logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పోలవరం జిల్లాలోని ఎటపాక మండలంలో ఆదివాసీల భూములు నాన్-ట్రైబల్స్ హస్తగతం కావడంపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఎటపాక మండల కేంద్రంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన ఏజెన్సీ ప్రాంతాలలో చట్టాలు నీరుగారిపోతున్నాయని, ఆదివాసుల భూములపై సర్వహక్కులు అనుభవిస్తూ నాన్-ట్రైబల్స్ రాజ్యమేలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎటపాక మండల పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, నిరుపేద ఆదివాసీల పట్టా భూములు సైతం అక్రమ కబ్జాలకు గురయ్యాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీని నియమించి, సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్వం ఏజెన్సీ ప్రాంతాల్లోని అమాయక ఆదివాసీ పెద్దల అజ్ఞానాన్ని, చదువుకోని తనాన్ని ఆసరాగా చేసుకుని నాన్-ట్రైబల్స్ తొలుత కవులు (లీజు) పేర్లతో భూముల్లోకి ప్రవేశించారని కుంజ శ్రీను వివరించారు. ఆ తర్వాత స్థానిక రెవెన్యూ, సెటిల్మెంట్ అధికారులను పూర్తిగా మేనేజ్ చేసి రికార్డులను ఇష్టారాజ్యంగా తారుమారు చేయించారని మండిపడ్డారు. తద్వారా తరతరాలుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీల సొంత పట్టా భూములను సైతం నాన్-ట్రైబల్స్ అక్రమంగా తమ పేర్ల పైకి మార్చుకున్నారని ఆధారాలతో సహా నిరూపించారు. గిరిజనేతరులకు భూ బదలాయింపులను పూర్తిగా నిషేధించే ఎల్‌టిఆర్ 1/70 చట్టం అత్యంత కఠినంగా అమలులో ఉన్నప్పటికీ, గత పది సంవత్సరాల కాలంలో వందలాది ఎకరాల ఆదివాసీల భూములు నాన్-ట్రైబల్స్ పరం కావడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి నెట్‌వర్క్ దాగి ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు ఎటపాక మండలంలో నాన్-ట్రైబల్స్ పేర్లపై నమోదైన భూములు, వారికి జారీ చేసిన పట్టాలపై ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కుంజ శ్రీను పట్టుబట్టారు. కొంతమంది అవినీతి అధికారులు ముడుపులకు ఆశపడి రికార్డులలోని అసలైన ఆదివాసీల పేర్లను క్రమంగా తొలగించారని, దీనివల్ల ప్రస్తుతం కొంతమంది ఆదివాసీలు క్షేత్రస్థాయిలో భూమిపై ఉండి సాగు చేసుకుంటున్నప్పటికీ, వారికి ఎటువంటి అధికారిక హక్కు పత్రాలు లేకపోవడం అత్యంత శోచనీయమని ఆయన అన్నారు. రికార్డులలో పేర్లు లేకపోవడాన్ని అదనుగా చూసుకుని నాన్-ట్రైబల్స్ గూండాలతో ఆదివాసీల భూములను కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాలో ఉన్న ప్రతి ఇంచు భూమిని వెనక్కి తీసుకుని భూమి లేని నిరుపేద ఆదివాసీలకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ఈ అన్యాయంపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కుంజ శ్రీను ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఎస్‌పీ నాయకులు, కార్యకర్తలు కుర్సం నాగేష్, పూసం చంటి, పెనుబల్లి నాగేష్, కుర్సం కృష్ణతో పాటు భారీ సంఖ్యలో ఆదివాసీ బాధితులు పాల్గొన్నారు.

1 hr ago
user_Sode Prasad
Sode Prasad
Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
627c73ec-0565-4eb8-bf19-06a7652f39c7

పోలవరం జిల్లాలోని ఎటపాక మండలంలో ఆదివాసీల భూములు నాన్-ట్రైబల్స్ హస్తగతం కావడంపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఎటపాక మండల కేంద్రంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన ఏజెన్సీ ప్రాంతాలలో చట్టాలు నీరుగారిపోతున్నాయని, ఆదివాసుల భూములపై సర్వహక్కులు అనుభవిస్తూ నాన్-ట్రైబల్స్ రాజ్యమేలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎటపాక మండల పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, నిరుపేద ఆదివాసీల పట్టా భూములు సైతం అక్రమ కబ్జాలకు గురయ్యాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీని నియమించి, సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్వం ఏజెన్సీ ప్రాంతాల్లోని అమాయక ఆదివాసీ పెద్దల అజ్ఞానాన్ని, చదువుకోని తనాన్ని ఆసరాగా చేసుకుని నాన్-ట్రైబల్స్ తొలుత కవులు (లీజు) పేర్లతో భూముల్లోకి ప్రవేశించారని కుంజ శ్రీను వివరించారు. ఆ తర్వాత స్థానిక రెవెన్యూ, సెటిల్మెంట్ అధికారులను పూర్తిగా మేనేజ్ చేసి రికార్డులను ఇష్టారాజ్యంగా తారుమారు చేయించారని మండిపడ్డారు. తద్వారా తరతరాలుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీల సొంత పట్టా భూములను సైతం నాన్-ట్రైబల్స్ అక్రమంగా తమ పేర్ల పైకి మార్చుకున్నారని ఆధారాలతో సహా నిరూపించారు. గిరిజనేతరులకు భూ బదలాయింపులను పూర్తిగా నిషేధించే ఎల్‌టిఆర్ 1/70 చట్టం అత్యంత కఠినంగా అమలులో ఉన్నప్పటికీ, గత పది సంవత్సరాల కాలంలో వందలాది ఎకరాల ఆదివాసీల భూములు నాన్-ట్రైబల్స్ పరం కావడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి నెట్‌వర్క్ దాగి ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు ఎటపాక మండలంలో నాన్-ట్రైబల్స్ పేర్లపై నమోదైన భూములు, వారికి జారీ చేసిన పట్టాలపై ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కుంజ శ్రీను పట్టుబట్టారు. కొంతమంది అవినీతి అధికారులు ముడుపులకు ఆశపడి రికార్డులలోని అసలైన ఆదివాసీల పేర్లను క్రమంగా తొలగించారని, దీనివల్ల ప్రస్తుతం కొంతమంది ఆదివాసీలు క్షేత్రస్థాయిలో భూమిపై ఉండి సాగు చేసుకుంటున్నప్పటికీ, వారికి ఎటువంటి అధికారిక హక్కు పత్రాలు లేకపోవడం అత్యంత శోచనీయమని ఆయన అన్నారు. రికార్డులలో పేర్లు లేకపోవడాన్ని అదనుగా చూసుకుని నాన్-ట్రైబల్స్ గూండాలతో ఆదివాసీల భూములను కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాలో ఉన్న ప్రతి ఇంచు భూమిని వెనక్కి తీసుకుని భూమి లేని నిరుపేద ఆదివాసీలకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ఈ అన్యాయంపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కుంజ శ్రీను ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఎస్‌పీ నాయకులు, కార్యకర్తలు కుర్సం నాగేష్, పూసం చంటి, పెనుబల్లి నాగేష్, కుర్సం కృష్ణతో పాటు భారీ సంఖ్యలో ఆదివాసీ బాధితులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామానికి చెందిన 35 ఏళ్ల వంశీ పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, మణుగూరు మండలం సాంబాయిగూడెం నుండి రామానుజవరం వరకు రహదారిపై అడ్డంగా నిలిపిన ఇసుక లారీలు అంబులెన్స్‌కు సైతం దారి ఇవ్వలేదు. దీంతో కుటుంబ సభ్యులు వంశీని తమ భుజాలపై మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. భుజాలపై మోసుకుని వెళ్లేసరికే వంశీ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేవలం అరగంట ముందు తీసుకువచ్చి ఉంటే వంశీ బతికేవాడని వైద్యులు స్పష్టం చేశారు. ఇసుక లారీలు రహదారిని అడ్డుకోవడంతోనే వంశీ మృతి చెందాడని, ఇసుక మాఫియా అక్రమాలకు నిండు ప్రాణం బలైందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామానికి చెందిన 35 ఏళ్ల వంశీ పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, మణుగూరు మండలం సాంబాయిగూడెం నుండి రామానుజవరం వరకు రహదారిపై అడ్డంగా నిలిపిన ఇసుక లారీలు అంబులెన్స్‌కు సైతం దారి ఇవ్వలేదు. దీంతో కుటుంబ సభ్యులు వంశీని తమ భుజాలపై మోసుకుని వెళ్లాల్సి వచ్చింది.

భుజాలపై మోసుకుని వెళ్లేసరికే వంశీ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేవలం అరగంట ముందు తీసుకువచ్చి ఉంటే వంశీ బతికేవాడని వైద్యులు స్పష్టం చేశారు. ఇసుక లారీలు రహదారిని అడ్డుకోవడంతోనే వంశీ మృతి చెందాడని, ఇసుక మాఫియా అక్రమాలకు నిండు ప్రాణం బలైందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఏఐటీయూసీ యూనియన్ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొన్న సందర్భంగా కోణంనేని సాంబశివరావు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొగ్గు చోరీ జరిగిందని కార్మిక వర్గాల్లో అయోమయం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బొగ్గును ఎవరు దోచుకుపోతారు, ఎందుకు దోచుకుపోతారని ప్రశ్నించిన కోణంనేని, 40 మిలియన్ల బొగ్గు, 40 లక్షల టన్నుల బొగ్గును దోచుకోవడం సాధ్యమేనా అని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పదే పదే కుంభకోణం ఆరోపణలను ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అడుగులకు బీజేపీ పార్టీ మడుగులోతుతోందని, కోతిని చూసి నక్క గిక్కున్నట్లుగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన తీవ్ర విమర్శ చేశారు. ఇప్పటికే సింగరేణి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన కోణంనేని, కొత్త మైనింగ్ ల కోసం అందరూ సహకరించాలని కోరుతూ కార్మిక కుటుంబాలను రోడ్డున పడే విధంగా చూస్తున్నారని మండిపడ్డారు. పదే పదే మైనింగ్ ప్రాంతాల్లో పర్యటిస్తూ బొగ్గు చోరీ జరిగిందంటూ కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా న్యాయమైన బొగ్గును అమ్మడానికే చూస్తుంది గానీ, చోరీ చేయదని స్పష్టం చేస్తూ, బీఆర్ఎస్, బీజేపీ మాయమాటలను కార్మికులు నమ్మే పరిస్థితి లేదని కోణంనేని సాంబశివరావు అన్నారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఏఐటీయూసీ యూనియన్ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొన్న సందర్భంగా కోణంనేని సాంబశివరావు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొగ్గు చోరీ జరిగిందని కార్మిక వర్గాల్లో అయోమయం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బొగ్గును ఎవరు దోచుకుపోతారు, ఎందుకు దోచుకుపోతారని ప్రశ్నించిన కోణంనేని, 40 మిలియన్ల బొగ్గు, 40 లక్షల టన్నుల బొగ్గును దోచుకోవడం సాధ్యమేనా అని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పదే పదే కుంభకోణం ఆరోపణలను ఖండించారు.

బీఆర్ఎస్ పార్టీ అడుగులకు బీజేపీ పార్టీ మడుగులోతుతోందని, కోతిని చూసి నక్క గిక్కున్నట్లుగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన తీవ్ర విమర్శ చేశారు. ఇప్పటికే సింగరేణి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన కోణంనేని, కొత్త మైనింగ్ ల కోసం అందరూ సహకరించాలని కోరుతూ కార్మిక కుటుంబాలను రోడ్డున పడే విధంగా చూస్తున్నారని మండిపడ్డారు. పదే పదే మైనింగ్ ప్రాంతాల్లో పర్యటిస్తూ బొగ్గు చోరీ జరిగిందంటూ కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా న్యాయమైన బొగ్గును అమ్మడానికే చూస్తుంది గానీ, చోరీ చేయదని స్పష్టం చేస్తూ, బీఆర్ఎస్, బీజేపీ మాయమాటలను కార్మికులు నమ్మే పరిస్థితి లేదని కోణంనేని సాంబశివరావు అన్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • పోలవరం మండలంలోని నూతనగూడెంలో బండి మునేశ్వరరావు ఇంట్లోని బావిలో పూడిక తీస్తుండగా ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి చెందారు. గణేష్ నగర్ కు చెందిన రాజుతో పాటు పైడిపాక పునరావాస కాలనీకి చెందిన బండి వీర వెంకటరావు, చిట్టిబాబు అలియాస్ రెడ్డి ఈ పని నిమిత్తం వచ్చారు. మొదట చిట్టిబాబు బావిలోకి దిగి ఊపిరాడటం లేదని కేకలు వేయడంతో, అతడిని రక్షించేందుకు వీర వెంకటరావు కూడా బావిలోకి దిగాడు. ఇద్దరూ లోపల ఉండి కేకలు వేయడంతో, స్థానికులు తాడు సహాయంతో వారిని పైకి లాగేందుకు ప్రయత్నించినప్పటికీ అది విఫలమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలవరం సీఐ కృష్ణకుమార్, ఎస్సై అప్పారావు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
    1
    పోలవరం మండలంలోని నూతనగూడెంలో బండి మునేశ్వరరావు ఇంట్లోని బావిలో పూడిక తీస్తుండగా ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి చెందారు. గణేష్ నగర్ కు చెందిన రాజుతో పాటు పైడిపాక పునరావాస కాలనీకి చెందిన బండి వీర వెంకటరావు, చిట్టిబాబు అలియాస్ రెడ్డి ఈ పని నిమిత్తం వచ్చారు. మొదట చిట్టిబాబు బావిలోకి దిగి ఊపిరాడటం లేదని కేకలు వేయడంతో, అతడిని రక్షించేందుకు వీర వెంకటరావు కూడా బావిలోకి దిగాడు. ఇద్దరూ లోపల ఉండి కేకలు వేయడంతో, స్థానికులు తాడు సహాయంతో వారిని పైకి లాగేందుకు ప్రయత్నించినప్పటికీ అది విఫలమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలవరం సీఐ కృష్ణకుమార్, ఎస్సై అప్పారావు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో, తాసిల్దార్ మరియు ఎమ్మార్వో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో SIR ప్రోగ్రాంపై ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వార్డు నెంబర్లు, సర్పంచులు, మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. BLO (బూత్ లెవల్ ఆఫీసర్లు) మరియు BLA (బూత్ లెవల్ ఏజెంట్లు)లకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.
    4
    ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో, తాసిల్దార్ మరియు ఎమ్మార్వో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో SIR ప్రోగ్రాంపై ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వార్డు నెంబర్లు, సర్పంచులు, మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. BLO (బూత్ లెవల్ ఆఫీసర్లు) మరియు BLA (బూత్ లెవల్ ఏజెంట్లు)లకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వివాహ మహోత్సవం సందర్భంగా, ఆయనకు, ఆయన దంపతులకు నియోజకవర్గం తరఫున వివాహ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, మరియు పలువురు నాయకులు కలిసి ఈ శుభ సందర్భంలో తమ అభినందనలను తెలియజేశారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వివాహ మహోత్సవం సందర్భంగా, ఆయనకు, ఆయన దంపతులకు నియోజకవర్గం తరఫున వివాహ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, మరియు పలువురు నాయకులు కలిసి ఈ శుభ సందర్భంలో తమ అభినందనలను తెలియజేశారు.
    user_Ajmera Sunitha
    Ajmera Sunitha
    Electrician పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • సత్తుపల్లి సింగరేణిలోని జేవియర్ ఓసి కిష్టారంతో పాటు జిఎం కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎం చింతల శ్రీనివాస్ గారు, ఎస్ ఓ టూ జిఎం శ్రీ బొల్లం శ్రీనివాస్ గారు, ఏరియా ఇంజనీర్ కె సోమశేఖర్ రావు గారు, జే వి ఆర్ ఓ సి ప్రాజెక్టు అధికారి ఏ ఎల్ ఎస్ వి సునీల్ వర్మ గారు, జే వి ఆర్ సి హెచ్ పి ఇన్చార్జి శ్రీ సాయినాథ్ గారితో పాటు ఉద్యోగ కార్మికులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    4
    సత్తుపల్లి సింగరేణిలోని జేవియర్ ఓసి కిష్టారంతో పాటు జిఎం కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎం చింతల శ్రీనివాస్ గారు, ఎస్ ఓ టూ జిఎం శ్రీ బొల్లం శ్రీనివాస్ గారు, ఏరియా ఇంజనీర్ కె సోమశేఖర్ రావు గారు, జే వి ఆర్ ఓ సి ప్రాజెక్టు అధికారి ఏ ఎల్ ఎస్ వి సునీల్ వర్మ గారు, జే వి ఆర్ సి హెచ్ పి ఇన్చార్జి శ్రీ సాయినాథ్ గారితో పాటు ఉద్యోగ కార్మికులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Sudhakar kota
    Sudhakar kota
    Photographer పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో ఒక విద్యార్థిని నీట్ పరీక్ష రాయడానికి అనుమతించలేదు. ఈ పరిణామంతో విద్యార్థి తండ్రి పడిన ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
    1
    ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో ఒక విద్యార్థిని నీట్ పరీక్ష రాయడానికి అనుమతించలేదు. ఈ పరిణామంతో విద్యార్థి తండ్రి పడిన ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
    user_Chandu
    Chandu
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.