ బ్యాంక్ నుంచి తన బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వారి అవసరాల కోసం తోటి బంధువు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు మంగళవారం బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయలు డ్రా చేసుకొని, తాడ్ కోల్ చౌరస్తా వద్ద గల రిలయన్స్ సూపర్ మార్కెట్ కు సరుకులు కొనడానికి వెళ్లిన మాధవరావును గుర్తించిన దొంగలు, ఆయన కారులో దాచిన ఎనిమిది లక్షల రూపాయలు కారు అద్దాలు పగలగొట్టి పట్ట పగలే చోటికి పాల్పడ్డారు. ముఖ్యంగా బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడం వల్ల, నేరాలు, ఘోరాలు జరగడానికి కారణం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా ఎస్పీగా వచ్చిన శ్వేత ముఖ్యంగా సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు, వ్యాపారస్తుల కు అవగాహన కల్పించి వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరా ఏర్పాటు, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ శాఖ ద్వారా ముఖ్య కూడలిలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. కానీ వాటిపై పోలీస్ శాఖ నిర్లక్ష్యపు నీడలు అల్ముకోవడంతో, సిసి కెమెరాలు పనిచేయక పోవడంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దొంగతనాలు, హత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాన్సువాడ కల్కి చెరువు వద్ద గుర్తుతెలియని రెండు మహిళా మృతదేహాలు బయట పడ్డప్పటికీ, అవి ఎవరి అన్నది పోలీసులు చేదించలేకపోయారు, నిజం సాగర్ వద్ద 23 ఏళ్ల యువతి మృతదేహం బయటపడి మూడు నెలలు కావస్తున్నా ఆ యువతి ఎవరు అన్నది పోలీసులు చేదించలేకపోయారు. దీనివల్ల బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగతనాలు, ద్విచక్ర వాహనాలు దొంగలించడం, తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు దొంగలు పాల్పడుతున్నారు. కానీ పోలీసులకు చిక్కకుండా దొంగలు పారిపోవడానికి కారణం సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడమే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడుకుల్ చౌరస్తాలో 8 లక్షల నగదును కారులో నుంచి దొంగలించి పోయిన దొంగలు ఎవరు? కారు అద్దాలు పగలకొట్టేవరకు ఎవరు? ఎవరు గమనించలేదా? కారు అద్దం బలమైన ఏదైనా ఆయుధంతో పలగొట్టి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చుట్టుపక్కల గల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు, కొన్నిచోట్ల సీసీ కెమెరాలు పనిచేస్తుండగా, మరికొన్ని చోట్ల పని చేయకపోవడంతో, పట్టపగలు కారులో నుంచి 8 లక్షల దొంగలించుకుని పారిపోయిన వారి ఆచూకీ ఇప్పటివరకు పోలీసులకు చిక్కకపోవడంతో, మాధవరావు అనే రైతు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తన బంధువుకు చికిత్స ఖర్చులకోసం నుంచి బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులను సూపర్ మార్కెట్ నుంచి 15 నిమిషాల్లోనే బయటకు వచ్చేసరికి డబ్బులు మాయం కావడం పట్ల మాధవరావు వారిని రైతు కంటతడి పెడుతున్నారు. కారు అద్దాలు పగలగొట్టి భారీ నగదు చోరీకి పాల్పడ్డ దుండగులురు పట్టుకోలంటూ మాధవరావు అనే రైతు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బాన్స్వాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గల సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కారులో నుంచి నగదు చోరీకి పాల్పడ్డ దుండగులను పట్టుకుంటామని పోలీసులు సీరియస్గా తీసుకొని బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ లో మంగళవారం పట్టపగలు జరిగిన భారీ నగదు చోరీలో పాల్పడ్డ దుండగులు అంతరాష్ట్ర దొంగల ముఠాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం పకడ్బందీగా బాన్స్వాడ డిఎస్పి విట్టల్ రెడ్డి దొంగలను పట్టుకోవడానికి మూడు బృందాలుగా ఏర్పడి గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
    user_Local Public news
    Local Public news
    బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service Centre in Hyderabad Kukatpally Tarnaka Nagole ECIL AS Rao Nagar Amberpet Ameerpet LB Nagar Vanasthalipuram Hayathnagar Karmanghat Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar
    1
    Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service Centre in Hyderabad Kukatpally Tarnaka Nagole ECIL AS Rao Nagar Amberpet Ameerpet LB Nagar Vanasthalipuram Hayathnagar Karmanghat Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician Himayatnagar, Hyderabad•
    4 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్ హనుమాన్ దేవాలయ వద్ద పులిహోర పంపిణీ చేశారు పులిహోర దాత గాడిపల్లి లక్ష్మి రాసజ్ఞ కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ ఉంటుందని అన్నదానం మహా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో, రావికంటి చంద్రశేఖర్, మరియాల భద్రయ్య, తోడుపనూరి కాశీనాథ్, వాసవి క్లబ్ యూత్ సెక్రెటరీ ప్రశాంత్, గంగిశెట్టి ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, రామారం రమేష్, నంగునూరు వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్  హనుమాన్ దేవాలయ వద్ద పులిహోర పంపిణీ చేశారు
పులిహోర దాత గాడిపల్లి లక్ష్మి రాసజ్ఞ కరుణాకర్ రెడ్డి  
ఈ సందర్భంగా కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ ఉంటుందని అన్నదానం మహా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో, రావికంటి చంద్రశేఖర్, మరియాల భద్రయ్య, తోడుపనూరి కాశీనాథ్, వాసవి క్లబ్ యూత్ సెక్రెటరీ ప్రశాంత్, గంగిశెట్టి ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, రామారం రమేష్, నంగునూరు వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    రిపోర్టర్ Amberpet, Hyderabad•
    4 hrs ago
  • ప్రత్యేక తరగతుల ద్వారా ఉత్తమ విద్యా ప్రమాణాలు పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలకు దోహదపడతాయని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. బుధవారం కౌడిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించి అనంతరం విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ ఆహార పదార్థాలను పరిశీలించారు తరగతి గదులలో పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సబ్జెక్టుల వారీగా ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయంలో నిబంధనలు పాటించాలని రుచి సూచితో కూడిన ఆహార పదార్థాలు విద్యార్థులకు అందించాలన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి జిల్లాలో ఉత్తమ ఫలితాలు లక్ష్యంగా ముందుకు పోతున్నామని ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టుల వారీగా సామర్థ్యాలను పెంపొందించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య లక్ష్యంగా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులు చదువుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రత్యేక తరగతుల ద్వారా ఉత్తమ విద్యా ప్రమాణాలు పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలకు 
దోహదపడతాయని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. బుధవారం కౌడిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించి అనంతరం విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ ఆహార పదార్థాలను పరిశీలించారు తరగతి గదులలో పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సబ్జెక్టుల వారీగా  ప్రశ్నల రూపంలో  అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయంలో నిబంధనలు పాటించాలని రుచి సూచితో కూడిన ఆహార పదార్థాలు విద్యార్థులకు అందించాలన్నారు.
ఈ సంవత్సరం పదవ తరగతి జిల్లాలో ఉత్తమ ఫలితాలు లక్ష్యంగా 
ముందుకు పోతున్నామని ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టుల వారీగా సామర్థ్యాలను పెంపొందించి 
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య లక్ష్యంగా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులు చదువుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటుందని  ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.