Shuru
Apke Nagar Ki App…
*కళ్లలో కారం కొట్టి బంగారం చోరీకి యత్నించిన గుజరాత్ మహిళ, చితకబాదిన జువెలరీ షాపు యజమాని* గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న ఓ జువెలరీ షాపులో నగల చోరీకి మహిళ విఫలయత్నం చేయగా, సంబంధిత వీడియో వైరల్గా మారింది. కస్టమర్లా నటిస్తూ షాపులోకి వచ్చిన ఆ మహిళ మాటలు కలిపి ఒక్కసారిగా షాపు యజమాని కళ్లపై కారం కొట్టింది. వెంటనే అతడు ఆమెను పట్టుకుని 15 సెకన్లలో 17 సార్లు బలంగా చెంపదెబ్బలు కొట్టి, షాపులోంచి గెంటేశాడు. పోలీసులు వచ్చే లోపే సదరు మహిళ పారిపోగా, ఆమె కోసం వారు గాలిస్తున్నారు.
Golem Venkatesham Patel
*కళ్లలో కారం కొట్టి బంగారం చోరీకి యత్నించిన గుజరాత్ మహిళ, చితకబాదిన జువెలరీ షాపు యజమాని* గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న ఓ జువెలరీ షాపులో నగల చోరీకి మహిళ విఫలయత్నం చేయగా, సంబంధిత వీడియో వైరల్గా మారింది. కస్టమర్లా నటిస్తూ షాపులోకి వచ్చిన ఆ మహిళ మాటలు కలిపి ఒక్కసారిగా షాపు యజమాని కళ్లపై కారం కొట్టింది. వెంటనే అతడు ఆమెను పట్టుకుని 15 సెకన్లలో 17 సార్లు బలంగా చెంపదెబ్బలు కొట్టి, షాపులోంచి గెంటేశాడు. పోలీసులు వచ్చే లోపే సదరు మహిళ పారిపోగా, ఆమె కోసం వారు గాలిస్తున్నారు.
- Naresh AjmeraPenchicalpet, Kumuram Bheem Asifabad👏on 28 November
- User5635Anantapur, Andhra Pradesh🤝on 15 November
- User3260Srikakulam, Andhra Pradesh👏on 12 November
- User4459Telangana😤on 12 November
- Nari GoldAddateegala, Alluri Sitharama Raju😂on 11 November
More news from తెలంగాణ and nearby areas
- సిర్పూర్ టౌన్ మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా కార్మికులు పనిస్థలాల్లో బ్లాక్ డేగా నిరసనలు చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు. విద్యుత్ సవరణ బిల్లు-2022ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోడ్లను రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- తెలంగాణ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్య తండాకు చెందిన బోడ స్రవంతి, ప్రవీణ్ దంపతులు హైదరాబాదులో బతుకుతెరువు కోసం వెళ్లి, కూకట్పల్లిలో ఇద్దరు పిల్లలను చంపి, స్రవంతి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో మృతురాలి స్వగ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భర్త వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ, భర్త ఇంటిని, ఫర్నిచర్ను తగలబెట్టారు.1
- బెల్లంపల్లి భుచియపల్లి 100 రోజుల పని daggara thabelu kanabadindi chudandi frinds endrikaya varsanikichani poyindi adavilo chanipoyindi endrikichha thabelu brathike vundi water lo ledu in..............................1
- లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుండి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.1
- *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి* కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు4
- ఉన్నది మొత్తం రెండు పాములు కనిపించాయి ఒకటి ప్రాణాలతో తప్పించుకుంది మరొకటి చనిపోయింది,తప్పించుకున్న పాము సుమారుగా ఇదే సైజ్ ఉండచ్చు అని అంచనా అటు వైపు చేను పనులకు వెళ్ళే వారు ,చెరువులో చేపలు పట్టేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సీపీఎం నేతలు అంతర్జాతీయ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, యుద్ధం వెంటనే ఆపి శాంతి చర్చలు ప్రారంభించాలని కోరారు. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత్ వంటి దేశాలు దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.2