*పతాక శీర్షిక న్యూస్* భీమవరంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలుకూటమి ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన పురస్కరించుకొని పతాక శీర్షిక న్యూస్ భీమవరంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు - - ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన పురస్కరించుకొని భీమవరం నియోజకవర్గంలో కూటమి నాయకులు చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి అన్నా క్యాంటీన్ల వద్ద చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేసి స్థానికులతో కలిసి కూటమీ నాయకులు స్థానిక ప్రజలతో కలిసి భోజనాలు చేశారు. భీమవరం పట్టణంలోని వెంకటేశ్వర బదిరల పాఠశాల ప్రాంగణంలో చెవిటి మూగ విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో పిఎసి చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. - ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తెలుగుజాతి రాజకీయాలలో చంద్రబాబు చరిత్ర సృష్టించారని దేశ రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయని నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీ, భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి విజనరీతో నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని విజన్ ఉన్న నేతగా హైదరాబాద్ మహా నగరాన్ని హైటెక్ సిటీ గా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని త్వరలోనే అమరావతి విశ్వనగర రాజధాని నిర్మాణం ద్వారా చంద్రబాబు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందనున్నారని తెలిపారు. టిడిపి రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యుడు, జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ నవ్యాంధ్ర శిల్పి నారా చంద్రబాబు నాయుడు సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించి విద్యార్థి నాయకునిగా ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్లుగా ప్రజాసేవలో జీవిస్తున్న తెలుగుజాతి గర్వించదగ్గ నాయకుడని చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచిత అన్న దాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి అభినందనలు తెలిపారు. టిడిపి మాజీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజన్ 2020 అన్నప్పుడు ఎగతాళి చేశారని నేడు అనుభవిస్తున్న ఐటీ ఫలాలు, హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలే సమాధానం చెబుతున్నాయని చంద్రబాబు నేడు 76 ఏళ్ళ వయసులో డేటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, క్వాంటం వాలి ద్వారా రేపటి తరం భవిష్యత్తు కోసం అపర్ణీసలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 1995 లో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా తాను పరిగెడుతూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ వయసు పైబడిన అదే స్పీడుతో తిరిగి పనిచేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాతగా, నవ్యాంధ్ర నిర్మాతగా తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోతారన్నారు. చంద్రబాబు జన్మదినం పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలలో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారికి రూ 20 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భీమవరం మావుళ్ళమ్మ దేవాలయంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ధర్మకర్తల సమక్షంలో కూటమి నాయకులు చంద్రబాబు గోత్రనామాలతో పూజాలు నిర్వహించిన అనంతరం టిడిపి టౌన్ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము చెల్లబోయిన గోవింద్ ఆధ్వర్యంలో వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ యందు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం పట్టణ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న రోగులకు పాలు,పళ్ళు,రొట్టెలను పంపిణీ చేశారు. గునుపూడి శివాలయం ప్రాంగణంలోని విద్యా గణపతి ఆలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేలూరి శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆయుష్ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ ఎఏంసి చైర్ పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు ఏపీఐఐసీ డైరెక్టర్ జనసేన జిల్లా కార్యదర్శి చనమల్ల చంద్రశేఖర్ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఎండి షబీనా పామర్తి వెంకటరామయ్య భీమవరం పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము చెల్లబోయిన గోవింద్ వీరవాసరం భీమవరం మండలాల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్ వీరవల్లి శ్రీనివాస్ కొయ్యలగడ్డ గణపతి కాళ్ళ సీతారాం తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కోళ్ళ నాగబాబు పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగని రమేష్ ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు దేవాలయ ధర్మకర్తలు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు పాపోలు ఏడుకొండలు మిర్తిపాటి గున్నెశ్వరరావు మల్లువలస రాము బన్ను ప్రసాద్ మీనాక్షి గొంతెన రమణ యండ వెంకట సత్యవతి మాదాసు కనకదుర్గ అంబల్ల జోగేశ్వరి మెంటే గోపి గునుపూటి తిరుపతిరావు మైలబత్తుల ఐజాక్ బాబు మద్దుల మూర్తి తదితరులు పాల్గొన్నారు. - -టిడిపి కార్యాలయం భీమవరం
*పతాక శీర్షిక న్యూస్* భీమవరంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలుకూటమి ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన పురస్కరించుకొని పతాక శీర్షిక న్యూస్ భీమవరంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు - - ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన పురస్కరించుకొని భీమవరం నియోజకవర్గంలో కూటమి నాయకులు చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి అన్నా క్యాంటీన్ల వద్ద చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేసి స్థానికులతో కలిసి కూటమీ నాయకులు స్థానిక ప్రజలతో కలిసి భోజనాలు చేశారు. భీమవరం పట్టణంలోని వెంకటేశ్వర బదిరల పాఠశాల ప్రాంగణంలో చెవిటి మూగ విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో పిఎసి చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. - ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తెలుగుజాతి రాజకీయాలలో చంద్రబాబు చరిత్ర సృష్టించారని దేశ రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయని నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీ, భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి విజనరీతో నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని విజన్ ఉన్న నేతగా హైదరాబాద్ మహా నగరాన్ని హైటెక్ సిటీ గా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని త్వరలోనే అమరావతి విశ్వనగర రాజధాని నిర్మాణం ద్వారా చంద్రబాబు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందనున్నారని తెలిపారు. టిడిపి రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యుడు, జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ నవ్యాంధ్ర శిల్పి నారా చంద్రబాబు నాయుడు సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించి విద్యార్థి నాయకునిగా ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్లుగా ప్రజాసేవలో జీవిస్తున్న తెలుగుజాతి గర్వించదగ్గ నాయకుడని చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచిత అన్న దాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి అభినందనలు తెలిపారు. టిడిపి మాజీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజన్ 2020 అన్నప్పుడు ఎగతాళి చేశారని నేడు అనుభవిస్తున్న ఐటీ ఫలాలు, హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలే సమాధానం చెబుతున్నాయని చంద్రబాబు నేడు 76 ఏళ్ళ వయసులో డేటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, క్వాంటం వాలి ద్వారా రేపటి తరం భవిష్యత్తు కోసం అపర్ణీసలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 1995 లో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా తాను పరిగెడుతూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ వయసు పైబడిన అదే స్పీడుతో తిరిగి పనిచేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాతగా, నవ్యాంధ్ర నిర్మాతగా తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోతారన్నారు. చంద్రబాబు జన్మదినం పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలలో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారికి రూ 20 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భీమవరం మావుళ్ళమ్మ దేవాలయంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ధర్మకర్తల సమక్షంలో కూటమి నాయకులు చంద్రబాబు గోత్రనామాలతో పూజాలు నిర్వహించిన అనంతరం టిడిపి టౌన్ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము చెల్లబోయిన గోవింద్ ఆధ్వర్యంలో వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ యందు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం పట్టణ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న రోగులకు పాలు,పళ్ళు,రొట్టెలను పంపిణీ చేశారు. గునుపూడి శివాలయం ప్రాంగణంలోని విద్యా గణపతి ఆలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేలూరి శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆయుష్ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ ఎఏంసి చైర్ పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు ఏపీఐఐసీ డైరెక్టర్ జనసేన జిల్లా కార్యదర్శి చనమల్ల చంద్రశేఖర్ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఎండి షబీనా పామర్తి వెంకటరామయ్య భీమవరం పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము చెల్లబోయిన గోవింద్ వీరవాసరం భీమవరం మండలాల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్ వీరవల్లి శ్రీనివాస్ కొయ్యలగడ్డ గణపతి కాళ్ళ సీతారాం తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కోళ్ళ నాగబాబు పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగని రమేష్ ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు దేవాలయ ధర్మకర్తలు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు పాపోలు ఏడుకొండలు మిర్తిపాటి గున్నెశ్వరరావు మల్లువలస రాము బన్ను ప్రసాద్ మీనాక్షి గొంతెన రమణ యండ వెంకట సత్యవతి మాదాసు కనకదుర్గ అంబల్ల జోగేశ్వరి మెంటే గోపి గునుపూటి తిరుపతిరావు మైలబత్తుల ఐజాక్ బాబు మద్దుల మూర్తి తదితరులు పాల్గొన్నారు. - -టిడిపి కార్యాలయం భీమవరం
- పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.3
- శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు1
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- manasuloni mata1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1
- పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు. కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.3