ఆ ఇద్దరితో పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరు: గాంధీభవన్లో మల్లు రవి హాట్ కామెంట్స్..🔥* వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యమని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు. ఇవాళ గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన మంత్రి కొండా సురేఖ ను మంత్రి పదవి నుంచి, చిన్నారెడ్డి ని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని అధిష్టానానికి నివేదిక పంపినట్లుగా తెలిపారు. ఆ ఇద్దరి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, క్రమశిక్షణా చర్యలు అత్యంత కఠినంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నివేదిక ఇచ్చామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతీసే పనులు ఎవరూ చేయవద్దని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దని నేతలకు సూచించారు. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేసిన చిన్నారెడ్డి మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోకపోతే పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. టీపీసీసీ చీఫ్ ఈ అంశాలన్నింటినీ మీనాక్షి నటరాజన్కు వివరిస్తారని, ఆమె వాటిని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తారని మల్లు రవి స్పష్టం చేశారు. *ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.* కొండా సురేఖ, చిన్నారెడ్డి విషయంలో తమ కమిటీ చేయాల్సిన పనిని పూర్తి చేసిందని, ఇకపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని మల్లు రవి అన్నారు. గతంలో కొండా సురేఖను హెచ్చరించినప్పటికీ ఆమె తీరు మారకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలనూ సమానంగా చూస్తుందని, ఇక్కడ ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణల ఆధారంగానే నివేదికను తయారు చేశామని పేర్కొన్నారు. హద్దులు దాటిన నేతలందరికీ ఒక స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు.
ఆ ఇద్దరితో పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరు: గాంధీభవన్లో మల్లు రవి హాట్ కామెంట్స్..🔥* వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యమని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు. ఇవాళ గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన మంత్రి కొండా సురేఖ ను మంత్రి పదవి నుంచి, చిన్నారెడ్డి ని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని అధిష్టానానికి నివేదిక పంపినట్లుగా తెలిపారు. ఆ ఇద్దరి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, క్రమశిక్షణా చర్యలు అత్యంత కఠినంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నివేదిక ఇచ్చామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతీసే పనులు ఎవరూ చేయవద్దని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దని నేతలకు సూచించారు. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేసిన చిన్నారెడ్డి మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోకపోతే పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. టీపీసీసీ చీఫ్ ఈ అంశాలన్నింటినీ మీనాక్షి నటరాజన్కు వివరిస్తారని, ఆమె వాటిని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తారని మల్లు రవి స్పష్టం చేశారు. *ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.* కొండా సురేఖ, చిన్నారెడ్డి విషయంలో తమ కమిటీ చేయాల్సిన పనిని పూర్తి చేసిందని, ఇకపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని మల్లు రవి అన్నారు. గతంలో కొండా సురేఖను హెచ్చరించినప్పటికీ ఆమె తీరు మారకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలనూ సమానంగా చూస్తుందని, ఇక్కడ ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణల ఆధారంగానే నివేదికను తయారు చేశామని పేర్కొన్నారు. హద్దులు దాటిన నేతలందరికీ ఒక స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు.
- నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* *-తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు. సూర్యాపేట సిటీ:: *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కొంతకాలంగా కాలువలో నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నీటి విడుదలతో ఉపశమనం లభించింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.1
- మల్కాజ్గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మల్కాజ్గిరి: మల్కాజ్గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.1
- తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.1
- స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.1
- *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1