గుంటూరు జిల్లా పోలీస్...* _*//రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్కు చికిత్స నిమిత్తం ₹99,000 ఆర్థిక సహాయం అందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు,.//*_ 🚩 గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న HC 2915 శ్రీ షేక్ నజీక్ గారు, ది.13.02.2026 న అసెంబ్లీ సమావేశాల బందోబస్తు విధులకు హాజరై, అనంతరం గుంటూరులోని తన నివాసానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుండి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు, పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ శాఖ వెల్ఫేర్ ఫండ్ నుండి ₹99,000 (తొంభై తొమ్మిది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ఈ రోజు (10.03.2026) జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన కుమారుడు షేక్ నౌషాద్ అహ్మద్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రమాదాలకు గురైన పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ గారి చికిత్సకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణ నిమిత్తం ప్రయాణించే సమయంలో అన్ని పోలీస్ సిబ్బంది రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ, వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ గారు సూచించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇప్పటికే ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే ద్వారా పోలీస్ సిబ్బంది వినతులు మరియు ఫిర్యాదులను స్వీకరించి వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ పోలీస్ సిబ్బందికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ గారికి మరియు జిల్లా పోలీస్ శాఖకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 👉 ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్.ఐ శ్రీ సురేష్ గారు పాల్గొన్నారు..
గుంటూరు జిల్లా పోలీస్...* _*//రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్కు చికిత్స నిమిత్తం ₹99,000 ఆర్థిక సహాయం అందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు,.//*_ 🚩 గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న HC 2915 శ్రీ షేక్ నజీక్ గారు, ది.13.02.2026 న అసెంబ్లీ సమావేశాల బందోబస్తు విధులకు హాజరై, అనంతరం గుంటూరులోని తన నివాసానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుండి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు, పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ శాఖ వెల్ఫేర్ ఫండ్ నుండి ₹99,000 (తొంభై తొమ్మిది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ఈ రోజు (10.03.2026) జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన కుమారుడు షేక్ నౌషాద్ అహ్మద్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రమాదాలకు గురైన పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ గారి చికిత్సకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణ నిమిత్తం ప్రయాణించే సమయంలో అన్ని పోలీస్ సిబ్బంది రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ, వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ గారు సూచించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇప్పటికే ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే ద్వారా పోలీస్ సిబ్బంది వినతులు మరియు ఫిర్యాదులను స్వీకరించి వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ పోలీస్ సిబ్బందికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ గారికి మరియు జిల్లా పోలీస్ శాఖకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 👉 ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్.ఐ శ్రీ సురేష్ గారు పాల్గొన్నారు..
- पेट्रोल पंप पर बिजली का झटका लगने से दो लोगों की मौत मंचेरियल जिले के दांडेपल्ली मंडल के मेदारीपेट में एक बड़ा हादसा हुआ। सोमवार सुबह एक इंडियन पेट्रोल स्टेशन पर बिजली का झटका लगने से दो लोगों की मौके पर ही मौत हो गई। स्थानीय लोगों के अनुसार, पेट्रोल स्टेशन से एक लंबा लोहे का स्टैंड ले जाते समय मेन लाइन के बिजली के तार स्टैंड से टकराने से दो लोगों की बिजली का झटका लगने से मौत हो गई। मरने वालों की पहचान माधापुर के चल्ला लक्ष्मीनारायण (45) और वेलगानूर के चंदनगिरी नागराजू (40) के रूप में हुई है। दोनों स्थानीय स्तर पर मजदूरी करते हैं। दोनों की मौत से परिवार वाले दुखी हैं। मरने वालों के परिवार वालों ने चिंता जताई है कि यह हादसा बैंक मैनेजमेंट की लापरवाही के कारण हुआ है और उन्होंने मुआवजे की मांग की है। सब-इंस्पेक्टर तहसीनुद्दीन मौके पर पहुंचे, केस दर्ज किया और जानकारी इकट्ठा की।1
- Post by Gift maker1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ మేయర్ గణేష్ నగరంలోని 35, 44వ డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మేయర్ పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన మేయర్ గణేష్, మేడికుంట చెరువును పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మేయర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మేయర్ వెంట సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిపిఐ నాయకులు మరియు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.1
- తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*1
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- వరంగల్ జిల్లా కాజీపేట పరిధిలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనలో పాల్గొన్న పండుగ రాజ్కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, దీక్షలో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించకుండా వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మడికొండ చౌరస్తా సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా గత 15 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని చాలా కాలంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.1
- జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 8,737 మంది విద్యార్థులకు గాను 8,518 మంది హాజరై పరీక్ష రాశారని, 219 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడినట్లు వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు తెలిపారు.1