*భారత విద్యార్థి ఫెడరేషన్ ; ఎస్ఎఫ్ఐ* _ప్రజ్ఞ వికాసం పరీక్ష బహుతుల ప్రదానం_ *మైలవరం, మార్చి 11, (గళమ్ న్యూస్ )* ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో "ప్రజ్ఞ వికాసం" 10వ తరగతి మోడల్ పరీక్ష ఫిబ్రవరి 9తేదీన మండల వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. పరీక్షా ఫలితాలను అందజేయడం జరిగింది.అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గౌతమ్ (ఇంగ్లీష్ మీడియం) హైస్కూల్ లో బహుమతుల ప్రదానోత్సవం చేయడం జరిగింది.ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్.వెంకటేశ్వరరావు,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.సుధాకర్,యూటీఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం.తిరుపతిరావు,వి.వసంతరావు చేతులమీదుగా అందజేయడం జరిగింది.మండల మొదటి బహులతి టీ.చైత్ర - గౌతమ్ స్కూల్ రెండవ బహుమతి,పి.యామిని -నారాయణ స్కూల్ మూడవ బహుమతి ఎం.మహేష్ - వివేకానంద స్కూల్ నాలుగవ బహుమతి ఎం.సమన్వి - శ్రీ చైతన్య స్కూల్ అలాగే ప్రతి స్కూల్ మొదటి బహుమతు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రానున్న సందర్భంలో విద్యార్థిని,విద్యార్థులు బయపడకుండా బాగా చదివి అత్యధిక మార్కులు సాధించాలని,మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.కార్పొరేటు కాలేజీలలో చేయవద్దు అని,కార్పొరేటు విద్యాసంస్థల ధన ధనధాహానికి బలిపశువులు కావద్దు అని అని విజ్ఞప్తి చేశారు.బహుమతులు అందజేసిన జేఆర్సీ విద్యాసంస్థల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు మధు,సురేష్,ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.మధుసూదన్ రావు,గౌతమ్ స్కూల్ డైరెక్టర్ జి రమేష్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
*భారత విద్యార్థి ఫెడరేషన్ ; ఎస్ఎఫ్ఐ* _ప్రజ్ఞ వికాసం పరీక్ష బహుతుల ప్రదానం_ *మైలవరం, మార్చి 11, (గళమ్ న్యూస్ )* ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో "ప్రజ్ఞ వికాసం" 10వ తరగతి మోడల్ పరీక్ష ఫిబ్రవరి 9తేదీన మండల వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. పరీక్షా ఫలితాలను అందజేయడం జరిగింది.అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గౌతమ్ (ఇంగ్లీష్ మీడియం) హైస్కూల్ లో బహుమతుల ప్రదానోత్సవం చేయడం జరిగింది.ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్.వెంకటేశ్వరరావు,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.సుధాకర్,యూటీఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం.తిరుపతిరావు,వి.వసంతరావు చేతులమీదుగా అందజేయడం జరిగింది.మండల మొదటి బహులతి టీ.చైత్ర - గౌతమ్ స్కూల్ రెండవ బహుమతి,పి.యామిని -నారాయణ స్కూల్ మూడవ బహుమతి ఎం.మహేష్ - వివేకానంద స్కూల్ నాలుగవ బహుమతి ఎం.సమన్వి - శ్రీ చైతన్య స్కూల్ అలాగే ప్రతి స్కూల్ మొదటి బహుమతు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రానున్న సందర్భంలో విద్యార్థిని,విద్యార్థులు బయపడకుండా బాగా చదివి అత్యధిక మార్కులు సాధించాలని,మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.కార్పొరేటు కాలేజీలలో చేయవద్దు అని,కార్పొరేటు విద్యాసంస్థల ధన ధనధాహానికి బలిపశువులు కావద్దు అని అని విజ్ఞప్తి చేశారు.బహుమతులు అందజేసిన జేఆర్సీ విద్యాసంస్థల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు మధు,సురేష్,ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.మధుసూదన్ రావు,గౌతమ్ స్కూల్ డైరెక్టర్ జి రమేష్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
- త్వరలో జరగనున్న పదవ తరగతి చివరి పరీక్షల నేపథ్యంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు ఈ సందర్భంగా పార్కలగండి గిరిజన బాలుర ఆశ్రమపాఠశాల పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమపాఠశాల మల్కారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు భయపడకుండా ధైర్యంగా చదువుకోవాలని సూచించారు ప్రతిరోజూ చదివిన పాఠాలను పునర్విమర్శ చేసుకుంటూ సమయపాలనతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు లక్ష్యంతో చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు ఉపాధ్యాయులతో మాట్లాడిన నేపథ్యంలో పదవతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా ప్రణాళిక ద్వారా వారిని చైతన్యవంతంగా తీర్చిదిద్దాలని తెలిపారు4
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పెద్ద ఎల్లాపురం గ్రామంలో విషాదం నెలకొంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో.. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పని ఒక రైతును రోడ్డున పడేసింది. గ్రామానికి చెందిన రైతు గుండగాని రాజు, తనకున్న పొలంలో ఎంతో ఆశతో మొక్కజొన్న సాగు చేశారు. పంట బాగా పండిందని, ఈసారి మంచి దిగుబడి వస్తుందని సంతోషిస్తున్న తరుణంలో.. కొందరు దుండగులు పంట చేనుకు నిప్పు పెట్టారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో మొక్కజొన్న కంకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయిపొలానికి వెళ్లిన రాజుకు.. కాలిపోయిన పంటను చూసి గుండె తరుక్కుపోయింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన తనకు, ఇప్పుడు మిగిలింది కేవలం బూడిదేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, ఈ అగ్నిప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు గుండగాని రాజు వేడుకుంటున్నారు.1
- తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.1
- 🙏😭1
- దేశాయిపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు ఓ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు, ఇతర అవసరమైన వస్తువులతో కూడిన పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు మరియు సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన Sonu Sood వీడియో కాల్ ద్వారా విద్యార్థులతో మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు. చదువుపై దృష్టి పెట్టాలని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన సూచించారు.1
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుండాగాని రాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో నిప్పు పెట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం, మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం నమోదైనట్టు ఆయన తెలిపారు. పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...... 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి నివేదిక లో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ చండ్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని బెండాలపాడు గ్రామంలో వాటర్ శ్యాంపిల్ లను సేకరించి పరీక్షించారు. వాటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాలికల వసతి గృహం, పాఠశాలను పరిశీలించి విద్యార్థినీలతో ముచ్చటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, అంగన్ వాడి కేంద్రాల భవవనాలని పరిశీలించారు. అధికారులను ఎప్పటికప్పుడు 99 రోజుల ప్రణాళికలో పనులకు సిద్ధంగా ఉండాలని సూచించారు.1
- 🙏😭1
- గంగారం మండలం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో ఓ రైతుకు చెందిన చేనులో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రైతు గుండా గాని రాజుకు చెందిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి సమీపంలోని పొలంలో ఉన్న మొక్కజొన్న కంకులు అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోవడంతో స్థానికులు గమనించారు. అనంతరం గ్రామస్థులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పంటలో కొంత భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన వల్ల రైతు గుండా గాని రాజుకు ఆర్థికంగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. చేనులో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.1