వినాయకుడు - విరుగుడు నేను ఒకసారి కంచి మఠం వెళ్ళినప్పుడు అర్చకులు ఒకరు నాకు ఈ విషయం చెప్పారు. దాదాపు 55 సంవత్సరాల కిందట పరమాచార్య స్వామి వారు తిరుచిరాపల్లికి దగ్గర్లోని ఒక పల్లెటూరిలో మకాం చేస్తున్నారు. ఒకరోజు వారు చంద్రమౌళీశ్వర పూజకు ఉపక్రమిస్తూ, మఠం మేనేజరుతో “ఇంక కొద్దిసేపట్లో అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ అర్చకులు ఇక్కడికి వస్తారు. వారికి భోజనాలు పెట్టించి, 2 గంటలకు నా వద్దకు తీసుకుని రా” అని చెప్పారు. అక్కడే నిలబడి ఉన్న ఒక శిష్యుడితో, “మఠం స్థపతితో చెప్పి రెండు అడుగుల వినాయకుని విగ్రహం తయారు చెయ్యమని చెప్పు” అని ఆజ్ఞాపించారు. మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం మేనేజరు అర్చకులను మఠం సంప్రదాయం ప్రకారం స్వాగతించి, మద్యాహ్న సమయం కావడం వల్ల వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారి భోజనం తరువాత స్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళాడు. పరమాచార్య స్వామి వారు అందరినీ పేరుపేరునా వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన అర్చకులు పరమాచార్యస్వామి వారితో, “పెరియవ! రోజూ ఉదయం అర్చకులు ఎవరైతే అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ గర్భగృహం తలుపులు తీసి లోపలికి వెళ్తున్నారో, ఆ వెళ్ళినవారు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మళ్ళా పది నిముషములు ఉపచారము చేసిన తరువాతనే స్వస్థత పొందుతున్నారు. కావున మిగిలిన అర్చకులు ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించడం లేదు” అని తమ బాధను చెప్పుకున్నారు. వెంటనే మహాస్వామి వారు వారితో, “రేపు నేనే స్వయంగా దేవాలయానికి వస్తాను. నేను వచ్చిన తరువాతనే మీరు ఆలయ తలుపులు తెరవండి” అని చెప్పి వారికి ప్రసాదాన్ని ఇచ్చి పంపించారు. మరుసటి రోజు తెల్లవారుఝామున 5:30 గంటలకు పరమాచార్య స్వామి వారు అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఒక అర్చకుడు అమ్మవారి గర్భగృహం తలుపులు తెరిచాడు. వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. పది నిముషముల తరువాత లేచి తన పనులకు వెళ్ళిపోయాడు. అది చూసి మహాస్వామి వారు కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళారు. తరువాత ఆలయ ప్రధాన అర్చకుణ్ణి పిలిచి, “రేపటినుండి అతణ్ణి గర్భగృహం పక్క ద్వారం నుండి లోపలికి వెళ్ళమని చెప్పండి” అని ఎల్ల వెళ్ళాలో చెప్పి, తలుపులు తీసిన రెండు నిముషముల తరువాత లోపలికి వెళ్ళండి అని చెప్పారు. సాయంత్రం స్థపతి వినాయకుని విగ్రహం తీసుకుని పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చాడు. స్వామి వారు ఒక మంటప నిర్మాణం చేసి, దాని పైన ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించమని చెప్పారు. అది ఎలా ఉండాలి అంటే “అమ్మవారి దృష్టి కాంతి, వినాకుడి దృష్టి కాంతి సమాంతరంగా ఒకటికొకటి కలవాలి” అలా నిర్మాణం చెయ్యవలసిందని చెప్పారు. స్వామి వారు చెప్పినట్టుగానే ఆలయంలో వినాయకుణ్ణి వారి అమ్మగారైన అఖిలాండేశ్వరి ఎదురుగా ప్రతిష్టించారు. ఆగమోక్తంగా ప్రతిష్ట పూజలు నిర్వహించారు. అప్పటి నుండి అర్చకులకు కళ్ళుతిరిగి పడిపోవడం జరుగలేదు. ఇప్పటికీ, అష్టమూర్తి క్షేత్రములలో ఒకటైన, జల లింగ క్షేత్రమైన జంబుకేశ్వరం(తిరువణైకావల్) లోని అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు ఉంటాడు. తల్లి తొలి చూపు తన తొలి బిడ్దడిపై ప్రసరించేట్టుగా పరమాచార్య స్వామి వారు సుముఖుడైన వినాయకుని ప్రతిష్ట చేయించారు. [సాక్షాత్ పరమశివ అవతారులైన ఆదిశంకరాచార్యుల వారు, రాబోవు కాలాములలో ప్రజలు అనుష్టానము లేక, తపశ్శక్తి లేక దేవతా మూర్తుల ఎదురుగుండా నిలబడలేరని గ్రహించి, ఎక్కువగా ఉన్న తేజస్సును లెక్కకట్టి దాన్ని శ్రీచక్రంలోకి తీసి అక్కడే శ్రీచక్ర ప్రతిష్ట చేసారు. జంబుకేశ్వరం జల క్షేత్రం కావటం చేత అమ్మవారి సువర్ణ తాటంకాలలో శ్రీచక్రం వేసి అమ్మవారికి ధరింపచేసారు] --- ఎ. త్యాగరాజన్, చెన్నై - శక్తి వికటన్ ప్రచురణ #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
వినాయకుడు - విరుగుడు నేను ఒకసారి కంచి మఠం వెళ్ళినప్పుడు అర్చకులు ఒకరు నాకు ఈ విషయం చెప్పారు. దాదాపు 55 సంవత్సరాల కిందట పరమాచార్య స్వామి వారు తిరుచిరాపల్లికి దగ్గర్లోని ఒక పల్లెటూరిలో మకాం చేస్తున్నారు. ఒకరోజు వారు చంద్రమౌళీశ్వర పూజకు ఉపక్రమిస్తూ, మఠం మేనేజరుతో “ఇంక కొద్దిసేపట్లో అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ అర్చకులు ఇక్కడికి వస్తారు. వారికి భోజనాలు పెట్టించి, 2 గంటలకు నా వద్దకు తీసుకుని రా” అని చెప్పారు. అక్కడే నిలబడి ఉన్న ఒక శిష్యుడితో, “మఠం స్థపతితో చెప్పి రెండు అడుగుల వినాయకుని విగ్రహం తయారు చెయ్యమని చెప్పు” అని ఆజ్ఞాపించారు. మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం మేనేజరు అర్చకులను మఠం సంప్రదాయం ప్రకారం స్వాగతించి, మద్యాహ్న సమయం కావడం వల్ల వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారి భోజనం తరువాత స్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళాడు. పరమాచార్య స్వామి వారు అందరినీ పేరుపేరునా వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన అర్చకులు పరమాచార్యస్వామి వారితో, “పెరియవ! రోజూ ఉదయం అర్చకులు ఎవరైతే అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ గర్భగృహం తలుపులు తీసి లోపలికి వెళ్తున్నారో, ఆ వెళ్ళినవారు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మళ్ళా పది నిముషములు ఉపచారము చేసిన తరువాతనే స్వస్థత పొందుతున్నారు. కావున మిగిలిన అర్చకులు ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించడం లేదు” అని తమ బాధను చెప్పుకున్నారు. వెంటనే మహాస్వామి వారు వారితో, “రేపు నేనే స్వయంగా దేవాలయానికి వస్తాను. నేను వచ్చిన తరువాతనే మీరు ఆలయ తలుపులు తెరవండి” అని చెప్పి వారికి ప్రసాదాన్ని ఇచ్చి పంపించారు. మరుసటి రోజు తెల్లవారుఝామున 5:30 గంటలకు పరమాచార్య స్వామి వారు అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఒక అర్చకుడు అమ్మవారి గర్భగృహం తలుపులు తెరిచాడు. వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. పది నిముషముల తరువాత లేచి తన పనులకు వెళ్ళిపోయాడు. అది చూసి మహాస్వామి వారు కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళారు. తరువాత ఆలయ ప్రధాన అర్చకుణ్ణి పిలిచి, “రేపటినుండి అతణ్ణి గర్భగృహం పక్క ద్వారం నుండి లోపలికి వెళ్ళమని చెప్పండి” అని ఎల్ల వెళ్ళాలో చెప్పి, తలుపులు తీసిన రెండు నిముషముల తరువాత లోపలికి వెళ్ళండి అని చెప్పారు. సాయంత్రం స్థపతి వినాయకుని విగ్రహం తీసుకుని పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చాడు. స్వామి వారు ఒక మంటప నిర్మాణం చేసి, దాని పైన ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించమని చెప్పారు. అది ఎలా ఉండాలి అంటే “అమ్మవారి దృష్టి కాంతి, వినాకుడి దృష్టి కాంతి సమాంతరంగా ఒకటికొకటి కలవాలి” అలా నిర్మాణం చెయ్యవలసిందని చెప్పారు. స్వామి వారు చెప్పినట్టుగానే ఆలయంలో వినాయకుణ్ణి వారి అమ్మగారైన అఖిలాండేశ్వరి ఎదురుగా ప్రతిష్టించారు. ఆగమోక్తంగా ప్రతిష్ట పూజలు నిర్వహించారు. అప్పటి నుండి అర్చకులకు కళ్ళుతిరిగి పడిపోవడం జరుగలేదు. ఇప్పటికీ, అష్టమూర్తి క్షేత్రములలో ఒకటైన, జల లింగ క్షేత్రమైన జంబుకేశ్వరం(తిరువణైకావల్) లోని అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు ఉంటాడు. తల్లి తొలి చూపు తన తొలి బిడ్దడిపై ప్రసరించేట్టుగా పరమాచార్య స్వామి వారు సుముఖుడైన వినాయకుని ప్రతిష్ట చేయించారు. [సాక్షాత్ పరమశివ అవతారులైన ఆదిశంకరాచార్యుల వారు, రాబోవు కాలాములలో ప్రజలు అనుష్టానము లేక, తపశ్శక్తి లేక దేవతా మూర్తుల ఎదురుగుండా నిలబడలేరని గ్రహించి, ఎక్కువగా ఉన్న తేజస్సును లెక్కకట్టి దాన్ని శ్రీచక్రంలోకి తీసి అక్కడే శ్రీచక్ర ప్రతిష్ట చేసారు. జంబుకేశ్వరం జల క్షేత్రం కావటం చేత అమ్మవారి సువర్ణ తాటంకాలలో శ్రీచక్రం వేసి అమ్మవారికి ధరింపచేసారు] --- ఎ. త్యాగరాజన్, చెన్నై - శక్తి వికటన్ ప్రచురణ #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
- నాలుగు నెలలుగా టీచర్ సెలవు మరొక టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఉపాధ్యాయుడు బాధ్యత చేపట్టిన వాలంటీర్ అక్షర సాక్షి /అనంతగిరి,పాడేరు అల్లూరి జిల్లా న్యూస్ డిసెంబర్17 :- అల్లూరి జిల్లా పరిధిలో కొన్ని ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం అనంతగిరి మండలం పెద్దకోట పంచాయితీ వేలమామిడి గ్రామంలో గల పాఠశాలకు గత కొద్ధి రోజులుగా ఉపాధ్యాయులు లేక ఒక వాలంటీర్ ఒక్కడే విద్యార్థులకు విద్య భోదన చేస్తున్నాడు. టీచర్ లేకపోవడం వలన పిల్లలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆ వాలంటీర్ మాట్లాడుతూ ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కు గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అవ్వగా సెలవు పెట్టారని శెలవు పై వెళ్లిపోవడం వలన గత నాలుగు నెలలుగా నేనే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం వలన విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు చెప్పలేకపోతున్నానని, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంత మంది అర్థం చేసుకోలేకపోతున్నారని దీని వలన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వర్యులు పాఠశాలకు ఉపాధ్యాయులును నియమించాల్సిందిగా ఆయన కోరారు. ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉంటే ఒక టీచర్ సెలవు పెట్టినా మరొక టీచర్ వుంటారు కానీ ఈ పాఠశాలకు సంబంధించి ఒకరే టీచర్ వుంటారు. ప్రమాదవశాత్తు ప్రమాదం బారిన పడి విధులకు సెలవు పెట్టిన తరుణంలో అక్కడ మరొక టీచర్ ను నియమించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందా లేదా అనేది ఆశ్చర్యకరంగా మారింది. అనివార్య కారణాల వలన ఆ వాలంటరీ పాఠశాలకు రాకపోతే పిల్లలు పాఠశాలకు వెళ్లే పనే ఉండదు చదువుకు దూరం కాకపోతే ఇంకేం అవుతుంది ఇంకో విషయం ఏమిటంటే 52 మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న వ్యక్తి (వాలంటీర్ ) మాట వింటారా..? అనే కోణంలో ఆలోచించిన విద్యార్థులు చదువుకు దూరం అవుతారు అనేది మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టీచర్ కు ప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు నాలుగు నెలలు సెలవు పెట్టడం ఒకవైపు అయితే నేటి వరకు ఇంకో టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే విషయం సరికొత్త కోణంగానే భావించాలి.మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ పాఠశాలకు నూతన టీచర్ ను నియమించి గిరిజన విద్యార్థులకు విద్య పూర్తి స్థాయిలో అందేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే...?? టీచర్ నియమించకుండా ఉంటే వారు భవిష్యత్తు నాశనం అవ్వడానికి గల కారణం ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నార్థకం.?4
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1
- Post by KLakshmi Devi1
- Post by Rakesh Sirvi1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- జిల్లా అధ్యక్షుడి ముందు మదనపల్లిలో కష్టపడ్డ కార్యకర్తను పక్కకు తోసి అవమానం1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి🙏1