పలు అభివృద్ధి కార్యక్రమాలు,ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న డాక్టర్ తుమ్మల యుగంధర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థలను ప్రారంభించారు.మొదటగా 45వ డివిజన్లోని మయూరి సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన ఖమ్మం గ్యాస్ట్రో హాస్పిటల్ను ప్రారంభించారు. అనంతరం 18వ డివిజన్లో ప్రారంభించిన మణికంఠ టూర్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తరువాత 20వ డివిజన్ మమత రోడ్డులో నిర్మించిన ఆహార వీధి రెస్టారెంట్ను ప్రారంభించారు.25వ డివిజన్లోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్ను ప్రారంభించిన ఆయన,బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన జే కే యం సోలార్ పవర్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.తదనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలుసుకుని సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 47వ డివిజన్లో కాంగ్రెస్ నాయకుడు నాళం సతీష్ ఆధ్వర్యంలో కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల చిరు వ్యాపారులకు అధికారిక పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ,మార్కెట్ చైర్మన్ యారగర్ల హనుమంతరావు,ఖమ్మం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, మహమ్మద్ ఆశ్రిఫ్, రాపర్తి శరత్, తుపాకుల ఏడుకొండలు,మండడపు మనోహరరావు,తుపాకుల శ్రీను,దానాల రమణ, పత్తికొండ శ్రీనివాసులు, ఎల్నాటి కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలు,ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న డాక్టర్ తుమ్మల యుగంధర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థలను ప్రారంభించారు.మొదటగా 45వ డివిజన్లోని మయూరి సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన ఖమ్మం గ్యాస్ట్రో హాస్పిటల్ను ప్రారంభించారు. అనంతరం 18వ డివిజన్లో ప్రారంభించిన మణికంఠ టూర్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తరువాత 20వ డివిజన్ మమత రోడ్డులో నిర్మించిన ఆహార వీధి రెస్టారెంట్ను ప్రారంభించారు.25వ డివిజన్లోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్ను ప్రారంభించిన ఆయన,బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన జే కే యం సోలార్ పవర్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.తదనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలుసుకుని సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 47వ డివిజన్లో కాంగ్రెస్ నాయకుడు నాళం సతీష్ ఆధ్వర్యంలో కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల చిరు వ్యాపారులకు అధికారిక పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ,మార్కెట్ చైర్మన్ యారగర్ల హనుమంతరావు,ఖమ్మం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, మహమ్మద్ ఆశ్రిఫ్, రాపర్తి శరత్, తుపాకుల ఏడుకొండలు,మండడపు మనోహరరావు,తుపాకుల శ్రీను,దానాల రమణ, పత్తికొండ శ్రీనివాసులు, ఎల్నాటి కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1
- *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు1
- గుంటూరు: ప్రత్తిపాడులో అంకమ్మ గుడి సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు టైర్ క్రింద మహిళ పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనలోరెండు కాళ్లు నుజ్జునుజ్ అయ్యాయి.ప్రత్తిపాడు మిరపకాయలకు కూలి పని చేసుకుని బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురి అయిన మహిళ పెదనందిపాడు కు చెందిన బొమ్మతోటి సౌదామని అనే మహిళ గా గుర్తించారు.1
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- Post by కొప్పుల విజయ బాబు10
- వరంగల్ రంగంపేటలోని శ్రీ భద్రకాళి రోడ్పై ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయం, శ్రీ గాయత్రి మాత దేవాలయాల సముదాయంలో ఈ ఉదయం భక్తి వైభవం నెలకొంది. ఆలయ అర్చకులు జి. కార్తిక్ చారి ఆధ్వర్యంలో శ్రీ రామదూత హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం నిర్వహించారు. ఇది 101వ దేవాలయ కార్యక్రమంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆకుతోట బాల కొమురెల్లి స్వామి, మాటేటి సత్యనారాయణ (సత్యం) స్వామి, జగన్మోహన్ రెడ్డి, మూడు నగేష్ స్వామి, లాస్య శ్రీ స్వామి, అరవింద స్వామి, ఎం. రాజేందర్ చారి, జి. కృష్ణ స్వామి, ప్రదీప్, గోపీచంద్, ఆర్. సాత్విక, ఏ. వినయ్, ఈశ్వర్, శిల్ప తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామస్మరణ, రామకీర్తనలు, భజనలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.2
- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- Post by Ramprasad islavath1