*నంద్యాలలో మిలాదున్ నబీ సందర్భంగా ఘనంగా భారీ బైక్ ర్యాలీ* *జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్* *శాంతి, సామరస్యాలకు ప్రతీక మహమ్మద్ ప్రవక్త బోధనలు: ఎన్ఎండి ఫయాజ్* *నంద్యాల ఆగష్టు 26 :* పవిత్ర మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో ముస్లిం సోదరులు, యువత ఆధ్వర్యంలో బుధవారం అత్యంత వైభవంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ స్థానిక చింతరుగు సెంటర్ నుండి ప్రారంభమై... గాంధీ చౌక్, శ్రీనివాస్ సెంటర్, సంజీవనగర్ గేట్ మీదుగా పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగి తిరిగి చింతరుగు సెంటర్ వద్దకు చేరుకుని ముగిసింది. వందలాది మంది యువకులు బైక్లపై ఇస్లామిక్ జెండాలు చేతబూని, ప్రవక్త మహమ్మద్ ప్రవచించిన శాంతి, సోదరభావ సందేశాలను చాటుతూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి, కరుణ, దయ, సోదరభావం యావత్ మానవాళికి ఆదర్శనీయమని అన్నారు . సమాజంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, పరస్పర ప్రేమానురాగాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. పవిత్ర మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా పట్టణ ప్రజలకు, ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, మాబు జైలాన్, డిఎస్ మహబూబ్, డీఎస్ జహీద్, డిఎస్ జాఫర్, షేక్ మహమ్మద్ రఫీ (మున్నా), డిఎస్ రసూల్, డీఎస్ బషీర్, అలీ, హీదయతుల్లా, పట్టణ ప్రముఖులు, ముస్లిం పెద్దలు, యువ నాయకులు, భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
*నంద్యాలలో మిలాదున్ నబీ సందర్భంగా ఘనంగా భారీ బైక్ ర్యాలీ* *జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్* *శాంతి, సామరస్యాలకు ప్రతీక మహమ్మద్ ప్రవక్త బోధనలు: ఎన్ఎండి ఫయాజ్* *నంద్యాల ఆగష్టు 26 :* పవిత్ర మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో ముస్లిం సోదరులు, యువత ఆధ్వర్యంలో బుధవారం అత్యంత వైభవంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ స్థానిక చింతరుగు సెంటర్ నుండి ప్రారంభమై... గాంధీ చౌక్, శ్రీనివాస్ సెంటర్, సంజీవనగర్ గేట్ మీదుగా పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగి తిరిగి చింతరుగు సెంటర్ వద్దకు చేరుకుని ముగిసింది. వందలాది మంది యువకులు బైక్లపై ఇస్లామిక్
జెండాలు చేతబూని, ప్రవక్త మహమ్మద్ ప్రవచించిన శాంతి, సోదరభావ సందేశాలను చాటుతూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి, కరుణ, దయ, సోదరభావం యావత్ మానవాళికి ఆదర్శనీయమని అన్నారు . సమాజంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, పరస్పర ప్రేమానురాగాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. పవిత్ర మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా పట్టణ ప్రజలకు, ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, మాబు జైలాన్, డిఎస్ మహబూబ్, డీఎస్ జహీద్, డిఎస్ జాఫర్, షేక్ మహమ్మద్ రఫీ (మున్నా), డిఎస్ రసూల్, డీఎస్ బషీర్, అలీ, హీదయతుల్లా, పట్టణ ప్రముఖులు, ముస్లిం పెద్దలు, యువ నాయకులు, భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
- *మధ్యప్రదేశ్:**4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన* *మగ శిశువు...* లవ్ఖుష్నగర్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్లో జబల్పూర్కు తరలించారు...1
- ବିଜେପି କେତେ ନୀଳଜା ଅଛି1
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.1
- ప్రియ దైవ స్నేహితులారా ఏసుక్రీస్తు నామము మీ అందరికీ శుభాభివందనం1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- *బస్సు-కంటైనర్ - "ఢీ"* *6గురు మృతి* *20 మందికి తీవ్ర గాయాలు* *దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం* రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి *ఏలూరు వెళ్తున్న* బస్సుకు ఘోర ప్రమాదం..దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.2