తెలంగాణ ఉద్యమ కారుల హామీలను వెంటనే అమలు చేయాలి.. ప్రో. కోదండరాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమ కారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ఉద్యమకారులు సంఘటితంగా పోరాడాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఉద్యమ కారుల జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి , ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఉద్యమ కారుల జెఏసి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జెఏసి జిల్లా ఇంచార్జీ పిడమర్తి లింగయ్య అధ్యక్షతన రాష్ట్ర మహాసభ జరిగింది.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని ఏ ఒక్కరి వలనో ఏర్పాటు కాలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమకాలకు సంక్షేమ బోర్డు ను వెంటనే ఏర్పాటు చేయాలని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయుటకు ప్రభుత్వం కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో 1200 మంది అమరులైతే 400 మందినే గత ప్రభుత్వం ఆదుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట ప్రాంతం ఎంతో చైతన్యవంతమైందని పేర్కొన్నారు. ఉద్యమకారుల హామీలను అమలు చేయకపోతే అసెంబ్లీ ను ముట్టడించాలని హెచ్చరించారు.తెలంగాణ సాయుధ పోరాటం తరహాలో ఉద్యమించాలని తెలంగాణ ఉద్యమ సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను జంగు సిపాయి ఉద్యమకారులుగా గుర్తించాలని, ఉద్యమకారులపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంకుశ ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యాంశంను చేర్చాలని, మారోజు వీరన్న స్మృతి వనంను ఏర్పాటు చేయాలని, కేజీ నుంచి కేజీ వరకు ఉచిత విద్య, వైద్యం ను, ఖాయిలపడ్డ పరిశ్రమలను పునరుద్దరించాలని మహాసభలో తీర్మానించారు. కార్యక్రంలో టి యు జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కంచర్ల బద్రి, చారువాక, జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ బైరాగి, తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు వేముల యాదగిరి, తెలంగాణ ఉద్యమ కారులు చెరుకు సుధాకర్, బహుజన గాయకురాలు విమలక్క, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తాడోజు వాణి,సిఇవో తాడోజు శ్రీకాంత్ రాజు, డాక్టర్ పృథ్వి రాజ్ యాదవ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కె, ధర్మార్జున్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్థన్, ఆరాధ్య పౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొడుగు శ్రీధర్, ఉద్యమకారుల మహిళా వేదిక రాష్ట్ర కన్వీనర్ బాకారం లావణ్య, బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ భద్ర బోయిన సైదులు, ఉద్యమకారుల జెఏసి నాయకురాలు గోనె విజయ, కట్ట రాజన్న, యూసుఫ్ షరీఫ్, దయాకర్, ఎస్ కే సయ్యద్, గాయకులు దరువు అంజన్న,సురేష్ మహజన్,సుక్క రామనర్సయ్య,తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ ఉద్యమ కారుల హామీలను వెంటనే అమలు చేయాలి.. ప్రో. కోదండరాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమ కారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ఉద్యమకారులు సంఘటితంగా పోరాడాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఉద్యమ కారుల జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి , ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఉద్యమ కారుల జెఏసి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జెఏసి జిల్లా ఇంచార్జీ పిడమర్తి లింగయ్య అధ్యక్షతన రాష్ట్ర మహాసభ జరిగింది.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని ఏ ఒక్కరి వలనో ఏర్పాటు కాలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమకాలకు సంక్షేమ బోర్డు ను వెంటనే ఏర్పాటు చేయాలని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన
హామీలు వెంటనే అమలు చేయుటకు ప్రభుత్వం కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో 1200 మంది అమరులైతే 400 మందినే గత ప్రభుత్వం ఆదుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట ప్రాంతం ఎంతో చైతన్యవంతమైందని పేర్కొన్నారు. ఉద్యమకారుల హామీలను అమలు చేయకపోతే అసెంబ్లీ ను ముట్టడించాలని హెచ్చరించారు.తెలంగాణ సాయుధ పోరాటం తరహాలో ఉద్యమించాలని తెలంగాణ ఉద్యమ సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను జంగు సిపాయి ఉద్యమకారులుగా గుర్తించాలని, ఉద్యమకారులపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంకుశ ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యాంశంను చేర్చాలని, మారోజు వీరన్న స్మృతి వనంను ఏర్పాటు చేయాలని, కేజీ నుంచి కేజీ వరకు ఉచిత విద్య, వైద్యం ను, ఖాయిలపడ్డ పరిశ్రమలను పునరుద్దరించాలని మహాసభలో తీర్మానించారు. కార్యక్రంలో టి యు జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, రాష్ట్ర
అధికార ప్రతినిధి కంచర్ల బద్రి, చారువాక, జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ బైరాగి, తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు వేముల యాదగిరి, తెలంగాణ ఉద్యమ కారులు చెరుకు సుధాకర్, బహుజన గాయకురాలు విమలక్క, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తాడోజు వాణి,సిఇవో తాడోజు శ్రీకాంత్ రాజు, డాక్టర్ పృథ్వి రాజ్ యాదవ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కె, ధర్మార్జున్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్థన్, ఆరాధ్య పౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొడుగు శ్రీధర్, ఉద్యమకారుల మహిళా వేదిక రాష్ట్ర కన్వీనర్ బాకారం లావణ్య, బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ భద్ర బోయిన సైదులు, ఉద్యమకారుల జెఏసి నాయకురాలు గోనె విజయ, కట్ట రాజన్న, యూసుఫ్ షరీఫ్, దయాకర్, ఎస్ కే సయ్యద్, గాయకులు దరువు అంజన్న,సురేష్ మహజన్,సుక్క రామనర్సయ్య,తదితరులు పాల్గొన్నారు
- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1
- - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? - ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? - కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? - ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? - పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? - రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. - ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. - ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. - వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న - ఈటల రాజేందర్.1
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- గజ్వేల్ మున్సిపల్లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు1
- పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పమిడిపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు2
- కరాటే పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన కరాటే పోటీలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆటలు, ధ్యానం వంటివి వారి మేధస్సును మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. పాఠశాల నుండి వచ్చిన తర్వాత పిల్లలకు సమయం కేటాయించి, సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన సూచించారు.1
- Post by Paramesh Ratnagiri1
- చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* *మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.1