వ్యక్తిగత నైపుణ్యాలతోనే ప్రగతికి బాట..డాక్టర్ చావ రాజ్కుమార్ విద్యార్థులు విద్యతో పాటు కొత్త ఆలోచనలు, వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఉన్నత ఉద్యోగ అవకాశాలను సాధించవచ్చని యంగ్ ఇండియా యంగ్ లీడర్షిప్ సంస్థ వ్యవస్థాపకులు వైద్యరత్న డాక్టర్ చావ రాజ్కుమార్ అన్నారు. భువనగిరి ప్రభుత్వ గంజ్ హైస్కూల్లో ‘యంగ్ ఇండియా యంగ్ లీడర్షిప్–వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూత్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చావ రాజ్కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో యువతను ప్రభావితం చేస్తున్న డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు చైతన్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యతో పాటు వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టౌన్ ఎస్హెచ్ఓ రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమలోని శక్తి, సామర్థ్యాలను గుర్తించి నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. సృజనాత్మక ఆలోచనలు వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి మార్గాలను సుగమం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ధనుంజయ, ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రభాకర్, మూర్తి, సంస్థ అధ్యక్షులు మహేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షులు అంభోజు మల్లేశం, జాయింట్ సెక్రటరీ యేంపాల కొండల్రెడ్డి, ట్రెజరర్ వెంకట్ రాజుగౌడ్, జాయింట్ డైరెక్టర్ శ్రవణ్కుమార్, గాజుల వెంకటేష్ గౌడ్, శ్రవణ్రెడ్డి, సంపత్కుమార్తో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
వ్యక్తిగత నైపుణ్యాలతోనే ప్రగతికి బాట..డాక్టర్ చావ రాజ్కుమార్ విద్యార్థులు విద్యతో పాటు కొత్త ఆలోచనలు, వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఉన్నత ఉద్యోగ అవకాశాలను సాధించవచ్చని యంగ్ ఇండియా యంగ్ లీడర్షిప్ సంస్థ వ్యవస్థాపకులు వైద్యరత్న డాక్టర్ చావ రాజ్కుమార్ అన్నారు. భువనగిరి ప్రభుత్వ గంజ్ హైస్కూల్లో ‘యంగ్ ఇండియా యంగ్ లీడర్షిప్–వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూత్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్
చావ రాజ్కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో యువతను ప్రభావితం చేస్తున్న డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు చైతన్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యతో పాటు వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టౌన్ ఎస్హెచ్ఓ రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమలోని శక్తి, సామర్థ్యాలను గుర్తించి నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. సృజనాత్మక
ఆలోచనలు వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి మార్గాలను సుగమం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ధనుంజయ, ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రభాకర్, మూర్తి, సంస్థ అధ్యక్షులు మహేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షులు అంభోజు మల్లేశం, జాయింట్ సెక్రటరీ యేంపాల కొండల్రెడ్డి, ట్రెజరర్ వెంకట్ రాజుగౌడ్, జాయింట్ డైరెక్టర్ శ్రవణ్కుమార్, గాజుల వెంకటేష్ గౌడ్, శ్రవణ్రెడ్డి, సంపత్కుమార్తో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
- Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion1
- పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.1
- మహిళలపై నేను ప్రెస్ మీట్ పెట్టను: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మహిళలపై నేను ప్రెస్ మీట్లు పెట్టను మహిళలను కించపరిచేలా నేను మాట్లాడను ఎవరు తప్పు చేశారు అనేది దేవుడు చూస్తున్నాడు మహిళ కంటనీరు ఒక్క చుక్క నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతాం కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది * జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి1
- మేడ్చల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్ స్ట్రైక్–59’ మేడ్చల్: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్ స్ట్రైక్–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.1
- సంగారెడ్డి జిల్లా బీరంగూడ పట్టణ పరిధిలో రాఖీ పండుగ సందర్భంగా వెలసిన రాఖీ స్టాల్స్ అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ స్టాల్స్ భారీగా వెలిశాయి. వివిధ రకాల డిజైన్లు, రంగులతో ఆకట్టుకునే రాఖీలు స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో రాఖీలు కొనుగోలు చేసేందుకు మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పండుగ నేపథ్యంలో బీరంగూడలో సందడి వాతావరణం నెలకొంది.1
- మాజీ మంత్రి హరీశ్ పై కోల్కురి కౌంటర్ -22ఏ భూములపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్దాంతంపై క్లారిటీ *మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చేరు కు రేపు వచ్చిన ఎల్లుండి వచ్చిన ఎన్ని బాగోతాలు ఆడినా ఇన్కర్, ఔరా, అరబిందో, తత్వ మిర్చి డెవలపర్స్ భూముల తెరవెనుక బాగోతం మాత్రం అందరికీ తెలుసంటూ సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నర్సింహ రెడ్డి ధ్వజమెత్తారు ప్రజలారా 22 -A కింద నిషేధిత జాబితాల్లో ఉన్న పట్టాభూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తొలగిస్తుందిని స్పష్టం చేశారు.1
- విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1500 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యం అని పేర్కొన్నారు 20 30 కామన్వెల్స్ గేమ్స్ కు ఆదిపత్యం ఇవ్వనుంది అలాగే 2036 ఒలంపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.4
- రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. బైట్...రాం చందర్ రావు4