వినాయక చవితి వేడుకలకు ముస్తాబైన మండపాలు ఆకట్టుకుంటున్న విద్యుత్ దీపాల ప్రత్యేక అలంకరణలు మహమ్మదాబాద్, సెప్టెంబరు 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మహమ్మదాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వినాయక మండపాలు భక్తిశ్రద్ధలతో ముస్తాబయ్యాయి. నిర్వాహకులు మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ రకాల లైటింగ్ అలంకరణలతో తీర్చిదిద్దడంతో గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగులతో మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.మండపాల వద్ద ప్రతిష్ఠించిన గణనాథుడికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ భక్తులు పెద్ద సంఖ్యలో మండపాల వద్దకు చేరుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. చిన్నారులు, మహిళలు, యువత ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటుండటంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో జాగృతి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘం సభ్యులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గణనాథుడిని దర్శించుకునేందుకు గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల కోసం నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు యువజన సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు సహకరిస్తున్నారు.
వినాయక చవితి వేడుకలకు ముస్తాబైన మండపాలు ఆకట్టుకుంటున్న విద్యుత్ దీపాల ప్రత్యేక అలంకరణలు మహమ్మదాబాద్, సెప్టెంబరు 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మహమ్మదాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వినాయక మండపాలు భక్తిశ్రద్ధలతో ముస్తాబయ్యాయి. నిర్వాహకులు మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ రకాల లైటింగ్ అలంకరణలతో తీర్చిదిద్దడంతో గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగులతో మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.మండపాల వద్ద ప్రతిష్ఠించిన గణనాథుడికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ భక్తులు పెద్ద సంఖ్యలో మండపాల వద్దకు చేరుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. చిన్నారులు, మహిళలు, యువత ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటుండటంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో జాగృతి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘం సభ్యులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గణనాథుడిని దర్శించుకునేందుకు గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల కోసం నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు యువజన సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు సహకరిస్తున్నారు.
- తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.1
- మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి న్యాయం చేస్తాం. మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ అనన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ లో కార్మికులు పనిచేయడం వల్లనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.1
- వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను. నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను వదిలేయాలని వేడుకున్న రాజు. నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమించానని, నిన్ను వదులుకోలేనని, నేను చెప్పినట్టు వింటే రాజా లాగా చూసుకుంటానని రాజుకు చెప్పిన శిరీష.1
- మంగనూర్ గ్రామంలో గణపతి వేడుకలు..మారుమోగిన ఆధ్యాత్మిక సంకీర్తనలు బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన భజన మండలి కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, లంబోదరుని పాటలు విజ్ఞప్తితో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వంక మల్లయ్య, బూదూరు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి కురుమయ్య, సేవకుల వెంకటయ్య తదితర గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొని శ్రుతి కలిపారు.1
- షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.1
- గణపతిని తెస్తుండగా జరిగిన దుర్ఘటన పటాస్ లకు దూరంగా ఉండండి డీజే మరియు త్రా గుడ కు ప్రమాదకర మైన వాటికి దూరంగా ఉండండి విషయం పటాస్ ల దాటికి సౌండ్ దాటికి లైటింగ్ దాటికి డ్రైవర్ కి కనబడక ఈ విషాదం జరిగింది అందరూ అన్నిటికీ దూరంగా ఉండి జాగ్రత్త వహించాలని కో రడ మై నది4
- ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ, ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.1
- కాగజ్నగర్లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1