logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శనివారం చేరుకున్నాయి. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సూచనల మేరకు వెలగలేరులో జలహారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య, పోలవరం కుడి ప్రధాన కాలువ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. శ్రీనివాస్ తదితరులు గోదావరి జలాలకు పూలు చల్లి, హారతి ఇచ్చి సారె సమర్పించి ఘన స్వాగతం పలికారు. కృష్ణా డెల్టాకు జీవనాడిగా నిలిచిన పట్టిసీమ పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించడం వల్ల సుమారు 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి కలుగుతుందని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగ అన్నాడంటూ విమర్శలు గుప్పించారు. అప్పట్లో సీఎం చంద్రబాబు పట్టిసీమను సమర్థవంతంగా పూర్తి చేయడం వల్లే, ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోయినా రైతులకు సకాలంలో సాగునీరు అందుతోందని కొనియాడారు. నీరు చేరడంతో డెల్టా ప్రాంత రైతులు హర్షం వ్యక్తంచేస్తూ పట్టిసీమ పథకం వ్యవసాయానికి మరోసారి ఊపిరి పోసిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెమ్ ఇందిరా ప్రియదర్శిని, టీడీపీ మండల అధ్యక్షుడు వేములకొండ వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి లంకా నాగేశ్వరరావు, వెలగలేరు సొసైటీ అధ్యక్షుడు మంచినేని రాజశేఖర్, కూటమి కుటుంబ సభ్యులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

5 hrs ago
user_YAMALA DURGAPRASAD REDDY
YAMALA DURGAPRASAD REDDY
మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
ead73533-245f-48c9-957a-639fe11463de

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శనివారం చేరుకున్నాయి. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సూచనల మేరకు వెలగలేరులో జలహారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య, పోలవరం కుడి ప్రధాన కాలువ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. శ్రీనివాస్ తదితరులు గోదావరి జలాలకు పూలు చల్లి, హారతి ఇచ్చి సారె సమర్పించి ఘన స్వాగతం పలికారు. కృష్ణా డెల్టాకు జీవనాడిగా నిలిచిన పట్టిసీమ పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించడం వల్ల సుమారు 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి కలుగుతుందని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగ అన్నాడంటూ విమర్శలు గుప్పించారు. అప్పట్లో సీఎం చంద్రబాబు పట్టిసీమను సమర్థవంతంగా పూర్తి చేయడం వల్లే, ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోయినా రైతులకు సకాలంలో సాగునీరు అందుతోందని కొనియాడారు. నీరు చేరడంతో డెల్టా ప్రాంత రైతులు హర్షం వ్యక్తంచేస్తూ పట్టిసీమ పథకం వ్యవసాయానికి మరోసారి ఊపిరి పోసిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెమ్ ఇందిరా ప్రియదర్శిని, టీడీపీ మండల అధ్యక్షుడు వేములకొండ వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి లంకా నాగేశ్వరరావు, వెలగలేరు సొసైటీ అధ్యక్షుడు మంచినేని రాజశేఖర్, కూటమి కుటుంబ సభ్యులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
    3
    సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు. అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    4
    తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు.

అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ వద్ద నూతనంగా ప్రారంభమైన 'శుభప్రదం షాపింగ్ మాల్' ఓపెనింగ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ నటి అనసూయ ముఖ్య అతిథిగా విచ్చేసి, మాల్‌ను ప్రారంభించారు. అనసూయ గారి రాకతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరింత కళ వచ్చింది. ఆమెను చూడటానికి, ఆమెతో ఫోటోలు దిగడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పల్నాడు ప్రజలకు సరికొత్త షాపింగ్ డెస్టినేషన్‌గా ఈ మాల్ అందుబాటులోకి వచ్చింది. ఫ్యాషన్, గృహోపకరణాలు మరియు వివిధ రకాల బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట దొరికేలా ఈ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేశారు.
    1
    నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ వద్ద నూతనంగా ప్రారంభమైన 'శుభప్రదం షాపింగ్ మాల్' ఓపెనింగ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ నటి అనసూయ ముఖ్య అతిథిగా విచ్చేసి, మాల్‌ను ప్రారంభించారు. అనసూయ గారి రాకతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరింత కళ వచ్చింది. ఆమెను చూడటానికి, ఆమెతో ఫోటోలు దిగడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పల్నాడు ప్రజలకు సరికొత్త షాపింగ్ డెస్టినేషన్‌గా ఈ మాల్ అందుబాటులోకి వచ్చింది. ఫ్యాషన్, గృహోపకరణాలు మరియు వివిధ రకాల బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట దొరికేలా ఈ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేశారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • గుంటూరు నుండి పలకలూరు వెళ్లే మార్గంలో మసీదు సెంటర్ వద్ద పైప్‌లైన్ లీకేజీ కారణంగా రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా, గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద కూడా రోడ్డుపై మరొక భారీ గుంత ఏర్పడింది. ఈ గుంతల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    గుంటూరు నుండి పలకలూరు వెళ్లే మార్గంలో మసీదు సెంటర్ వద్ద పైప్‌లైన్ లీకేజీ కారణంగా రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అంతేకాకుండా, గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద కూడా రోడ్డుపై మరొక భారీ గుంత ఏర్పడింది. ఈ గుంతల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    11 hrs ago
  • ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం రేవంత్, కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపాలని కేటీఆర్ కోరుతున్నారని, ఆయన కన్నెపల్లి వెళ్ళిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రేవంత్ హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే మేడిగడ్డ కట్ట తెగిపోయి, భద్రాచలం ప్రాంతమే ఉండదని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీనివల్ల 44 గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాద్రి రాముడే లేకుండా పోతారని పేర్కొన్నారు. కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భద్రాచలాన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం రేవంత్, కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపాలని కేటీఆర్ కోరుతున్నారని, ఆయన కన్నెపల్లి వెళ్ళిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు.

మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రేవంత్ హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే మేడిగడ్డ కట్ట తెగిపోయి, భద్రాచలం ప్రాంతమే ఉండదని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీనివల్ల 44 గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాద్రి రాముడే లేకుండా పోతారని పేర్కొన్నారు. కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భద్రాచలాన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
  • భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ఖమ్మంలో సురక్షితమైన మరియు విలువ పెరిగే పెట్టుబడి కోసం చూస్తున్న వారికి శ్రీ వేంకటేశ్వర గార్డెన్స్ ఒక సరైన ఎంపికగా నిలుస్తోంది. భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రాంత పరిస్థితులతో సంబంధం లేకుండా తెలివైన పెట్టుబడిని ఎంచుకోవాలని సూచించడమైనది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఓపెన్ ప్లాట్లు DTCP మరియు RERA ద్వారా ఆమోదం పొందాయి. మరిన్ని వివరాలు మరియు పెట్టుబడి అవకాశాల కోసం 8008165564 నంబర్‌ను సంప్రదించవచ్చు.
    1
    ఖమ్మంలో సురక్షితమైన మరియు విలువ పెరిగే పెట్టుబడి కోసం చూస్తున్న వారికి శ్రీ వేంకటేశ్వర గార్డెన్స్ ఒక సరైన ఎంపికగా నిలుస్తోంది. భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రాంత పరిస్థితులతో సంబంధం లేకుండా తెలివైన పెట్టుబడిని ఎంచుకోవాలని సూచించడమైనది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఓపెన్ ప్లాట్లు DTCP మరియు RERA ద్వారా ఆమోదం పొందాయి. మరిన్ని వివరాలు మరియు పెట్టుబడి అవకాశాల కోసం 8008165564 నంబర్‌ను సంప్రదించవచ్చు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.