*PM విశ్వకర్మ అవగాహన సదస్సు* *ఈ రోజు నెల్లూరు డీకే డబ్ల్యూ కళాశాలలో పీఎం విశ్వకర్మ అవగాహన సదస్సు MSME అసిస్టెంట్ డైరెక్టర్ డి .వీరయ్య గారు వైజాగ్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఏపీ ఎస్ ఎస్ డి సి డిస్టిక్ మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం గారు, ఐ పి పి ఎస్ మేనేజర్ సుధాకర్ గారు, డి ఆర్ డి ఎ. డి పిఎం మధుసూదన్ గారు, చేతివృత్తుల ప్రతినిధి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి గారు, డైరెక్టర్ ఆర్.ఎస్.ఇ.టి.ఐ యూనియన్ బ్యాంక్ కాశయ్యగారు, సి ఎస్ సి డిస్టిక్ మేనేజర్ శ్రీనివాసులు గారు, కెనరా బ్యాంక్ ఎఫ్ ఎల్ సి వి రవిశంకర్ గారు, మరియు డీకే డబ్ల్యూ ప్రిన్సిపల్ గిరి గారు పాల్గొన్నారు. MSME డైరెక్టర్ వీరయ్య గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పీఎం విశ్వకర్మ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఈరోజు నెల్లూరు లో డీకే డబ్ల్యూ ప్రిన్సిపాల్ గిరి గారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సుమారు 300 మంది పీఎం విశ్వకర్మ బెనిఫిషర్స్ రావడం చాలా సంతోషమని, అన్ని వృత్తుల వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.* *తదుపరి పీఎం విశ్వకర్మ ఇంప్లిమెంటేషన్ కమిటీ మెంబర్ మరియు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ 2023 విశ్వకర్మ జయంతి రోజున ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆవిష్కరిం చారనీ,భారత దేశంలో చేతివృత్తిదారులు ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారని వారికి ప్రభుత్వ సాయం అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారాని చేతివృత్తుల వారి తరఫున ముఖ్యంగా ప్రధానమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముఖ్యంగా ఈ పథకం విశ్వకర్మియుల చేతివృత్తులైన కమ్మర, వడ్రంగి, కంచర, శిల్పి, స్వర్ణకార వృత్తుల తో పాటు, టైలరింగ్, రజక, మేస్త్రి, బుట్టలు అల్లే వారికి, వలలు చేసేవారికి మొత్తం 18 రకాల కుల సంప్రదాయ వృత్తుల వారు అప్లై చేసుకోవచ్చని, అప్లై చేసుకున్న లబ్ది దారులందరికి ఒక వారం పాటు వృత్తి ట్రైనింగు, ఆ సమయంలో స్టైఫండ్ రూపంలో నాలుగు వేల రూపాయలు మరియు 15 వేల రూపాయలు విలువ చేసే పనిముట్లు ఉచితంగా అందజేశారన్నారు.* *ట్రైనింగ్ అయిన తర్వాత బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకు వారు రుణాలు కల్పిస్తున్నారని తెలిపారు. సమావేశానికి విచ్చేసిన లబ్ధిదారులు అనేక రకాల సమస్యల గురించి వెంకట శేషయ్య ఆచారి గారు ప్రతి ఒక్కరికి సమాధానం తెలియజేస్తూ, సమస్యల సాధనకు తొందరలో కలెక్టర్ గారిని కలిసి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.*
*PM విశ్వకర్మ అవగాహన సదస్సు* *ఈ రోజు నెల్లూరు డీకే డబ్ల్యూ కళాశాలలో పీఎం విశ్వకర్మ అవగాహన సదస్సు MSME అసిస్టెంట్ డైరెక్టర్ డి .వీరయ్య గారు వైజాగ్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఏపీ ఎస్ ఎస్ డి సి డిస్టిక్ మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం గారు, ఐ పి పి ఎస్ మేనేజర్ సుధాకర్ గారు, డి ఆర్ డి ఎ. డి పిఎం మధుసూదన్ గారు, చేతివృత్తుల ప్రతినిధి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి గారు, డైరెక్టర్ ఆర్.ఎస్.ఇ.టి.ఐ యూనియన్ బ్యాంక్ కాశయ్యగారు, సి ఎస్ సి డిస్టిక్ మేనేజర్ శ్రీనివాసులు గారు, కెనరా బ్యాంక్ ఎఫ్ ఎల్ సి వి రవిశంకర్ గారు, మరియు డీకే డబ్ల్యూ ప్రిన్సిపల్ గిరి గారు పాల్గొన్నారు. MSME డైరెక్టర్ వీరయ్య గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పీఎం విశ్వకర్మ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఈరోజు నెల్లూరు లో డీకే డబ్ల్యూ ప్రిన్సిపాల్ గిరి గారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సుమారు 300 మంది పీఎం విశ్వకర్మ బెనిఫిషర్స్ రావడం చాలా సంతోషమని, అన్ని వృత్తుల వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.* *తదుపరి పీఎం విశ్వకర్మ ఇంప్లిమెంటేషన్ కమిటీ మెంబర్ మరియు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ 2023 విశ్వకర్మ జయంతి రోజున ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆవిష్కరిం చారనీ,భారత దేశంలో చేతివృత్తిదారులు ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారని వారికి ప్రభుత్వ సాయం అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారాని చేతివృత్తుల వారి తరఫున ముఖ్యంగా ప్రధానమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముఖ్యంగా ఈ పథకం విశ్వకర్మియుల చేతివృత్తులైన కమ్మర, వడ్రంగి, కంచర, శిల్పి, స్వర్ణకార వృత్తుల తో పాటు, టైలరింగ్, రజక, మేస్త్రి, బుట్టలు అల్లే వారికి, వలలు చేసేవారికి మొత్తం 18 రకాల కుల సంప్రదాయ వృత్తుల వారు అప్లై చేసుకోవచ్చని, అప్లై చేసుకున్న లబ్ది దారులందరికి ఒక వారం పాటు వృత్తి ట్రైనింగు, ఆ సమయంలో స్టైఫండ్ రూపంలో నాలుగు వేల రూపాయలు మరియు 15 వేల రూపాయలు విలువ చేసే పనిముట్లు ఉచితంగా అందజేశారన్నారు.* *ట్రైనింగ్ అయిన తర్వాత బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకు వారు రుణాలు కల్పిస్తున్నారని తెలిపారు. సమావేశానికి విచ్చేసిన లబ్ధిదారులు అనేక రకాల సమస్యల గురించి వెంకట శేషయ్య ఆచారి గారు ప్రతి ఒక్కరికి సమాధానం తెలియజేస్తూ, సమస్యల సాధనకు తొందరలో కలెక్టర్ గారిని కలిసి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.*
- Post by Anji Raju1
- జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలకు అభిమానులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను..1
- కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజులుగా వివాదాస్పదంగా మారిన జనసేన పార్టీ జెండా అంశం ఉత్కంఠభరితంగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణతో కలిసి జెండాను ఎగురవేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జెండా ఏర్పాటు చేయడంపై రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైఎస్ఆర్సిపి నేతల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా, రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, “జనసేన జెండాపై ఎవరైనా చెయ్యేస్తే జనసైనికులు, వీర మహిళలు చూస్తూ ఊరుకోరు” అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో జనసేన తన బలం చూపిందని, పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.4
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పం డీఎస్పీ పార్థసారథి , సిఐ కుప్పం రూరల్ మల్లేష్ యాదవ్ , రాళ్ళబుదుగూరు ఎస్ఐ నరేష్ రామకుప్పం ఎస్ఐ వెంకట మోహన్ మరియు పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ *“వజ్రపహర్”* కార్యక్రమంలో భాగంగా పిఇఎస్ కళాశాల ఎదురుగా ఉన్న పీజీ హాస్టల్స్ ను తనిఖీ చేయడం జరిగింది. పీజీ హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు గాంజా / డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. • యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు సూచించడం జరిగింది. • అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది.1
- లేపాక్షి మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మండల సీనియర్ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి, ప్రజా సేవలో ముందుకు సాగాలని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య.. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.1
- నాలుగేళ్లు ఇస్తానని చెప్పి ఐదేళ్లు రైతు భరోసా అందించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. పీఎం కిసాన్ కాకుండా 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పి తొలి ఏడాది ఎగ్గొట్టాడు చంద్రబాబు. ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. -ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్)1
- లక్కిరెడ్డిపల్లి మండలం మర్రిచెట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఇన్నోవా కారు టైరు పగిలి అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులోని ముగ్గురు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. స్థానికులు క్షతగాత్రులను రాయచోటి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం వైద్యులు వారిని కడపకు రిఫర్ చేశారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం లక్కవరం గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న శృతి అనే 8 ఏళ్ళ బాలికపై అదే గ్రామానికి చెందిన 44 ఏళ్ల మేడిది నాగబాబు అత్యాచార ప్రయత్నం చేశారు. బాలికను ఇంటి పక్క ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్ళి1