ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పులిగుండాల ఏకో టూరిజం ప్రాజెక్టును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా కాటేజీలు, బోటింగ్, వాటర్ ఫాల్స్, జంగిల్ సఫారీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... తెలంగాణలోని సహజ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధికి ఇప్పటికే బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చామని, ఖమ్మం జిల్లాలోని కనకగిరి ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. పులిగుండాల చెరువు వద్ద టూరిజం అభివృద్ధికి అవసరమైన రూ.4 కోట్లలో రూ.2 కోట్లు హరిత నిధి నుంచి, మిగిలిన రూ.2 కోట్లు సి.ఎస్.ఆర్ నిధుల నుంచి అందిస్తామని ప్రకటించారు. అలాగే కనకగిరి వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పులిగుండాల ప్రాజెక్ట్, కనకగిరి గుట్టలు, కల్లూరు గుట్టలను కలిపి ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రకృతిని ఏమాత్రం దెబ్బతీయకుండా, సహజ సిద్ధమైన వాతావరణంలోనే అభివృద్ధి చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, హోటళ్లు, చిన్న వ్యాపారాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పులిగుండాల ఏకో టూరిజం ప్రాజెక్టును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా కాటేజీలు, బోటింగ్, వాటర్ ఫాల్స్, జంగిల్ సఫారీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... తెలంగాణలోని సహజ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధికి ఇప్పటికే బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చామని, ఖమ్మం జిల్లాలోని కనకగిరి ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక
కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. పులిగుండాల చెరువు వద్ద టూరిజం అభివృద్ధికి అవసరమైన రూ.4 కోట్లలో రూ.2 కోట్లు హరిత నిధి నుంచి, మిగిలిన రూ.2 కోట్లు సి.ఎస్.ఆర్ నిధుల నుంచి అందిస్తామని ప్రకటించారు. అలాగే కనకగిరి వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పులిగుండాల ప్రాజెక్ట్, కనకగిరి గుట్టలు, కల్లూరు గుట్టలను కలిపి ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రకృతిని ఏమాత్రం దెబ్బతీయకుండా, సహజ సిద్ధమైన వాతావరణంలోనే అభివృద్ధి చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, హోటళ్లు, చిన్న వ్యాపారాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- Post by V Ramarao3
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- Post by JADI RAJU1
- విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1