మహా గురుకులంలో సమస్యలు విలయతాండవం.... పట్టించుకోని జిల్లా అధికారులు.... ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్.... బద్వేలు,ఆగస్టు 26: డివిజన్ పరిధిలోని బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని తోట్లపల్లె మహా గురుకులంలో విద్యార్థుల సమస్యలు విలయతాండవం చేస్తున్న జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు తోట్లపల్లి మహా గురుకులంను సందర్శించడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం ప్రారంభంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభం చేసిన మహా గురుకులం రెండవ విద్యా సంవత్సరం పూర్తవుతున్న కూడా అక్కడ ఉంటున్న విద్యార్థులకు ఎలాంటి వసతులు కల్పించకుండా వారి సమస్యలు పరిష్కరించకుండా జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులు సమస్యలను గాలీకోదలారని వారు పేర్కొన్నారు.విద్యార్థుల మౌలిక వసతులైన త్రాగడానికి సరైన నీటి సదుపాయం లేకుండా ఆరవ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా అదే విధంగా స్నానం చేయడానికి నీరు మరియు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మరుగుదొడ్లల్లోకి నీరు సరఫరా ఆగిపోయిన విద్యార్థుల బాగోగులు చూడాల్సిన ప్రిన్సిపల్ కనీసం విద్యార్థుల మౌలిక వసతులపై చర్యలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు త్రాగడానికి స్నానం చేయడానికి ఉపయోగిస్తూ రాత్రిపూట ఆ నీరు తాగడానికి వెళ్లాలంటే ఎక్కడ విషపురుగులు కరుస్తాయో అని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారని, విద్యార్థులకు ఇవ్వాల్సిన మెనూలో అవకతవకలు చేస్తూ వార్డన్ మరియు ప్రిన్సిపల్ విద్యార్థుల కడుపు కొడుతున్నారని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు వారంలో రెండుసార్లు చికెన్ ఇవ్వాల్సి వస్తే ఒక్కో విద్యార్థికి 360 గ్రాములు వారంలో రెండు సార్లు ఇవ్వాలి కేవలం ఒక విద్యార్థికి 120 గ్రాములు చికెన్ ఇస్తూ మిగిలిన 40 గ్రాములు విద్యార్థుల సొమ్మును అప్పనంగా స్వాహా చేస్తున్నారని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు డైనింగ్ హాల్ చుట్టూ అపరిశుభ్రంగా ఉంది. విద్యార్థులు హాస్టల్ నుంచి స్కూలుకు పోయే దారిలో మధ్యలో చెక్ డ్యామ్ వాగు పెద్దగా ఉండడంతో విద్యార్థులు కిందపడి గాయాలపాయలవుతున్న కూడా ప్రిన్సిపాల్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్కడ విద్యార్థుల పరిస్థితిని పట్టించుకునే నాధుడే లేడని వారు ఆరోపించారు. ఉన్నఫలంగా పాత గురుకులంలో ఉన్న విద్యార్థులను మహా గురుకులంలోకి తరలించడంతో సరైన సిబ్బంది, వర్కర్లు కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో ఉన్న పాత గురుకుల విద్యార్థులను ఒక్క నిమిషం పాద గురుకుల పాఠశాలకు పంపించి అక్కడ స్కూలును యధావిధిగా కొనసాగించి మహా గురుకులంకి వచ్చిన విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించి స్కూలును అభివృద్ధి చేయాలని వారు పేర్కొన్నారు. పాత గురుకుల పాఠశాలను యధావిధిగా కొనసాగించి రెండు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పించాలని లేనిపక్షంలో విద్యార్థులతో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుడిమే సురేష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ నాయకులు సుమంత్ కుమార్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
మహా గురుకులంలో సమస్యలు విలయతాండవం.... పట్టించుకోని జిల్లా అధికారులు.... ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్.... బద్వేలు,ఆగస్టు 26: డివిజన్ పరిధిలోని బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని తోట్లపల్లె మహా గురుకులంలో విద్యార్థుల సమస్యలు విలయతాండవం చేస్తున్న జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు తోట్లపల్లి మహా గురుకులంను సందర్శించడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం ప్రారంభంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభం చేసిన మహా గురుకులం రెండవ విద్యా సంవత్సరం పూర్తవుతున్న కూడా అక్కడ ఉంటున్న విద్యార్థులకు ఎలాంటి వసతులు కల్పించకుండా వారి సమస్యలు పరిష్కరించకుండా జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులు సమస్యలను గాలీకోదలారని వారు పేర్కొన్నారు.విద్యార్థుల మౌలిక వసతులైన త్రాగడానికి సరైన నీటి సదుపాయం లేకుండా ఆరవ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా అదే విధంగా స్నానం చేయడానికి నీరు మరియు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మరుగుదొడ్లల్లోకి నీరు సరఫరా ఆగిపోయిన విద్యార్థుల బాగోగులు చూడాల్సిన ప్రిన్సిపల్ కనీసం విద్యార్థుల మౌలిక వసతులపై చర్యలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు త్రాగడానికి స్నానం చేయడానికి ఉపయోగిస్తూ రాత్రిపూట ఆ నీరు తాగడానికి వెళ్లాలంటే ఎక్కడ విషపురుగులు కరుస్తాయో అని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారని, విద్యార్థులకు ఇవ్వాల్సిన మెనూలో అవకతవకలు చేస్తూ వార్డన్ మరియు ప్రిన్సిపల్ విద్యార్థుల కడుపు కొడుతున్నారని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు వారంలో రెండుసార్లు చికెన్ ఇవ్వాల్సి వస్తే ఒక్కో విద్యార్థికి 360 గ్రాములు వారంలో రెండు సార్లు ఇవ్వాలి కేవలం ఒక విద్యార్థికి 120 గ్రాములు చికెన్ ఇస్తూ మిగిలిన 40 గ్రాములు విద్యార్థుల సొమ్మును అప్పనంగా స్వాహా చేస్తున్నారని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు డైనింగ్ హాల్ చుట్టూ అపరిశుభ్రంగా ఉంది. విద్యార్థులు హాస్టల్ నుంచి స్కూలుకు పోయే దారిలో మధ్యలో చెక్ డ్యామ్ వాగు పెద్దగా ఉండడంతో విద్యార్థులు కిందపడి గాయాలపాయలవుతున్న కూడా ప్రిన్సిపాల్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్కడ విద్యార్థుల పరిస్థితిని పట్టించుకునే నాధుడే లేడని వారు ఆరోపించారు. ఉన్నఫలంగా పాత గురుకులంలో ఉన్న విద్యార్థులను మహా గురుకులంలోకి తరలించడంతో సరైన సిబ్బంది, వర్కర్లు కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో ఉన్న పాత గురుకుల విద్యార్థులను ఒక్క నిమిషం పాద గురుకుల పాఠశాలకు పంపించి అక్కడ స్కూలును యధావిధిగా కొనసాగించి మహా గురుకులంకి వచ్చిన విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించి స్కూలును అభివృద్ధి చేయాలని వారు పేర్కొన్నారు. పాత గురుకుల పాఠశాలను యధావిధిగా కొనసాగించి రెండు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పించాలని లేనిపక్షంలో విద్యార్థులతో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుడిమే సురేష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ నాయకులు సుమంత్ కుమార్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- ప్రియ దైవ స్నేహితులారా ఏసుక్రీస్తు నామము మీ అందరికీ శుభాభివందనం1
- *మధ్యప్రదేశ్:**4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన* *మగ శిశువు...* లవ్ఖుష్నగర్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్లో జబల్పూర్కు తరలించారు...1
- ఏం చైర్మన్ బెజవాడ వంశికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు ఘనంగా యువ నాయకుడు అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలం లో ఊటుకూరు గ్రామంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కోవూరు ఏఎంసి చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాకు ఎప్పుడు అండగా ఉండి యువతకు గాని మేము ఎప్పుడు యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు అలాగే యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు3
- ବିଜେପି କେତେ ନୀଳଜା ଅଛି1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- *బస్సు-కంటైనర్ - "ఢీ"* *6గురు మృతి* *20 మందికి తీవ్ర గాయాలు* *దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం* రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి *ఏలూరు వెళ్తున్న* బస్సుకు ఘోర ప్రమాదం..దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.2