logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

🇮🇳🇳🇵 ఆపదలో నేపాల్‌కు భారత్ అండ! వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ తక్షణ సహాయం అందిస్తోంది. వైద్య, ఆహార సహాయంతో పాటు చిక్కుకున్న భారతీయుల రక్షణకు చర్యలు కొనసాగుతున్నాయి... ఆపదలో పొరుగు దేశానికి అండగా… ప్రతి భారతీయుడి భద్రతే మోదీ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. 🇮🇳🤝🇳🇵

1 hr ago
user_పీవీ శివకుమార్
పీవీ శివకుమార్
Local Politician ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
e557c739-beb0-437d-81bf-872ffa71aa0d
51448b03-1871-48fc-b7a2-503453d0f979
c2216a68-8e9f-4d40-93ac-13fa89b82ca3
96981f32-9817-4d1b-9386-d83b5df177d7

🇮🇳🇳🇵 ఆపదలో నేపాల్‌కు భారత్ అండ! వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ తక్షణ సహాయం అందిస్తోంది. వైద్య, ఆహార సహాయంతో పాటు చిక్కుకున్న భారతీయుల రక్షణకు చర్యలు కొనసాగుతున్నాయి... ఆపదలో పొరుగు దేశానికి అండగా… ప్రతి భారతీయుడి భద్రతే మోదీ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. 🇮🇳🤝🇳🇵

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.
    1
    దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ
రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః
ప్రారంభించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........ ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
    1
    శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........
ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
    user_Bandi vasava datta sanjay
    Bandi vasava datta sanjay
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ధర్మవరం నుంచి మరో సరికొత్త వెబ్ సిరీస్.. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో “అర్జున్ – ది హంట్” శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం పట్టణానికి చెందిన పెద్ది రాజు నరసింహ రచన, దర్శకత్వంలో “అర్జున్ – ది హంట్” పేరుతో మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో వెబ్ సిరీస్ రూపొందుతోంది. ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించేలా కథ, సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌లో AI టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వారి ఫొటోలను స్వీకరించి, వాటి ఆధారంగా AI సహాయంతో ప్రత్యేకమైన క్యారెక్టర్ లుక్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. వ్యక్తుల లుక్‌కు అనుగుణంగా కథలో పాత్రను డిజైన్ చేసే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెబ్ సిరీస్‌లో భాగం కావాలనుకునే వారు తమ ఫొటోతో పాటు వివరాలను పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం 8978580208 నంబర్‌కు WhatsAppలో “ARJUN – THE HUNT” అని మెసేజ్ చేసి, పేరు, వయస్సు, ప్రాంతం, ఫొటో, మొబైల్ నంబర్ వివరాలను పంపించాలని సూచించారు. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ను సరికొత్త విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
    1
    ధర్మవరం నుంచి మరో సరికొత్త వెబ్ సిరీస్.. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో “అర్జున్ – ది హంట్”
శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం పట్టణానికి చెందిన పెద్ది రాజు నరసింహ రచన, దర్శకత్వంలో “అర్జున్ – ది హంట్” పేరుతో మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో వెబ్ సిరీస్ రూపొందుతోంది. ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించేలా కథ, సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వెబ్ సిరీస్‌లో AI టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వారి ఫొటోలను స్వీకరించి, వాటి ఆధారంగా AI సహాయంతో ప్రత్యేకమైన క్యారెక్టర్ లుక్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. వ్యక్తుల లుక్‌కు అనుగుణంగా కథలో పాత్రను డిజైన్ చేసే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
వెబ్ సిరీస్‌లో భాగం కావాలనుకునే వారు తమ ఫొటోతో పాటు వివరాలను పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం 8978580208 నంబర్‌కు WhatsAppలో “ARJUN – THE HUNT” అని మెసేజ్ చేసి, పేరు, వయస్సు, ప్రాంతం, ఫొటో, మొబైల్ నంబర్ వివరాలను పంపించాలని సూచించారు.
మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ను సరికొత్త విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
    user_HI DHARMAVARAM
    HI DHARMAVARAM
    Mobile Store ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Dharmavaram market Road Near current office due to drainage water facing health issues Dharmavaram market road ko current office eduruga kaluva purtega nindadamtoh kalava nillu road pinaa pravahistunae e paristhiti varam rojuluga Ela ounde dini vala ekada ochi veylay chinnaa pila laku mariyu vaysu pi badina valaki andariki dini valaka kaligey kaalushayam wala arogyam deba Tintuna deae E muriki nete wala ekada domalu kuda ekuva aiya e. e situation ni muncipal walu twraga solve cheyalsindiga korutunamu. yours youth rockz
    4
    Dharmavaram market Road Near current office due to drainage water facing health issues 
Dharmavaram market road ko current office eduruga kaluva purtega nindadamtoh 
kalava nillu road pinaa pravahistunae e paristhiti varam rojuluga Ela ounde dini vala ekada ochi veylay chinnaa pila laku mariyu vaysu pi badina valaki andariki dini valaka kaligey kaalushayam wala arogyam deba Tintuna deae E muriki nete wala ekada domalu kuda ekuva aiya e.
e situation ni muncipal walu twraga solve cheyalsindiga korutunamu.
yours 
youth rockz
    user_Munna
    Munna
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.
    1
    మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన

మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.
మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన
మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • బద్వేల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు - నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా. బద్వేలు,ఆగస్టు 27: బద్వేలు పట్టణంలో గురువారం అర్బన్ ఎస్ఐ జయరాములు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి రికార్డులు సరిగా లేనివాహనదారులకు జరిమానా విధించారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువతను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయరాములుమాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ తనిఖీలుచేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    బద్వేల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు - నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా.
బద్వేలు,ఆగస్టు 27: బద్వేలు పట్టణంలో గురువారం అర్బన్ ఎస్ఐ జయరాములు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి రికార్డులు సరిగా లేనివాహనదారులకు జరిమానా విధించారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువతను హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ జయరాములుమాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ తనిఖీలుచేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    33 min ago
  • పీలేరు వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది,ఠాగూర్’ సినిమా తరహాలో వైద్య మోసం? అన్నమయ్య జిల్లా కె.వి పల్లి మండలం జాండ్రపేట గ్రామానికి చెందిన కె. సురేంద్ర (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటి కారణంగా నొప్పులు వస్తున్నాయని పీలేరులోని ఎస్ కె ఆర్ ఆసుపత్రి వైద్యులను బుధవారం సంప్రదించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం సురేంద్రను గురువారం ఆసుపత్రిలో చేర్చుకుని, కిడ్నీలోని రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి సుమారు రూ.35,000 తీసుకున్నారని బంధువులు ఆరోపించారు. ఆపరేషన్‌కు సంబంధించి మత్తు మందు ఇచ్చే సమయంలో సురేంద్ర ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని, అనంతరం ఆయన మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని వెంటనే బంధువులకు స్పష్టంగా తెలియజేయకుండా, అత్యవసర చికిత్స అవసరమంటూ పీలేరు నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి ఎస్ కె ఆర్ ఆసుపత్రి అంబులెన్స్‌లో తరలించినట్లు వారు ఆరోపించారు. సురేంద్ర అప్పటికే మరణించి ఉన్నప్పటికీ, అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందిస్తున్నట్లు చూపిస్తూ తిరుపతికి తీసుకొచ్చారని కూడా బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉదయం 9 గంటల సమయంలో స్విమ్స్ క్యాజువాల్టీకి తీసుకొచ్చిన అనంతరం అక్కడి వైద్యులు సురేంద్రను పరీక్షించి పల్స్ లేదని, ఆయన మరణించినట్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు, బంధువుల రోదనలతో స్విమ్స్ ప్రాంగణంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న సీపీఎం నాయకులు కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యం బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒక వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులు, పీలేరు ఎస్ కె ఆర్ ఆసుపత్రిలో అందించిన వైద్యం, మత్తు మందు ఇచ్చిన అనంతరం జరిగిన పరిణామాలు, స్విమ్స్‌కు తరలించే సమయానికి సురేంద్ర ఆరోగ్య పరిస్థితి, అంబులెన్స్‌లో అందించిన అత్యవసర వైద్యం తదితర అంశాలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వైద్య నిర్లక్ష్యం లేదా ఇతర తప్పిదాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
    1
    పీలేరు వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది,ఠాగూర్’ సినిమా తరహాలో వైద్య మోసం?

అన్నమయ్య జిల్లా కె.వి పల్లి మండలం జాండ్రపేట గ్రామానికి చెందిన కె. సురేంద్ర (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటి కారణంగా నొప్పులు వస్తున్నాయని పీలేరులోని ఎస్ కె ఆర్ ఆసుపత్రి వైద్యులను బుధవారం సంప్రదించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వైద్య పరీక్షల అనంతరం సురేంద్రను గురువారం ఆసుపత్రిలో చేర్చుకుని, కిడ్నీలోని రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి సుమారు రూ.35,000 తీసుకున్నారని బంధువులు ఆరోపించారు.
ఆపరేషన్‌కు సంబంధించి మత్తు మందు ఇచ్చే సమయంలో సురేంద్ర ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని, అనంతరం ఆయన మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని వెంటనే బంధువులకు స్పష్టంగా తెలియజేయకుండా, అత్యవసర చికిత్స అవసరమంటూ పీలేరు నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి ఎస్ కె ఆర్ ఆసుపత్రి అంబులెన్స్‌లో తరలించినట్లు వారు ఆరోపించారు.
సురేంద్ర అప్పటికే మరణించి ఉన్నప్పటికీ, అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందిస్తున్నట్లు చూపిస్తూ తిరుపతికి తీసుకొచ్చారని కూడా బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉదయం 9 గంటల సమయంలో స్విమ్స్ క్యాజువాల్టీకి తీసుకొచ్చిన అనంతరం అక్కడి వైద్యులు సురేంద్రను పరీక్షించి పల్స్ లేదని, ఆయన మరణించినట్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు, బంధువుల రోదనలతో స్విమ్స్ ప్రాంగణంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.
అక్కడే ఉన్న సీపీఎం నాయకులు కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యం బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఒక వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులు, పీలేరు ఎస్ కె ఆర్ ఆసుపత్రిలో అందించిన వైద్యం, మత్తు మందు ఇచ్చిన అనంతరం జరిగిన పరిణామాలు, స్విమ్స్‌కు తరలించే సమయానికి సురేంద్ర ఆరోగ్య పరిస్థితి, అంబులెన్స్‌లో అందించిన అత్యవసర వైద్యం తదితర అంశాలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
వైద్య నిర్లక్ష్యం లేదా ఇతర తప్పిదాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
    1
    అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు.
అన్నమయ్య జిల్లా పుంగనూరు  పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.