మిట్స్లో ‘యువ కనెక్ట్ – స్పోర్ట్స్ ఎడిషన్’ - యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామనాథన్ మదనపల్లె : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో ఈ నెల 27న ‘వికసిత్ భారత్ యువ కనెక్ట్ – స్పోర్ట్స్ ఎడిషన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామనాథన్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు, క్రీడాకారులతో వర్చువల్గా సంభాషించనున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, క్రీడల అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు సంబంధించిన ఈ కార్యక్రమం మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో నిర్వహించనున్నందున క్రీడాకారులు, విద్యార్థులు ఉదయం 10 గంటలలోపు యూనివర్సిటీకి చేరుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి ప్రసంగం అనంతరం యువత, ‘మై భారత్’ వాలంటీర్లు, స్థానిక క్రీడాకారులతో పరస్పర చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి క్రీడా రంగ అభివృద్ధి, యువతకు అందుతున్న అవకాశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జాతీయ భావన పెంపొందుతాయని డాక్టర్ రామనాథన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, ఎన్సీసీ అధికారి పి. రాజేష్ పాల్గొంటారని తెలిపారు.
మిట్స్లో ‘యువ కనెక్ట్ – స్పోర్ట్స్ ఎడిషన్’ - యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామనాథన్ మదనపల్లె : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో ఈ నెల 27న ‘వికసిత్ భారత్ యువ కనెక్ట్ – స్పోర్ట్స్ ఎడిషన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామనాథన్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు, క్రీడాకారులతో వర్చువల్గా సంభాషించనున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, క్రీడల అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు సంబంధించిన ఈ కార్యక్రమం మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో నిర్వహించనున్నందున క్రీడాకారులు, విద్యార్థులు ఉదయం 10 గంటలలోపు యూనివర్సిటీకి చేరుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి ప్రసంగం అనంతరం యువత, ‘మై భారత్’ వాలంటీర్లు, స్థానిక క్రీడాకారులతో పరస్పర చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి క్రీడా రంగ అభివృద్ధి, యువతకు అందుతున్న అవకాశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జాతీయ భావన పెంపొందుతాయని డాక్టర్ రామనాథన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, ఎన్సీసీ అధికారి పి. రాజేష్ పాల్గొంటారని తెలిపారు.
- పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు..అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి మక్కాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాతి మసీదు వీధి, నాగపాళ్యం ముడెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మొగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సోదరభావం,శాంతి,ఐక్యతను చాటుతూ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి.4
- జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.1
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత చిత్తూరు జిల్లా కుప్పం . న్యూస్.. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు2
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- పరిమళించిన తల్లి హృదయం. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన చోటు చేసుకుంటుంది. ఆకలితో ఉన్న ఒక పంది పిల్ల ఓ గోమాత చెంతకు చేరి పాలు తాగుతూ ఆకలి తీర్చుకున్న వింత ఘటన చోటుచేసుకున్నది. ఆకలితో ఉన్న ఆ పందిపిల్ల పాలు తాగుతున్నా ఆ గోమాత ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పంది పిల్ల ఆకలి తీర్చింది... అందుకే అంటారు కాబోలు తల్లి ఎక్కడైనా ఎవరైనా తల్లే..... వెల్దుర్తిలో పోలీస్స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఘటన1