logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నరసాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ కీర్తిశేషులు చెరుకూరి లక్ష్మణరావు సేవలు చిరస్మరణీయమని యర్రంశెట్టి వారి పాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, రైతు ప్రజా సమస్యల పోరాట నాయకుడు కూనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు కొనియాడారు. శనివారం నరసాపురం పట్టణంలో జరిగిన చెరుకూరి లక్ష్మణరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలోని మొత్తం 31 వార్డుల ప్రజల దాహార్తి తీర్చడంతో పాటు నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజల తాగునీటి అవసరాల కోసం పట్టణ నడిబొడ్డున 55 ఎకరాల విస్తీర్ణంలో చెరువును ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి చెరుకూరి లక్ష్మణరావు అని ప్రశంసించారు. ఆయన చేసిన సేవలతోనే ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా, నిజమైన ప్రజా నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. శనివారం ఒకటవ వార్డులో జరిగిన చెరుకూరి విగ్రహావిష్కరణకు రాష్ట్ర మంత్రులు తరలివచ్చారంటే ఆయన ఎంతటి గొప్ప వ్యక్తియో అర్థమవుతుందని రంగారావు కొనియాడారు.

5 hrs ago
user_శిద్దాని వేణుగోపాల్ (చిన్ని)
శిద్దాని వేణుగోపాల్ (చిన్ని)
Paan shop నరసాపురం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
ef63e1ac-4603-4033-a33d-c9f0cfc86710

నరసాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ కీర్తిశేషులు చెరుకూరి లక్ష్మణరావు సేవలు చిరస్మరణీయమని యర్రంశెట్టి వారి పాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, రైతు ప్రజా సమస్యల పోరాట నాయకుడు కూనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు కొనియాడారు. శనివారం నరసాపురం పట్టణంలో జరిగిన చెరుకూరి లక్ష్మణరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలోని మొత్తం 31 వార్డుల ప్రజల దాహార్తి తీర్చడంతో పాటు నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజల తాగునీటి అవసరాల కోసం పట్టణ నడిబొడ్డున 55 ఎకరాల విస్తీర్ణంలో చెరువును ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి చెరుకూరి లక్ష్మణరావు అని ప్రశంసించారు. ఆయన చేసిన సేవలతోనే ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా, నిజమైన ప్రజా నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. శనివారం ఒకటవ వార్డులో జరిగిన చెరుకూరి విగ్రహావిష్కరణకు రాష్ట్ర మంత్రులు తరలివచ్చారంటే ఆయన ఎంతటి గొప్ప వ్యక్తియో అర్థమవుతుందని రంగారావు కొనియాడారు.

More news from Kakinada and nearby areas
  • గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల అభివృద్ధి పేరుతో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, పరిశ్రమల స్థాపన నెపంతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు స్పష్టంగా గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ, స్థానిక యువతకు ఉద్యోగాలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడం, ఉపాధి సృష్టించడం మరియు ప్రాంతీయ సమతుల్యతను కాపాడటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.
    1
    గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల అభివృద్ధి పేరుతో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, పరిశ్రమల స్థాపన నెపంతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు స్పష్టంగా గుర్తించారని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ, స్థానిక యువతకు ఉద్యోగాలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడం, ఉపాధి సృష్టించడం మరియు ప్రాంతీయ సమతుల్యతను కాపాడటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    21 min ago
  • రాజమండ్రి సమీపంలోని దివాన్‌చెరువు జాతీయ రహదారిపై సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ టాస్క్ ఫోర్స్ (CSDT) అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో భారీగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం పట్టుబడింది. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 6,080 కిలోల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తనిఖీ చేసిన AP 39 UE సిరీస్ ఐసర్ వ్యాన్‌లో ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి, వాహనాన్ని సీజ్ చేశారు. ఘటన సమయంలో వ్యాన్‌లో ఉన్న ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక వివరాల ప్రకారం, ఈ వ్యాన్ గొల్లప్రోలుకు చెందిన ఆకుల రవికి చెందినదిగా నిర్ధారించారు. నిందితులపై 6A మరియు 7(1) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ బియ్యం ఎక్కడి నుండి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉంది మరియు రవాణా ఉద్దేశం ఏమిటనే అంశాలపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
    3
    రాజమండ్రి సమీపంలోని దివాన్‌చెరువు జాతీయ రహదారిపై సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ టాస్క్ ఫోర్స్ (CSDT) అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో భారీగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం పట్టుబడింది. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 6,080 కిలోల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు తనిఖీ చేసిన AP 39 UE సిరీస్ ఐసర్ వ్యాన్‌లో ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి, వాహనాన్ని సీజ్ చేశారు. ఘటన సమయంలో వ్యాన్‌లో ఉన్న ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక వివరాల ప్రకారం, ఈ వ్యాన్ గొల్లప్రోలుకు చెందిన ఆకుల రవికి చెందినదిగా నిర్ధారించారు. నిందితులపై 6A మరియు 7(1) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ బియ్యం ఎక్కడి నుండి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉంది మరియు రవాణా ఉద్దేశం ఏమిటనే అంశాలపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు. అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    4
    తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు.

అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    51 min ago
  • ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం రేవంత్, కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపాలని కేటీఆర్ కోరుతున్నారని, ఆయన కన్నెపల్లి వెళ్ళిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రేవంత్ హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే మేడిగడ్డ కట్ట తెగిపోయి, భద్రాచలం ప్రాంతమే ఉండదని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీనివల్ల 44 గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాద్రి రాముడే లేకుండా పోతారని పేర్కొన్నారు. కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భద్రాచలాన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం రేవంత్, కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపాలని కేటీఆర్ కోరుతున్నారని, ఆయన కన్నెపల్లి వెళ్ళిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు.

మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రేవంత్ హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే మేడిగడ్డ కట్ట తెగిపోయి, భద్రాచలం ప్రాంతమే ఉండదని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీనివల్ల 44 గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాద్రి రాముడే లేకుండా పోతారని పేర్కొన్నారు. కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భద్రాచలాన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ వద్ద నూతనంగా ప్రారంభమైన 'శుభప్రదం షాపింగ్ మాల్' ఓపెనింగ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ నటి అనసూయ ముఖ్య అతిథిగా విచ్చేసి, మాల్‌ను ప్రారంభించారు. అనసూయ గారి రాకతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరింత కళ వచ్చింది. ఆమెను చూడటానికి, ఆమెతో ఫోటోలు దిగడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పల్నాడు ప్రజలకు సరికొత్త షాపింగ్ డెస్టినేషన్‌గా ఈ మాల్ అందుబాటులోకి వచ్చింది. ఫ్యాషన్, గృహోపకరణాలు మరియు వివిధ రకాల బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట దొరికేలా ఈ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేశారు.
    1
    నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ వద్ద నూతనంగా ప్రారంభమైన 'శుభప్రదం షాపింగ్ మాల్' ఓపెనింగ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ నటి అనసూయ ముఖ్య అతిథిగా విచ్చేసి, మాల్‌ను ప్రారంభించారు. అనసూయ గారి రాకతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరింత కళ వచ్చింది. ఆమెను చూడటానికి, ఆమెతో ఫోటోలు దిగడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పల్నాడు ప్రజలకు సరికొత్త షాపింగ్ డెస్టినేషన్‌గా ఈ మాల్ అందుబాటులోకి వచ్చింది. ఫ్యాషన్, గృహోపకరణాలు మరియు వివిధ రకాల బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట దొరికేలా ఈ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేశారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • గుంటూరు నుండి పలకలూరు వెళ్లే మార్గంలో మసీదు సెంటర్ వద్ద పైప్‌లైన్ లీకేజీ కారణంగా రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా, గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద కూడా రోడ్డుపై మరొక భారీ గుంత ఏర్పడింది. ఈ గుంతల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    గుంటూరు నుండి పలకలూరు వెళ్లే మార్గంలో మసీదు సెంటర్ వద్ద పైప్‌లైన్ లీకేజీ కారణంగా రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అంతేకాకుండా, గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద కూడా రోడ్డుపై మరొక భారీ గుంత ఏర్పడింది. ఈ గుంతల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    10 hrs ago
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వేమూరు గ్రామంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేసే ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 84 శాతం సర్వే పూర్తయిందని వెల్లడించిన ఆయన, మిగిలిన ప్రక్రియను కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారులు, కలెక్టర్లు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తుండటాన్ని ఆయన ప్రశంసించారు. ఈ సర్వే విజయవంతానికి ఓటర్లు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కూడా సహకరిస్తున్నారని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నెల 14వ తేదీలోపు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సర్వే చేయించుకోని అర్హులైన ఓటర్లు వెంటనే తమ వివరాలను నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు లేదా ఓటర్ల వివరాలలో మార్పులు చేసుకోవాల్సిన వారు ఫారం-6, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.
    1
    రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వేమూరు గ్రామంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేసే ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 84 శాతం సర్వే పూర్తయిందని వెల్లడించిన ఆయన, మిగిలిన ప్రక్రియను కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారులు, కలెక్టర్లు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తుండటాన్ని ఆయన ప్రశంసించారు.

ఈ సర్వే విజయవంతానికి ఓటర్లు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కూడా సహకరిస్తున్నారని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నెల 14వ తేదీలోపు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సర్వే చేయించుకోని అర్హులైన ఓటర్లు వెంటనే తమ వివరాలను నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు లేదా ఓటర్ల వివరాలలో మార్పులు చేసుకోవాల్సిన వారు ఫారం-6, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    3 hrs ago
  • చట్టాలను, రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్న ప్రశ్న రావణ్‌కు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగా మద్దతు పలకడం బాధాకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, చట్టం ముందు అందరూ సమానమేనని మరియు ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో న్యాయ ప్రక్రియలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఎంతైనా ఉందని ఆయన గుర్తుచేశారు. అయితే జగన్ మోహన్ రెడ్డి చట్టపరమైన అంశాలకు రాజకీయ రంగు పులుముతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అప్పలనాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, చట్టాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విచారణ సంస్థలు తమ విధులను ఎవరి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం కొందరు వ్యక్తులను కాపాడేందుకు చట్టాలను విమర్శించడం ఎంతమాత్రం సరికాదని, ప్రజలు ఈ వాస్తవాలను గుర్తించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు.
    1
    చట్టాలను, రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్న ప్రశ్న రావణ్‌కు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగా మద్దతు పలకడం బాధాకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, చట్టం ముందు అందరూ సమానమేనని మరియు ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో న్యాయ ప్రక్రియలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఎంతైనా ఉందని ఆయన గుర్తుచేశారు.

అయితే జగన్ మోహన్ రెడ్డి చట్టపరమైన అంశాలకు రాజకీయ రంగు పులుముతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అప్పలనాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, చట్టాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విచారణ సంస్థలు తమ విధులను ఎవరి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం కొందరు వ్యక్తులను కాపాడేందుకు చట్టాలను విమర్శించడం ఎంతమాత్రం సరికాదని, ప్రజలు ఈ వాస్తవాలను గుర్తించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.