12న వైఎస్ఆర్సిపి 15వ ఆవిర్భావ దినోత్సవం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి: ధర్మాన కృష్ణదాస్ పిలుపు శ్రీకాకుళం:- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ నెల 12న (గురువారం) జిల్లావ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగలా నిర్వహించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గడిచిన 15 ఏళ్లలో పార్టీ ఎన్నో సవాళ్లను అధిగమించిందని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చెరగని ముద్ర వేసిందని కృష్ణదాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అప్రజాస్వామిక విధానాలు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ దాడులను ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ పోరాటం చేస్తోందని వివరించారు. ఈ తరుణంలో ఆవిర్భావ దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామం, వార్డు, మండల మరియు నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ జెండాలను పెద్ద ఎత్తున ఎగురవేయాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించాలి. పండుగ వాతావరణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువ కావాలి. నియోజకవర్గాల వారీగా జరిగే ఈ వేడుకల వివరాలతో కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆయన కోరారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్య నేతలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు.
12న వైఎస్ఆర్సిపి 15వ ఆవిర్భావ దినోత్సవం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి: ధర్మాన కృష్ణదాస్ పిలుపు శ్రీకాకుళం:- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ నెల 12న (గురువారం) జిల్లావ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగలా నిర్వహించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గడిచిన 15 ఏళ్లలో పార్టీ ఎన్నో సవాళ్లను అధిగమించిందని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చెరగని ముద్ర వేసిందని కృష్ణదాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అప్రజాస్వామిక విధానాలు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ దాడులను ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ పోరాటం చేస్తోందని వివరించారు. ఈ తరుణంలో ఆవిర్భావ దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామం, వార్డు, మండల మరియు నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ జెండాలను పెద్ద ఎత్తున ఎగురవేయాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించాలి. పండుగ వాతావరణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువ కావాలి. నియోజకవర్గాల వారీగా జరిగే ఈ వేడుకల వివరాలతో కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆయన కోరారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్య నేతలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు.
- అరసవెల్లి దేవస్థానం,రొట్టవలసగ్రామ పురోహితులు,వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మవుడూరు సుబ్రహ్మణ్యశర్మ గారు లిఖించినశ్రీ పరభావ నామ సంవత్సర గంటలపంచాంగం శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ , అరసవెళ్లి స్వామి వారి దేవస్థానం అధికారులు, ప్రదాన అర్చుకులు ఇప్పిలి శంకర శర్మ మరియు ఇతర ప్రముఖులు సమక్షంలో ఘనంగా పంచాంగం మంగళవారంఉదయం ఆవిష్కరించారు.4
- పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి1
- డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.1
- Post by Shyam1
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మృతి చెందిన జర్నలిస్టు డేగల చినబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కు అందజేత ఇటీవల మృతి చెందిన ఏబీఎన్ అన్నవరం రిపోర్టర్ డేగల చినబాబు కుటుంబానికి జర్నలిస్టుల ఫెడరేషన్ అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో చినబాబు కుటుంబ సభ్యులకు సోమవారం ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు చినబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చినబాబు మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్టకాలంలో జర్నలిస్టుల ఫెడరేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అధికార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చినబాబు జర్నలిజం రంగంలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను అందించడంలో ఆయన చూపిన కృషి ఇతర జర్నలిస్టులకు ఆదర్శమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని, జర్నలిస్టులు లేదా వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చినబాబు కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం పని ఒత్తిడితో జర్నలిజం వృత్తిని చేస్తున్న పలువురు అకస్మాత్తుగా మరణిస్తుండడంతో వారి కుటుంబాలు వీధిని పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ సందర్భంగా చినబాబు కుటుంబ సభ్యులు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టుల సంఘం అండగా నిలవడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పుర్రె త్రినాథ్, కే.వి.సత్యనారాయణ, శ్రీధర్, ఎస్ కే ఇమ్రాన్, దుర్గా శ్రీనివాస్, స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రమణ, వెంకట్, ప్రసాద్, హరగోపాల్, ప్రవీణ్, లోవరాజు పడాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.6
- ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.2
- నల్లజర్ల మండలం చీపురుగూడెంలో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- శ్రీకాకుళం మార్చి 9. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిష్ట అనంతరం భక్తులు స్వామివారి దర్శనార్థమై పోటెత్తారు. భక్తులందరూ ప్రతిష్ట అయిన స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరించారు అనంతరం స్వామివారి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి మహా ప్రవచన కార్యక్రమాలు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.2