logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలుగుదేశం పార్టీ మహానాడులో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ శనివారం పుట్టపర్తిలో ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి నేతృత్వంలో భారీ మహిళా ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు వందలాది మంది మహిళలతో కలిసి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భాను ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని నినాదాలు చేస్తూ మహిళలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వారు “థాంక్యూ చంద్రబాబు సార్... థాంక్యూ లోకేష్ సార్...” అంటూ నినాదాలు చేశారు. అనంతరం, పుట్టపర్తి మున్సిపాలిటీ వద్ద మహిళలు “థాంక్యూ సీఎం చంద్రబాబు సార్... థాంక్యూ లోకేష్ సార్...” అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వీట్లు, కారాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత సాధికారత కల్పించాలనే లక్ష్యంతో టీడీపీ మహానాడులో 33 శాతం రిజర్వేషన్ తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. మహిళల అభివృద్ధి, భద్రత, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకు ఏడాదికి 15,000 తల్లి ఖాతాలో డబ్బులు జమ, ప్రతి సంక్షేమ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక లబ్ధి, ఆర్థిక సాధికారత కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల బలోపేతం వంటి చర్యలు మహిళల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో చంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భాను, మహిళా సంఘాల నాయకులు రామసుబ్బమ్మ, పద్మావతి, తులసమ్మ, లావణ్య, సుభాషిని, మాధవి, రాధ, శ్రీదేవి, జ్ఞాన దీపిక, షమీం, రంగమ్మ, స్నేహలత, ఉమామహేశ్వరితో పాటు భారీ సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

2 hrs ago
user_Thiruveedhula Rameshnaidu
Thiruveedhula Rameshnaidu
Farmer ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
6da18bbb-8a25-4d15-9124-d27debb66f33

తెలుగుదేశం పార్టీ మహానాడులో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ శనివారం పుట్టపర్తిలో ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి నేతృత్వంలో భారీ మహిళా ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు వందలాది మంది మహిళలతో కలిసి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భాను ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని నినాదాలు చేస్తూ మహిళలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వారు “థాంక్యూ చంద్రబాబు సార్... థాంక్యూ లోకేష్ సార్...” అంటూ నినాదాలు చేశారు. అనంతరం, పుట్టపర్తి మున్సిపాలిటీ వద్ద మహిళలు “థాంక్యూ సీఎం చంద్రబాబు సార్... థాంక్యూ లోకేష్ సార్...” అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వీట్లు, కారాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత సాధికారత కల్పించాలనే లక్ష్యంతో టీడీపీ మహానాడులో 33 శాతం రిజర్వేషన్ తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. మహిళల అభివృద్ధి, భద్రత, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకు ఏడాదికి 15,000 తల్లి ఖాతాలో డబ్బులు జమ, ప్రతి సంక్షేమ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక లబ్ధి, ఆర్థిక సాధికారత కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల బలోపేతం వంటి చర్యలు మహిళల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో చంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భాను, మహిళా సంఘాల నాయకులు రామసుబ్బమ్మ, పద్మావతి, తులసమ్మ, లావణ్య, సుభాషిని, మాధవి, రాధ, శ్రీదేవి, జ్ఞాన దీపిక, షమీం, రంగమ్మ, స్నేహలత, ఉమామహేశ్వరితో పాటు భారీ సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

More news from Annamayya and nearby areas
  • అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో తెలుగుదేశం (టీడీపీ) మరియు భారత చైతన్య యోజన (బీసీవై) పార్టీల నాయకుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ, వాటిని నిరూపించుకోవడానికి రాజనాలబండలో సత్య ప్రమాణాలు చేయడానికి సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ వివాదం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గతంలో చేసిన ఆరోపణలతో మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని పట్టించుకోవడం లేదని, ప్రైవేటు పాఠశాలలు 25% ఉచిత విద్యను అమలు చేయడం లేదని, దీనికి బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ముడుపులు అందాయని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను సత్యదూరమని పేర్కొంటూ, దమ్ముంటే వాటిని రుజువు చేయాలని లేదా రాజనాలబండకు వచ్చి ప్రమాణం చేయాలని పుంగనూరు పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ సోషల్ మీడియా వేదికగా సవాలు విసిరారు. దీనికి స్పందించిన బీసీవై పార్టీ యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ పూల ప్రేమ్ కుమార్, మధుసూదన్ రాయల్‌కు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. రామచంద్ర యాదవ్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడారని, బీసీవై పార్టీ వైకాపాకు కోవర్టుగా పనిచేస్తోందని మధుసూదన్ రాయల్ ఆరోపించారని ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఈ విషయమై ప్రమాణం చేయడానికి ఈ నెల 27వ తేదీన రాజనాలబండ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బీసీవై పార్టీ అధినేతకు, నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని, తాము కొవ్వొత్తులం కాదని ప్రమాణం చేసి చెబుతున్నానని ఆయన ఆలయం వెలుపల జరిగిన సమావేశంలో తెలిపారు. అలాగే, తన మాటలకు కట్టుబడి రాజనాలబండకు వచ్చి ప్రమాణం చేయాలని తెలుగుదేశం నాయకుడు మధుసూదన్ రాయల్‌కు శనివారం మరలా సవాలు విసిరారు. ఉదయమే పూల ప్రేమ్ కుమార్ రాజనాలబండ ఆలయంలో పూజలు చేసుకుని, మధుసూదన్ రాయల్ రాలేదని తెలిపి వెళ్లిపోయారు. అయితే, మధుసూదన్ రాయల్ ఉదయం 10:20 గంటలకు ఆలయం వద్దకు ప్రమాణం చేయడానికి రావడంతో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా మధుసూదన్ రాయల్ మాట్లాడుతూ, తాను బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్‌ను ప్రమాణం చేయమని చెప్పానని, ఆయన “చెంచాలను” గానీ, “తొత్తులను” గానీ ప్రమాణం చేయమని సవాలు విసరలేదని స్పష్టం చేశారు. అనంతరం పూల ప్రేమ్ కుమార్‌ను ఉద్దేశించి, పుంగనూరు పట్టణంలోని షటిల్ ఇండోర్ కోర్టును అర్ధరాత్రి దొంగతనంగా ఆయన కుటుంబ సభ్యులు కూల్చలేదా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఈ విషయంపై ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడటం సబబు కాదని, “నా నాలుకలు కోస్తా” అంటూ విర్రవీగడం ఏంటని ప్రశ్నించారు. పూల ప్రేమ్ కుమార్ సవాలును స్వీకరిస్తూ రాజనాలబండకు ప్రమాణం చేయడానికి వస్తానని సోషల్ మీడియా వేదికగా సమాచారం తెలిపినప్పటికీ, తాను వచ్చేలోపే అవాకులు చవాకులు మాట్లాడి వెళ్లిపోవడం ఏంటని ఎద్దేవా చేశారు. తన మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలియజేస్తూ, మీకు మీ నాయకునికి దమ్ముంటే రాజనాలబండకొచ్చి మీరు చేసిన ఆరోపణలను ఒప్పుకొని ప్రమాణం చేయాలని, ఇందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని మధుసూదన్ రాయల్ స్పష్టం చేశారు. తెలుగుదేశం, బీసీవై పార్టీల నాయకుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఈ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు కొనసాగుతున్నాయి.
    3
    అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో తెలుగుదేశం (టీడీపీ) మరియు భారత చైతన్య యోజన (బీసీవై) పార్టీల నాయకుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ, వాటిని నిరూపించుకోవడానికి రాజనాలబండలో సత్య ప్రమాణాలు చేయడానికి సవాళ్లు విసురుకుంటున్నారు.

ఈ వివాదం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గతంలో చేసిన ఆరోపణలతో మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని పట్టించుకోవడం లేదని, ప్రైవేటు పాఠశాలలు 25% ఉచిత విద్యను అమలు చేయడం లేదని, దీనికి బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ముడుపులు అందాయని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను సత్యదూరమని పేర్కొంటూ, దమ్ముంటే వాటిని రుజువు చేయాలని లేదా రాజనాలబండకు వచ్చి ప్రమాణం చేయాలని పుంగనూరు పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ సోషల్ మీడియా వేదికగా సవాలు విసిరారు.

దీనికి స్పందించిన బీసీవై పార్టీ యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ పూల ప్రేమ్ కుమార్, మధుసూదన్ రాయల్‌కు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. రామచంద్ర యాదవ్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడారని, బీసీవై పార్టీ వైకాపాకు కోవర్టుగా పనిచేస్తోందని మధుసూదన్ రాయల్ ఆరోపించారని ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఈ విషయమై ప్రమాణం చేయడానికి ఈ నెల 27వ తేదీన రాజనాలబండ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బీసీవై పార్టీ అధినేతకు, నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని, తాము కొవ్వొత్తులం కాదని ప్రమాణం చేసి చెబుతున్నానని ఆయన ఆలయం వెలుపల జరిగిన సమావేశంలో తెలిపారు. అలాగే, తన మాటలకు కట్టుబడి రాజనాలబండకు వచ్చి ప్రమాణం చేయాలని తెలుగుదేశం నాయకుడు మధుసూదన్ రాయల్‌కు శనివారం మరలా సవాలు విసిరారు. ఉదయమే పూల ప్రేమ్ కుమార్ రాజనాలబండ ఆలయంలో పూజలు చేసుకుని, మధుసూదన్ రాయల్ రాలేదని తెలిపి వెళ్లిపోయారు.

అయితే, మధుసూదన్ రాయల్ ఉదయం 10:20 గంటలకు ఆలయం వద్దకు ప్రమాణం చేయడానికి రావడంతో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా మధుసూదన్ రాయల్ మాట్లాడుతూ, తాను బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్‌ను ప్రమాణం చేయమని చెప్పానని, ఆయన “చెంచాలను” గానీ, “తొత్తులను” గానీ ప్రమాణం చేయమని సవాలు విసరలేదని స్పష్టం చేశారు. అనంతరం పూల ప్రేమ్ కుమార్‌ను ఉద్దేశించి, పుంగనూరు పట్టణంలోని షటిల్ ఇండోర్ కోర్టును అర్ధరాత్రి దొంగతనంగా ఆయన కుటుంబ సభ్యులు కూల్చలేదా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఈ విషయంపై ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడటం సబబు కాదని, “నా నాలుకలు కోస్తా” అంటూ విర్రవీగడం ఏంటని ప్రశ్నించారు. పూల ప్రేమ్ కుమార్ సవాలును స్వీకరిస్తూ రాజనాలబండకు ప్రమాణం చేయడానికి వస్తానని సోషల్ మీడియా వేదికగా సమాచారం తెలిపినప్పటికీ, తాను వచ్చేలోపే అవాకులు చవాకులు మాట్లాడి వెళ్లిపోవడం ఏంటని ఎద్దేవా చేశారు. తన మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలియజేస్తూ, మీకు మీ నాయకునికి దమ్ముంటే రాజనాలబండకొచ్చి మీరు చేసిన ఆరోపణలను ఒప్పుకొని ప్రమాణం చేయాలని, ఇందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని మధుసూదన్ రాయల్ స్పష్టం చేశారు. తెలుగుదేశం, బీసీవై పార్టీల నాయకుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఈ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు కొనసాగుతున్నాయి.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    9 hrs ago
  • ప్రభు ఏసుక్రీస్తు నామమున ప్రియ స్నేహితులందరికీ శుభాభివందనములు తెలియజేయబడ్డాయి. ఈ సందేశంలో దేవుడు అందరినీ దీవించును గాక అని ఆకాంక్షించబడింది. ప్రభు సహాయం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, ఆయన జ్ఞానబలము, సకల ఐశ్వర్యం, సంతోష సమాధానం లభించాలని కోరబడింది. 'గాడ్ బ్లెస్స్ యు, ప్రైస్ ది లార్డ్' అంటూ సందేశం ముగించబడింది.
    1
    ప్రభు ఏసుక్రీస్తు నామమున ప్రియ స్నేహితులందరికీ శుభాభివందనములు తెలియజేయబడ్డాయి. ఈ సందేశంలో దేవుడు అందరినీ దీవించును గాక అని ఆకాంక్షించబడింది. ప్రభు సహాయం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, ఆయన జ్ఞానబలము, సకల ఐశ్వర్యం, సంతోష సమాధానం లభించాలని కోరబడింది. 'గాడ్ బ్లెస్స్ యు, ప్రైస్ ది లార్డ్' అంటూ సందేశం ముగించబడింది.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని పుసలవాడలోని రాములగుడి దగ్గర కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య వల్ల మురికినీరు ఇళ్లలోకి ప్రవేశిస్తోందని, దీని కారణంగా చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాల కూడా ఉన్నందున పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించడం లేదని, చాలా కాలంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక పరిష్కారాలు కాకుండా, మురికినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, పూసలవాడలోని కాలువలను తక్షణమే శుభ్రం చేయాలని వారు మున్సిపాలిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
    1
    బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని పుసలవాడలోని రాములగుడి దగ్గర కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య వల్ల మురికినీరు ఇళ్లలోకి ప్రవేశిస్తోందని, దీని కారణంగా చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాల కూడా ఉన్నందున పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొన్నారు.

మున్సిపాలిటీ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించడం లేదని, చాలా కాలంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక పరిష్కారాలు కాకుండా, మురికినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, పూసలవాడలోని కాలువలను తక్షణమే శుభ్రం చేయాలని వారు మున్సిపాలిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • కాస్త ఈ రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో..! తిమ్మాపురం గ్రామస్తుల ఆవేదన నంద్యాల జిల్లా మహానంది : కాస్త మా వీధి రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. శనివారం మహానంది మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి మండల కేంద్రమైన తిమ్మాపురం గ్రామంలో పెద్దమ్మ అరుగు వీధి రోడ్డు జలమయమైంది. చినుకు చిటుక్కుమంటే చాలు రోడ్డంతా వర్షపు నీరు నిలిచిపోయి కాలనీవాసులు తిరగడానికి కూడా లేని పరిస్థితి, గ్రామంలో అన్ని సిసి రోడ్లు అయితే వేశారు. కానీ మా కాలనీ రోడ్డు తరుగు అవడంతో వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    కాస్త ఈ రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో..! తిమ్మాపురం గ్రామస్తుల ఆవేదన
నంద్యాల జిల్లా మహానంది :  కాస్త మా వీధి రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. శనివారం మహానంది మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి మండల కేంద్రమైన తిమ్మాపురం గ్రామంలో పెద్దమ్మ అరుగు వీధి రోడ్డు జలమయమైంది. చినుకు చిటుక్కుమంటే చాలు రోడ్డంతా వర్షపు నీరు నిలిచిపోయి కాలనీవాసులు తిరగడానికి కూడా లేని పరిస్థితి, గ్రామంలో అన్ని సిసి రోడ్లు అయితే వేశారు. కానీ మా కాలనీ రోడ్డు తరుగు అవడంతో వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by T. Raja simha
    1
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలం, సంచర్ల పంచాయతీ పరిధిలోని బోరగామానపల్లె గ్రామంలో గురువారం రాత్రి గాలివాన కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోయి విరిగిపోయాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం పోలేరమ్మ తిరునాళ్ల ఉత్సవం జరగనున్న నేపథ్యంలో, ఈ విద్యుత్ అంతరాయం వల్ల ఉత్సవానికి ఆటంకం కలుగుతుందని గ్రామ ప్రజలు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ రితిష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన తక్షణమే స్పందించి, పోరుమామిళ్ల ఎలక్ట్రికల్ ఏడీకి ఫోన్ చేసి, మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల ఏడీ రవి కుమార్, ఏఈ మహేష్, కాంట్రాక్టర్ ప్రవీణ్, సంచర్ల పంచాయతీకి చెందిన నాగలకుంట వెంకటరెడ్డి, బ్రహ్మయ్య, సోమిరెడ్డి తిరుపతయ్య మరియు ఇతర గ్రామ ప్రజలు కలిసికట్టుగా కృషి చేశారు. వారి సమష్టి కృషితో బోరగామానపల్లె గ్రామంలో ఏర్పడిన విద్యుత్ సమస్యను విజయవంతంగా పరిష్కరించారు. బోరగామానపల్లె విద్యుత్ సమస్యను పరిష్కరించిన బద్వేలు నియోజకవర్గం ఇన్చార్జి రితీష్ రెడ్డికి ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలం, సంచర్ల పంచాయతీ పరిధిలోని బోరగామానపల్లె గ్రామంలో గురువారం రాత్రి గాలివాన కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోయి విరిగిపోయాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం పోలేరమ్మ తిరునాళ్ల ఉత్సవం జరగనున్న నేపథ్యంలో, ఈ విద్యుత్ అంతరాయం వల్ల ఉత్సవానికి ఆటంకం కలుగుతుందని గ్రామ ప్రజలు ఆందోళన చెందారు.

ఈ విషయాన్ని గ్రామ ప్రజలు బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ రితిష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన తక్షణమే స్పందించి, పోరుమామిళ్ల ఎలక్ట్రికల్ ఏడీకి ఫోన్ చేసి, మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల ఏడీ రవి కుమార్, ఏఈ మహేష్, కాంట్రాక్టర్ ప్రవీణ్, సంచర్ల పంచాయతీకి చెందిన నాగలకుంట వెంకటరెడ్డి, బ్రహ్మయ్య, సోమిరెడ్డి తిరుపతయ్య మరియు ఇతర గ్రామ ప్రజలు కలిసికట్టుగా కృషి చేశారు.

వారి సమష్టి కృషితో బోరగామానపల్లె గ్రామంలో ఏర్పడిన విద్యుత్ సమస్యను విజయవంతంగా పరిష్కరించారు. బోరగామానపల్లె విద్యుత్ సమస్యను పరిష్కరించిన బద్వేలు నియోజకవర్గం ఇన్చార్జి రితీష్ రెడ్డికి ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • నరసరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ చలివేంద్రం సేవలను రూరల్ ఎస్సై కిషోర్ అభినందించారు.
    1
    నరసరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ చలివేంద్రం సేవలను రూరల్ ఎస్సై కిషోర్ అభినందించారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం, రాంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు రాంచరణ్ మృతి చెందగా, అతని బంధువులు తీవ్ర నిరసనకు దిగారు. బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు, రాంచరణ్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఉంచి, పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
    1
    పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం, రాంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు రాంచరణ్ మృతి చెందగా, అతని బంధువులు తీవ్ర నిరసనకు దిగారు. బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు, రాంచరణ్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఉంచి, పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.