మేయర్ నోటిఫికేషన్ వెంటనే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వేయాలి- కాంగ్రెస్ నెల్లూరు: గత 16 రోజులుగా గిరిజన నాయకులు మున్సిపల్ మేయర్ నోటిఫికేషన్ వేయా లని చేస్తున్న దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, గిరిజన సంఘాల నేతలు జయ వర్ధన్ రాష్ట్ర గిరిజన నాయకులు కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష మొదటి రోజు కు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా 243 జెడ్ఏ లో పేర్కొన్న విధంగా 30 రోజుల్లో ఖాళీ అయిన మేయర్ స్థానానికి నోటిఫికేషన్ వేయవలసిన బాధ్యత రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ పై ఉందని, స్వయంగా కలిసి ఆమెకు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 243 ఆర్టికల్ ప్రకారము అనేక దశాబ్దాల తర్వాత గతంలో యానాది మహిళకు మేయర్ పదవి వస్తే, ఎన్నో అవమానాలు, వివక్ష ఎదుర్కొన్నారని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తూ చర్యలు తీసుకుంటే, కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, కాంట్రాక్టర్లు, పెత్తందార్ల చెప్పు చేతల్లో ఉండి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు అని అన్నారు. ఓట్ల సమయంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిసి మహిళల వద్ద దొంగ ఏడుపులు ఏడ్చి ఓట్లు దండుకొని, గద్దెనెక్కిన తర్వాత ప్రజలను పీల్చుకు తింటున్నారని లీగల్ సెల్ చైర్మన్ సుధీర్ అన్నారు
మేయర్ నోటిఫికేషన్ వెంటనే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వేయాలి- కాంగ్రెస్ నెల్లూరు: గత 16 రోజులుగా గిరిజన నాయకులు మున్సిపల్ మేయర్ నోటిఫికేషన్ వేయా లని చేస్తున్న దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, గిరిజన సంఘాల నేతలు జయ వర్ధన్ రాష్ట్ర గిరిజన నాయకులు కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష మొదటి రోజు కు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా 243 జెడ్ఏ లో పేర్కొన్న విధంగా 30 రోజుల్లో ఖాళీ అయిన మేయర్ స్థానానికి నోటిఫికేషన్ వేయవలసిన బాధ్యత రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ పై ఉందని, స్వయంగా కలిసి ఆమెకు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 243 ఆర్టికల్ ప్రకారము అనేక దశాబ్దాల తర్వాత గతంలో యానాది మహిళకు మేయర్ పదవి వస్తే, ఎన్నో అవమానాలు, వివక్ష ఎదుర్కొన్నారని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తూ చర్యలు తీసుకుంటే, కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, కాంట్రాక్టర్లు, పెత్తందార్ల చెప్పు చేతల్లో ఉండి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు అని అన్నారు. ఓట్ల సమయంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిసి మహిళల వద్ద దొంగ ఏడుపులు ఏడ్చి ఓట్లు దండుకొని, గద్దెనెక్కిన తర్వాత ప్రజలను పీల్చుకు తింటున్నారని లీగల్ సెల్ చైర్మన్ సుధీర్ అన్నారు
- పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే టిడిపి విధానం - కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు. - మలి విడతగా నేడు 67 అన్న క్యాంటీన్ల ప్రారంభం. - అన్న క్యాంటీన్లు రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తున్నాయి. - గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసింది. - కోవూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీకి పునాది అని, ఆ ఆశయ సాధనలో భాగంగానే పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. అన్న క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి అక్కడే భోజనం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నాడు అన్న ఎన్టీఆర్ ఇచ్చిన కూడు, గూడు, గుడ్డ నినాదమే నేడు పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్ఫూర్తినిచ్చిందన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వీటిని పునరుద్ధరించి రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు.కోవూరులో అన్నా క్యాంటీన్ లేదని గతంలో చాలా బాధపడేదానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో నేడు ఇక్కడ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాల నుంచి ఆసుపత్రి పనుల కోసం, ఇతర అవసరాల కోసం కోవూరు వచ్చే పేదలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సేవలో ముందుంటానని ఆమె స్పష్టం చేశారు. తనకు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.4
- 💐✌️తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐2
- Post by Bondhu Suresh1
- ✒️- ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్కు రైలు ఎక్కాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు. ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£1
- వైయస్ఆర్సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ.....1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- జై కోటంరెడ్డి బ్రదర్స్ ✌️✌️1